ETV Bharat / bharat

ఎన్నికల వేళ అక్కడ 18 కిలోల బంగారం పట్టివేత

పుదుచ్చేరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పోలీసు తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు 9 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని కేరళలో ప్రముఖ నగల దుకాణంలో డెలివరీ చేయనున్నట్లు సమాచారం.

author img

By

Published : Mar 6, 2021, 9:58 AM IST

Police seize 9 crores gold in mahe, Puducherry
పుదుచ్చేరిలో 18కిలోల బంగారం పట్టివేత

పుదుచ్చేరి పోలీసు తనిఖీల్లో భారీస్థాయిలో బంగారాన్ని పోలీసులు సీజ్​ చేశారు. పూళితళ వద్ద సోదాలు నిర్వహిస్తుండగా.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్​ సంఖ్యతో ఉన్న వాహనంలో భారీస్థాయిలో రవాణా అవుతోన్న బంగారాన్ని కనుగొన్నారు. సుమారు 18 కిలోలున్న ఈ బంగారం ధర దాదాపు రూ.9కోట్లు ఉంటుందని తెలిపారు.

దీనిని కేరళలోని మలబార్​ గోల్డ్​ నగల దుకాణంలో డెలివరీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు వాహనంలో ఉన్న వ్యక్తులు తెలిపారని.. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్​ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ అంశంపై ఆదాయ పన్ను విభాగంతో పాటు.. వస్తుసేవల పన్ను(జీఎస్​టీ) అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఆరు చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పుదుచ్చేరి పోలీసు తనిఖీల్లో భారీస్థాయిలో బంగారాన్ని పోలీసులు సీజ్​ చేశారు. పూళితళ వద్ద సోదాలు నిర్వహిస్తుండగా.. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్​ సంఖ్యతో ఉన్న వాహనంలో భారీస్థాయిలో రవాణా అవుతోన్న బంగారాన్ని కనుగొన్నారు. సుమారు 18 కిలోలున్న ఈ బంగారం ధర దాదాపు రూ.9కోట్లు ఉంటుందని తెలిపారు.

దీనిని కేరళలోని మలబార్​ గోల్డ్​ నగల దుకాణంలో డెలివరీ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు వాహనంలో ఉన్న వ్యక్తులు తెలిపారని.. అయితే సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో సీజ్​ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ అంశంపై ఆదాయ పన్ను విభాగంతో పాటు.. వస్తుసేవల పన్ను(జీఎస్​టీ) అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు ఆరు చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఎన్నికల వేళ రూ.170 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు

చెన్నై టైల్స్​ సంస్థలో రూ.220 కోట్ల నల్లధనం గుర్తింపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.