ETV Bharat / bharat

జల సంరక్షణ ఉద్యమానికి మోదీ శ్రీకారం

వాన నీటి సంరక్షణపై​ ప్రచార కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30 వరకు జరగనుంది.

author img

By

Published : Mar 22, 2021, 1:29 PM IST

modi
జల్​ శక్తి అభియాన్​ను ప్రారంభించిన ప్రధాని

సమర్థమైన నీటి సంరక్షణ చర్యలు చేపట్టనిదే భారత్ వేగంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమనేది.. నీటి వనరులు, వాటి అనుసంధానం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు.

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణ కోసం 'క్యాచ్ ది రెయిన్​' కార్యక్రమాన్ని ప్రారంభించారు మోదీ. వచ్చే 100 రోజులు వాన నీటి పరిరక్షణ కోసం అంకితం కావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాకాలం వచ్చేంత వరకు ఉపాధి హామీ నిధులన్నీ వాన నీటి సంరక్షణ కోసమే ఖర్చు చేయాలని ఆకాంక్షించారు. వర్షపు నీటి వృథాపై ఆందోళన వ్యక్తం చేశారు.

"నీటి వనరుల అనుసంధానంపైనే భారతదేశం స్వయం సమృద్ధి సాధించడం ఆధారపడి ఉంది. అందుకే ఈ విషయంపై మా ప్రభుత్వం దృష్టిసారించింది. మన పూర్వీకులు అనేక నీటి వనరులను మనకు ఇచ్చారు. వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత. భారత్​లో మెజారిటీ వర్షపు నీరు వృథా అవుతోంది. వాన నీటిని ఎంతగా పరిరక్షిస్తే.. భూగర్భ జలాలపై ఆధారపడటం అంతగా తగ్గుతుంది. "

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 4 కోట్ల కుటుంబాలకు నల్లా నీరు అందుతోందని చెప్పారు మోదీ. ఈ కార్యక్రమంలో మరింత మంది మహిళలను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. నీటి విలువ మహిళల కన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదని.. వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

'క్యాచ్ ది రెయిన్'లో భాగంగా మార్చి 22 నుంచి నవంబర్​ 30 వరకు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ నీటి సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణ చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం.

నదీ జలాల ఒప్పందం..

ఇదే కార్యక్రమంలో భాగంగా... జల్​ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. కెన్​, బేట్వా నది అనుసంధానం ప్రాజెక్టుపైన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ సహా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్ సంతకాలు చేశారు. దౌదన్​ ప్రాజెక్టు నిర్మించి కేన్​ నది జలాలను బేట్వా నదికి తరలిస్తారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 10.62 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి రానుంది. 62 లక్షల మందికి తాగు నీరు అందనుంది. 103 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​లో నీటి ఎద్దడి ఎదుర్కొనే జిల్లాలకు నీరు అందనుంది.

ఇదీ చదవండి : 'క్యాచ్​ ద రైన్'తో కేంద్రం జలసంరక్షణా యజ్ఞం

సమర్థమైన నీటి సంరక్షణ చర్యలు చేపట్టనిదే భారత్ వేగంగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారతదేశం స్వయం సమృద్ధి సాధించడమనేది.. నీటి వనరులు, వాటి అనుసంధానం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు.

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణ కోసం 'క్యాచ్ ది రెయిన్​' కార్యక్రమాన్ని ప్రారంభించారు మోదీ. వచ్చే 100 రోజులు వాన నీటి పరిరక్షణ కోసం అంకితం కావాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వర్షాకాలం వచ్చేంత వరకు ఉపాధి హామీ నిధులన్నీ వాన నీటి సంరక్షణ కోసమే ఖర్చు చేయాలని ఆకాంక్షించారు. వర్షపు నీటి వృథాపై ఆందోళన వ్యక్తం చేశారు.

"నీటి వనరుల అనుసంధానంపైనే భారతదేశం స్వయం సమృద్ధి సాధించడం ఆధారపడి ఉంది. అందుకే ఈ విషయంపై మా ప్రభుత్వం దృష్టిసారించింది. మన పూర్వీకులు అనేక నీటి వనరులను మనకు ఇచ్చారు. వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత. భారత్​లో మెజారిటీ వర్షపు నీరు వృథా అవుతోంది. వాన నీటిని ఎంతగా పరిరక్షిస్తే.. భూగర్భ జలాలపై ఆధారపడటం అంతగా తగ్గుతుంది. "

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'జల్ జీవన్ మిషన్' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 4 కోట్ల కుటుంబాలకు నల్లా నీరు అందుతోందని చెప్పారు మోదీ. ఈ కార్యక్రమంలో మరింత మంది మహిళలను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. నీటి విలువ మహిళల కన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదని.. వారిని ఇందులో భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

'క్యాచ్ ది రెయిన్'లో భాగంగా మార్చి 22 నుంచి నవంబర్​ 30 వరకు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ నీటి సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణ చేపట్టడం దీని ముఖ్య ఉద్దేశం.

నదీ జలాల ఒప్పందం..

ఇదే కార్యక్రమంలో భాగంగా... జల్​ శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాలు కీలక ఒప్పందం చేసుకున్నాయి. కెన్​, బేట్వా నది అనుసంధానం ప్రాజెక్టుపైన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్​ షెకావత్​ సహా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్ చౌహాన్ సంతకాలు చేశారు. దౌదన్​ ప్రాజెక్టు నిర్మించి కేన్​ నది జలాలను బేట్వా నదికి తరలిస్తారు.

ఈ ప్రాజెక్టు ద్వారా 10.62 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి రానుంది. 62 లక్షల మందికి తాగు నీరు అందనుంది. 103 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగనుంది. మధ్యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​లో నీటి ఎద్దడి ఎదుర్కొనే జిల్లాలకు నీరు అందనుంది.

ఇదీ చదవండి : 'క్యాచ్​ ద రైన్'తో కేంద్రం జలసంరక్షణా యజ్ఞం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.