ETV Bharat / bharat

'శాంతియుత ఉద్యమం చేయకుంటే అది మోదీ విజయమే'

author img

By

Published : Jan 30, 2021, 7:48 PM IST

రైతులు శాంతియుతంగా ఉద్యమం చేపట్టకపోతే అది ప్రధాని మోదీ విజయం అవుతుందని అన్నారు భారతీయ కిసాన్​ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్​ సింగ్​. దిల్లీ సరిహద్దులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కేంద్రం తీరుపై మండిపడ్డారు.

pm-modi-will-win-if-agitation-does-not-go-peacefully-bku-president
'శాంతియుత ఉద్యమం చేయకుంటే అది మోదీ విజయమే'

అనుకున్న రీతిలో ఉద్యమం చేయడంలో రైతులు విఫలమైతే అది ప్రధాని మోదీ విజయం అవుతుందని హెచ్చరించారు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ రాజేవల్. రైతులను అవమానించేలా కేంద్రం ప్రవర్తించిందని మండిపడ్డారు.

"రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీలో ఇంటర్నెట్​ సేవలు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఆందోళన శాంతియుతంగా చేపట్టాలని రైతులను కోరుతున్నా. అందరూ రైతులకు మద్దతుగా నిలవాలి. ఇతరుల ప్రేరణతో ఆవేతపూరిత చర్యలకు పాల్పడొద్దు. ఇది మన దేశం. మనం వెళ్తోంది యుద్ధం చేయడానికి కాదు అనేది అందరం గుర్తుంచుకోవాలి."

-బల్బీర్​ సింగ్, భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు.

కిసాన్​ పరేడ్​ సందర్భంగా జరిగిన అల్లర్ల దృష్ట్యా... ప్రస్తుతం సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఎలా సాగుతుందో వివరించారు బల్బీర్​ సింగ్. ఇది అతిపెద్ద రైతు ఉద్యమం అని అభివర్ణించారు. ఫిబ్రవరి 2 వరకు మరికొంత మంది తమకు మద్దతు పలకనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధ ఏంటో అర్థం చేసుకుని సాగు చట్టాలను రద్దు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:జంతు చర్మాలు ఇంట్లో దాచిన వ్యక్తి అరెస్ట్​

అనుకున్న రీతిలో ఉద్యమం చేయడంలో రైతులు విఫలమైతే అది ప్రధాని మోదీ విజయం అవుతుందని హెచ్చరించారు భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు బల్బీర్ సింగ్ రాజేవల్. రైతులను అవమానించేలా కేంద్రం ప్రవర్తించిందని మండిపడ్డారు.

"రైతుల ఆందోళన నేపథ్యంలో దిల్లీలో ఇంటర్నెట్​ సేవలు నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో ఆందోళన శాంతియుతంగా చేపట్టాలని రైతులను కోరుతున్నా. అందరూ రైతులకు మద్దతుగా నిలవాలి. ఇతరుల ప్రేరణతో ఆవేతపూరిత చర్యలకు పాల్పడొద్దు. ఇది మన దేశం. మనం వెళ్తోంది యుద్ధం చేయడానికి కాదు అనేది అందరం గుర్తుంచుకోవాలి."

-బల్బీర్​ సింగ్, భారతీయ కిసాన్​ యూనియన్​ అధ్యక్షుడు.

కిసాన్​ పరేడ్​ సందర్భంగా జరిగిన అల్లర్ల దృష్ట్యా... ప్రస్తుతం సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఎలా సాగుతుందో వివరించారు బల్బీర్​ సింగ్. ఇది అతిపెద్ద రైతు ఉద్యమం అని అభివర్ణించారు. ఫిబ్రవరి 2 వరకు మరికొంత మంది తమకు మద్దతు పలకనున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల బాధ ఏంటో అర్థం చేసుకుని సాగు చట్టాలను రద్దు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:జంతు చర్మాలు ఇంట్లో దాచిన వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.