ETV Bharat / bharat

రెండు రోజుల పాటు బంగ్లాదేశ్​లో మోదీ పర్యటన

author img

By

Published : Mar 25, 2021, 8:29 PM IST

కరోనా తర్వాత తొలి విదేశీ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్​కు వెళ్తుండటంపై హర్షం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నట్టు తెలిపారు.

modi
బంగ్లాదేశ్​ పర్యటనపై ప్రధాని మోదీ హర్షం

కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడ పర్యటించనున్నట్టు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లడం, అందులోనూ స్నేహపూర్వక పొరుగు దేశమైన బంగ్లాకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఎంతో గాఢమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉన్నాయని ప్రధాని గుర్తుచేసుకున్నారు.

శుక్రవారం బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్‌ రెహ్మాన్‌ శతజయంతి వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. గత శతాబ్దంలో ఆయన ఓ మహోన్నత నేతగా కొనియాడారు. ముజిబుర్‌ ఆలోచనలు, జీవితం కోట్లాది మందికి ప్రేరణగా నిలిచాయని గుర్తుచేసుకున్నారు. తుంగైపరలోని బంగబంధు ముజిబుర్‌ సమాధిని సందర్శించి నివాళులర్పిస్తానని తెలిపారు.

దూరదృష్టి కలిగిన హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక, అభివృద్ధి పురోగమనాన్ని ప్రశంసించడమే కాకుండా, ఆ దేశ విజయాలకు భారత్‌ మద్దతు ఉంటుందని చెప్పేందుకు ఈ పర్యటన ఓ సూచికగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై బంగ్లాదేశ్ చేస్తున్న పోరాటానికి మద్దతును తెలియజేస్తానన్నారు.

ఇదీ చదవండి : 'ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?'

కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా ఆహ్వానం మేరకు రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో అక్కడ పర్యటించనున్నట్టు పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లడం, అందులోనూ స్నేహపూర్వక పొరుగు దేశమైన బంగ్లాకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఎంతో గాఢమైన సాంస్కృతిక, భాషా సంబంధాలు ఉన్నాయని ప్రధాని గుర్తుచేసుకున్నారు.

శుక్రవారం బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. దీంతో పాటు బంగబంధు షేక్ ముజిబుర్‌ రెహ్మాన్‌ శతజయంతి వేడుకలు కూడా ప్రారంభం కానున్నాయన్నారు. గత శతాబ్దంలో ఆయన ఓ మహోన్నత నేతగా కొనియాడారు. ముజిబుర్‌ ఆలోచనలు, జీవితం కోట్లాది మందికి ప్రేరణగా నిలిచాయని గుర్తుచేసుకున్నారు. తుంగైపరలోని బంగబంధు ముజిబుర్‌ సమాధిని సందర్శించి నివాళులర్పిస్తానని తెలిపారు.

దూరదృష్టి కలిగిన హసీనా నాయకత్వంలో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక, అభివృద్ధి పురోగమనాన్ని ప్రశంసించడమే కాకుండా, ఆ దేశ విజయాలకు భారత్‌ మద్దతు ఉంటుందని చెప్పేందుకు ఈ పర్యటన ఓ సూచికగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై బంగ్లాదేశ్ చేస్తున్న పోరాటానికి మద్దతును తెలియజేస్తానన్నారు.

ఇదీ చదవండి : 'ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.