ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్ 5) సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ, అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించనున్న కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో ప్రధాని పాల్గొననున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
ఈ సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ.. రైతులతోనూ సమావేశం కానున్నట్లు తెలిపింది. ఇథనాల్, బయోగ్యాస్ వినియోగంపై రైతులతో మోదీ చర్చించనున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి : టీకా వృథాను అరికట్టాలి: మోదీ