రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న ఆయన.. ఇటీవలే కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్లో ఉన్నట్లు కోవింద్ ట్వీట్ చేశారు. ఎయిమ్స్, ఆర్మీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
![KOVIND](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11377360_eyxuq-hu4auuvqj-1.jpg)
"సర్జరీ జరిగిన తర్వాత రాష్ట్రపతి భవన్కు చేరుకున్నాను. నేను వేగంగా కోలుకోవాలని మీరంతా చేసిన ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఎయిమ్స్, ఆర్మీ ఆర్ఆర్ ఆస్పత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సేవలు అసాధారణం. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడిని. ఇంటికి తిరిగిరావడం సంతోషం."
-రాష్ట్రపతి ట్వీట్
![kovind discharged form aiims delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11377360_eyxup5nvcaepgto-1.jpg)
75 ఏళ్ల కోవింద్కు.. మార్చి 30న బైపాస్ సర్జరీ జరిగింది. కోవింద్ను.. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చినట్లు ఏప్రిల్ 3న రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు కోవింద్.
ఇదీ చదవండి: వాడిన మాస్కులతో పరుపులు- ఓ సంస్థ నిర్వాకం