ETV Bharat / bharat

PM Modi: రాష్ట్రపతితో ప్రధాని మోదీ కీలక భేటీ

author img

By

Published : Jul 15, 2021, 10:41 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై రాష్ట్రపతితో చర్చించారు.

modi, PM
ప్రధాని మోదీ, నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. వారణాసి పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న మోదీ.. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి కోవింద్‌తో భేటీ కావడం గమనార్హం. పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్టు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. ఏయే అంశాలను రాష్ట్రపతితో చర్చించారనే విషయాలను మాత్రం పేర్కొనలేదు. మరోవైపు, ఈ నెల 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

PM Modi, Ramnath
మోదీ, రామ్​నాథ్ కోవింద్

గురువారం ఉదయం కాశీలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రూ.1500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసలు కురిపించారు.

ఇదీ చదవండి:

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. వారణాసి పర్యటన ముగించుకొని దిల్లీ చేరుకున్న మోదీ.. ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి కోవింద్‌తో భేటీ కావడం గమనార్హం. పలు కీలక అంశాలపై ఆయనతో ప్రధాని చర్చించినట్టు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. ఏయే అంశాలను రాష్ట్రపతితో చర్చించారనే విషయాలను మాత్రం పేర్కొనలేదు. మరోవైపు, ఈ నెల 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.

PM Modi, Ramnath
మోదీ, రామ్​నాథ్ కోవింద్

గురువారం ఉదయం కాశీలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ రూ.1500 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. కరోనా కట్టడిలో యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసలు కురిపించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.