ETV Bharat / bharat

మోదీ-బోరిస్​ ఫోన్ సంభాషణ.. వ్యాక్సిన్ సర్టిఫికేట్​పై చర్చ!

author img

By

Published : Oct 11, 2021, 4:23 PM IST

Updated : Oct 12, 2021, 5:42 AM IST

బ్రిటన్​ ప్రధాని బోరిస్ జాన్సన్​తో ఫోన్లో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అఫ్గాన్​లో ప్రస్తుత పరిస్థితులు, ప్రయాణ ఆంక్షలు, వాతావరణ మార్పు లక్ష్యాలు వంటి కీలక అంశాలపై చర్చించారు. వ్యాక్సిన్ సర్టిఫికేట్​ను అధికారికంగా గుర్తించేందుకు ఇరు దేశాధినేతలు అంగీకరించారు.

PM modi, UK PM Boris Johnson
బోరిస్​కు మోదీ ఫోన్​.. కాప్​-26పై చర్చ

భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్​ టెలిఫోన్లో సంభాషించారు. అంతర్జాతీయ వ్యవహారాలు, అఫ్గాన్ పరిస్థితులు, వాతావరణ మార్పు లక్ష్యాలు వంటి కీలక విషయాలపై చర్చించారు. భారత వ్యాక్సిన్ సర్టిఫికేట్​ను అధికారికంగా గుర్తించేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వ​ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు.

" అఫ్గాన్​లో ప్రస్తుత పరిస్థితిపై మోదీ, బోరిస్ చర్చించారు. తాలిబన్లతో సంబంధాల విషయమై అంతర్జాతీయంగా సమన్వయంతో ముందుకుసాగాలని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్​లో మానవహక్కులను కాపాడాల్సిన అవశ్యకతను ప్రస్తావించారు. కరోనాపై ఉమ్మడి పోరు, అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై మాట్లాడారు. భారత్​-బ్రిటన్​ రోడ్​మ్యాప్​ 2030లోని లక్ష్యాల సాధనలో పురోగతిపై బోరిస్​, మోదీ చర్చించారు"

-బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి.

అక్టోబర్​ 31 నుంచి నవంబర్​ 12 వరకు గ్లాస్గోలో జరగనున్న వాతావరణ శిఖరాగ్ర సదస్సు కాప్​-26 నేపథ్యంలో వాతావరణ మార్పు లక్ష్యాల పురోగతిపైనా మోదీతో బోరిస్​ చర్చించారు. పునరుత్పాదక ఇంధన శక్తిలో భారత్​ ఇప్పటికే ప్రపంచ దేశాలతో పోల్చితే ముందుందని, త్వరలోనే కర్బన ఉద్గారాలు సున్నాకు చేరతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత్​-బ్రిటన్​ సంబంధాలపైనా బోరిస్​ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో ఇరు దేశాలు రూపొందించిన రోడ్​మ్యాప్​-2030 లక్ష్యాల పురోగతిని స్వాగతించారు.

అఫ్గాన్​పై నేడు జీ-20 సదస్సు..

అఫ్గానిస్థాన్​ అంశంపై చర్చించడానికి జీ-20 దేశాల అసాధారణ సమావేశం మంగళవారం వర్చువల్​గా జరగనుంది. ప్రధాని మోదీ దీనిలో పాల్గొంటారు. తాలిబన్లు కైవసం చేసుకొన్న తరువాత అఫ్గాన్​లో నెలకొన్న పరిస్థితులపై నేతలు సమగ్రంగా చర్చించనున్నారు. అక్కడి ప్రజల అవసరాలు, వారి భద్రత, ఉగ్రవాదంపై పోరు, మానవ హక్కులు వంటి అంశాలు అజెండాలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: 15ఏళ్ల స్టూడెంట్​తో రిలేషన్​- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్​ టెలిఫోన్లో సంభాషించారు. అంతర్జాతీయ వ్యవహారాలు, అఫ్గాన్ పరిస్థితులు, వాతావరణ మార్పు లక్ష్యాలు వంటి కీలక విషయాలపై చర్చించారు. భారత వ్యాక్సిన్ సర్టిఫికేట్​ను అధికారికంగా గుర్తించేందుకు ఇరు దేశాల ప్రధానులు అంగీకరించారు. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వ​ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు.

" అఫ్గాన్​లో ప్రస్తుత పరిస్థితిపై మోదీ, బోరిస్ చర్చించారు. తాలిబన్లతో సంబంధాల విషయమై అంతర్జాతీయంగా సమన్వయంతో ముందుకుసాగాలని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్​లో మానవహక్కులను కాపాడాల్సిన అవశ్యకతను ప్రస్తావించారు. కరోనాపై ఉమ్మడి పోరు, అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై మాట్లాడారు. భారత్​-బ్రిటన్​ రోడ్​మ్యాప్​ 2030లోని లక్ష్యాల సాధనలో పురోగతిపై బోరిస్​, మోదీ చర్చించారు"

-బ్రిటన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి.

అక్టోబర్​ 31 నుంచి నవంబర్​ 12 వరకు గ్లాస్గోలో జరగనున్న వాతావరణ శిఖరాగ్ర సదస్సు కాప్​-26 నేపథ్యంలో వాతావరణ మార్పు లక్ష్యాల పురోగతిపైనా మోదీతో బోరిస్​ చర్చించారు. పునరుత్పాదక ఇంధన శక్తిలో భారత్​ ఇప్పటికే ప్రపంచ దేశాలతో పోల్చితే ముందుందని, త్వరలోనే కర్బన ఉద్గారాలు సున్నాకు చేరతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత్​-బ్రిటన్​ సంబంధాలపైనా బోరిస్​ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది మేలో ఇరు దేశాలు రూపొందించిన రోడ్​మ్యాప్​-2030 లక్ష్యాల పురోగతిని స్వాగతించారు.

అఫ్గాన్​పై నేడు జీ-20 సదస్సు..

అఫ్గానిస్థాన్​ అంశంపై చర్చించడానికి జీ-20 దేశాల అసాధారణ సమావేశం మంగళవారం వర్చువల్​గా జరగనుంది. ప్రధాని మోదీ దీనిలో పాల్గొంటారు. తాలిబన్లు కైవసం చేసుకొన్న తరువాత అఫ్గాన్​లో నెలకొన్న పరిస్థితులపై నేతలు సమగ్రంగా చర్చించనున్నారు. అక్కడి ప్రజల అవసరాలు, వారి భద్రత, ఉగ్రవాదంపై పోరు, మానవ హక్కులు వంటి అంశాలు అజెండాలో ఉన్నాయని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: 15ఏళ్ల స్టూడెంట్​తో రిలేషన్​- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్

Last Updated : Oct 12, 2021, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.