ETV Bharat / bharat

నేడు కశ్మీర్ నేతలతో మోదీ కీలక భేటీ

author img

By

Published : Jun 24, 2021, 5:17 AM IST

Updated : Jun 24, 2021, 7:53 AM IST

గుప్కార్​ కూటమి నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ నేడు భేటీ కానున్నారు. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనే విషయంపై ప్రాధాన్యం సంతరించుకుంది.

gupkar alliance meeting with modi, ప్రధాని నరేంద్ర మోదీ గుప్కార్​ నేతలు
నేడు కశ్మీర్ నేతలతో మోదీ కీలక భేటీ

జమ్ము కశ్మీర్​కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భేటీ కానున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్​లోన్​ తదితరులు భేటీలో పాల్గొననున్నారు. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్​ షా సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశం అజెండా ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనేవి గుప్కార్​ కూటమి ప్రధాన డిమాండ్లు.

మరోవైపు ఆర్టికల్​ 370 రద్దుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భేటీ కీలకంగా మారింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనే విషయంపై ప్రాధాన్యం సంతరించుకుంది.

కూటమి వెనక్కి తగ్గుతుందా?

ఆర్టికల్​ 370, ప్రత్యేక హోదాల పునరుద్ధరణకు సంబంధించి వెనక్కి తగ్గేది లేదని గుప్కార్​ ఇదివరకు ఉద్ఘాటించినా.. చర్చలపై కేంద్రం ప్రకటన చేసిన తర్వాత వారిలో మార్పు వచ్చింది. 'కశ్మీర్​లో ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరిస్తే చాలు' అనుకునే పరిస్థితిలో నేతలు ఉన్నారని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత 4జీ ఇంటర్నెట్ పునరుద్ధరణపైనే ఎక్కువగా మాట్లాడారు.

అయితే, ఒమర్ తండ్రి.. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా మాత్రం మోదీ సర్కారుకు కొద్దిగా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. డిమాండ్లను నెరవేర్చకుండా ఇతర పరిష్కారాలను ప్రతిపాదించడం కేంద్రానికి కత్తిమీద సామే.

కేంద్రం వ్యూహం..

గుప్కార్​ కూటమి నేతలతో జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయని కేంద్రం ఆశిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా రద్దును పునరుద్ధరించాలని మంకుపట్టు పట్టినవారిని బుజ్జగించగలిగే రాజకీయ నాయకులను రంగంలోకి దింపింది. మెహబూబా ముఫ్తీ నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించే ఆమె మామ సర్తజ్​ మదినీ విడుదల చేసింది. భాజపాతో సన్నిహితంగా ఉండే మరో నేత సజాద్ ​లోనే ఈ సమావేశంలో భాగం చేసింది.

రాజకీయ ప్రక్రియను పునరుద్ధరించడం.. ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్​పై అంతర్జాతీయంగా జరిగిన చర్చకు పూర్తిగా చెక్ పెట్టినట్లు అవుతుంది. ప్రత్యేక హోదా లేకుండా కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు వచ్చేలా చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటే.. ఈ ప్రాంతం భారత్​లో అంతర్భాగమనే సందేశం అన్ని దేశాలకూ వెళ్తుంది.

ఉత్తర్​ప్రదేశ్ సహా 2022లో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం భాజపా గెలుపునకు దోహదం చేస్తుంది.

హై అలర్ట్​..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా శుక్రవారం జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : 'ప్రజల మధ్య కనిపించరు.. ట్విట్టర్​లోనే దర్శనం'

జమ్ము కశ్మీర్​కు చెందిన 14 మంది నేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భేటీ కానున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, జమ్ముకశ్మీర్​ అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ, పీపుల్స్​ కాన్ఫరెన్స్​ నాయకుడు సజ్జాద్​లోన్​ తదితరులు భేటీలో పాల్గొననున్నారు. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత అక్కడి నేతలతో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్​ షా సహా పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. అయితే ఈ సమావేశం అజెండా ఏమిటన్నది తెలియాల్సి ఉంది.

ఆర్టికల్ 370 రద్దుకు ముందున్న పరిస్థితులను పునరుద్ధరించడం, ప్రత్యేక హోదా రద్దును వెనక్కి తీసుకోవడం అనేవి గుప్కార్​ కూటమి ప్రధాన డిమాండ్లు.

మరోవైపు ఆర్టికల్​ 370 రద్దుపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భేటీ కీలకంగా మారింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు అనే విషయంపై ప్రాధాన్యం సంతరించుకుంది.

కూటమి వెనక్కి తగ్గుతుందా?

ఆర్టికల్​ 370, ప్రత్యేక హోదాల పునరుద్ధరణకు సంబంధించి వెనక్కి తగ్గేది లేదని గుప్కార్​ ఇదివరకు ఉద్ఘాటించినా.. చర్చలపై కేంద్రం ప్రకటన చేసిన తర్వాత వారిలో మార్పు వచ్చింది. 'కశ్మీర్​లో ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరిస్తే చాలు' అనుకునే పరిస్థితిలో నేతలు ఉన్నారని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత 4జీ ఇంటర్నెట్ పునరుద్ధరణపైనే ఎక్కువగా మాట్లాడారు.

అయితే, ఒమర్ తండ్రి.. డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా మాత్రం మోదీ సర్కారుకు కొద్దిగా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. డిమాండ్లను నెరవేర్చకుండా ఇతర పరిష్కారాలను ప్రతిపాదించడం కేంద్రానికి కత్తిమీద సామే.

కేంద్రం వ్యూహం..

గుప్కార్​ కూటమి నేతలతో జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయని కేంద్రం ఆశిస్తోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక హోదా రద్దును పునరుద్ధరించాలని మంకుపట్టు పట్టినవారిని బుజ్జగించగలిగే రాజకీయ నాయకులను రంగంలోకి దింపింది. మెహబూబా ముఫ్తీ నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించే ఆమె మామ సర్తజ్​ మదినీ విడుదల చేసింది. భాజపాతో సన్నిహితంగా ఉండే మరో నేత సజాద్ ​లోనే ఈ సమావేశంలో భాగం చేసింది.

రాజకీయ ప్రక్రియను పునరుద్ధరించడం.. ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠ మరింత పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్​పై అంతర్జాతీయంగా జరిగిన చర్చకు పూర్తిగా చెక్ పెట్టినట్లు అవుతుంది. ప్రత్యేక హోదా లేకుండా కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు వచ్చేలా చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటే.. ఈ ప్రాంతం భారత్​లో అంతర్భాగమనే సందేశం అన్ని దేశాలకూ వెళ్తుంది.

ఉత్తర్​ప్రదేశ్ సహా 2022లో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశం భాజపా గెలుపునకు దోహదం చేస్తుంది.

హై అలర్ట్​..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకించి నియంత్రణ రేఖ ప్రాంతాల్లో 48 గంటలపాటు హై అలర్ట్‌ విధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా శుక్రవారం జమ్ముకశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను సైతం నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : 'ప్రజల మధ్య కనిపించరు.. ట్విట్టర్​లోనే దర్శనం'

Last Updated : Jun 24, 2021, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.