ETV Bharat / bharat

'కరోనా కట్టడిలో మోదీ విఫలం.. రాజీనామా చేయాలి'

author img

By

Published : Apr 18, 2021, 6:46 PM IST

కరోనాను కట్టడి చేయటంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. ప్రధాని.. తన కీర్తిని పెంచుకునేందుకు ఇతర దేశాలకు వ్యాక్సిన్​ పంపించారని, ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత నెలకొందని మండిపడ్డారు.

mamata on modi
మోదీపై మమత ధ్వజం

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని ఆరోపించారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. వైరస్​ను కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కోల్​కతాలోని దాకురియా బ్రిడ్జ్ నుంచి కాళీఘాట్​ క్రాసింగ్ వరకు రోడ్ షో నిర్వహించారు మమత. బంగాల్​కు 5కోట్ల 40లక్షల టీకా డోసులను పంపించాలని విజ్ఞప్తి చేసినా.. ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

mamata rally in kolkata
కొవిడ్ నిబంధనలు వదిలి ర్యాలీలో వేల మంది
amid covid-19 spread mamata rally in kolkata
కోల్​కతాలో దీదీ రోడ్​ షో

" వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి కార్యాచరణను పాటించలేదు. గుజరాత్​లో పరిస్థితి దయనీయంగా మారింది. దేశంలో ఆక్సిజన్​, ఔషధాల కొరతకు కారణం ఎవరు? బంగాల్​లో కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రానికి 5కోట్ల 40లక్షల టీకా డోసులు, ఆక్సిజన్‌, ఔషధాలను పంపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాను."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

80 దేశాలకు కరోనా వ్యాక్సిన్​ను ప్రధాని సరఫరా చేయటంపై మమత స్పందించారు. మోదీ.. తన కీర్తిని పెంచుకోవటం కోసమే ఇతర దేశాలకు వ్యాక్సిన్​లు పంపించారని ఆరోపించారు. ఇప్పుడు దేశంలో టీకాల కొరత నెలకొందన్నారు.

didi rally
కోల్​కతాలో దీదీ రోడ్ షో

ఇతర దేశాలకు వ్యాక్సిన్​లు పంపించేముందు మహారాష్ట్ర, యూపీ, బంగాల్​.. మిగతా రాష్ట్రాలకు అందించాలని సూచించారు.

ఇదీ చదవండి : రైల్వే సాయం కోరిన దిల్లీ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలానికి ప్రధాని నరేంద్ర మోదీ కారణమని ఆరోపించారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. వైరస్​ను కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కోల్​కతాలోని దాకురియా బ్రిడ్జ్ నుంచి కాళీఘాట్​ క్రాసింగ్ వరకు రోడ్ షో నిర్వహించారు మమత. బంగాల్​కు 5కోట్ల 40లక్షల టీకా డోసులను పంపించాలని విజ్ఞప్తి చేసినా.. ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

mamata rally in kolkata
కొవిడ్ నిబంధనలు వదిలి ర్యాలీలో వేల మంది
amid covid-19 spread mamata rally in kolkata
కోల్​కతాలో దీదీ రోడ్​ షో

" వైరస్​ను కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి కార్యాచరణను పాటించలేదు. గుజరాత్​లో పరిస్థితి దయనీయంగా మారింది. దేశంలో ఆక్సిజన్​, ఔషధాల కొరతకు కారణం ఎవరు? బంగాల్​లో కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రానికి 5కోట్ల 40లక్షల టీకా డోసులు, ఆక్సిజన్‌, ఔషధాలను పంపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాను."

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

80 దేశాలకు కరోనా వ్యాక్సిన్​ను ప్రధాని సరఫరా చేయటంపై మమత స్పందించారు. మోదీ.. తన కీర్తిని పెంచుకోవటం కోసమే ఇతర దేశాలకు వ్యాక్సిన్​లు పంపించారని ఆరోపించారు. ఇప్పుడు దేశంలో టీకాల కొరత నెలకొందన్నారు.

didi rally
కోల్​కతాలో దీదీ రోడ్ షో

ఇతర దేశాలకు వ్యాక్సిన్​లు పంపించేముందు మహారాష్ట్ర, యూపీ, బంగాల్​.. మిగతా రాష్ట్రాలకు అందించాలని సూచించారు.

ఇదీ చదవండి : రైల్వే సాయం కోరిన దిల్లీ ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.