ETV Bharat / bharat

ఎన్​సీపీ అధినేతతో ప్రశాంత్​ కిశోర్​ భేటీ

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ భేటీ అయ్యారు. రాజకీయ వ్యూహకర్త బాధ్యతల నుంచి ఇటీవల ప్రశాంత్​ తప్పుకున్న నేపథ్యంలో.. ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

author img

By

Published : Jun 11, 2021, 6:30 PM IST

Prashant Kishor meets Sharad Pawar, ప్రశాంత్​ కిషోర్ శరద్​ పవార్​
ఎన్​సీపీ అధినేతతో ప్రశాంత్​ కిశోర్​ భేటీ

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​తో ఆయన నివాసంలో శుక్రవారం భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక నుంచి రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టను అని ఇటీవల ప్రశాంత్​ కిశోర్​ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

పవార్​తో భేటీ మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ముగిసింది. అయితే ఈ భేటీపై ప్రశాంత్​ కిశోర్​, పవార్​ స్పందించలేదు.

ఎన్​సీపీ నేతల స్పందన..

ఈ సమవేశంపై ఎన్​సీపీ నేతలు స్పందించారు. రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టను అని కిశోర్​ ఇప్పటికే ప్రకటించారని.. కాబట్టి భేటీకి ప్రాధాన్యం లేదని అని ఉపముఖ్యమంత్రి అజిత్​ పవార్ పేర్కొన్నారు. అసలు ఈ భేటీపై తనకు ఎలాంటి సమాచారం తెలియదని మరో ఎన్సీపీ నేత ఛగ్గన్​ భుజ్బల్​ అన్నారు. అయితే కిశోర్​ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త కావడం వల్ల పవార్​ కచ్చితంగా ఆయన సలహాలను తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.

శివసేన నేత సంజయ్​ రౌత్​ కూడా ఈ విషయంపై స్పందించారు. చాలా మంది నేతలు కిశోర్​ను సంప్రదిస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్​ రాయ్​

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​ ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​తో ఆయన నివాసంలో శుక్రవారం భేటీ అయ్యారు. సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక నుంచి రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టను అని ఇటీవల ప్రశాంత్​ కిశోర్​ ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

పవార్​తో భేటీ మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ముగిసింది. అయితే ఈ భేటీపై ప్రశాంత్​ కిశోర్​, పవార్​ స్పందించలేదు.

ఎన్​సీపీ నేతల స్పందన..

ఈ సమవేశంపై ఎన్​సీపీ నేతలు స్పందించారు. రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టను అని కిశోర్​ ఇప్పటికే ప్రకటించారని.. కాబట్టి భేటీకి ప్రాధాన్యం లేదని అని ఉపముఖ్యమంత్రి అజిత్​ పవార్ పేర్కొన్నారు. అసలు ఈ భేటీపై తనకు ఎలాంటి సమాచారం తెలియదని మరో ఎన్సీపీ నేత ఛగ్గన్​ భుజ్బల్​ అన్నారు. అయితే కిశోర్​ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త కావడం వల్ల పవార్​ కచ్చితంగా ఆయన సలహాలను తీసుకుంటారని అభిప్రాయపడ్డారు.

శివసేన నేత సంజయ్​ రౌత్​ కూడా ఈ విషయంపై స్పందించారు. చాలా మంది నేతలు కిశోర్​ను సంప్రదిస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్​ రాయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.