ETV Bharat / bharat

ఆక్సిజన్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు

author img

By

Published : Apr 24, 2021, 3:22 PM IST

Updated : Apr 24, 2021, 3:50 PM IST

దేశంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా పెంచేందుకు ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్, సంబంధిత పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు ప్రకటించారు.

pM Modi chaired a meeting to review steps taken to boost oxygen availability in the country
ఆక్సిజన్ సరఫరా పెంపు కోసం మోదీ సమీక్ష

దేశంలో మెడికల్ ఆక్సిజన్​కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా పెంపుపై అధికారులతో సమావేశమయ్యారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మోదీ సూచించారు.

సరఫరా పెంచేందుకు.. ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయిస్తూ ఈ సమావేశంలో ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరికరాల దిగుమతిపై మూడు నెలల పాటు కస్టమ్స్ డ్యూటీ, హెల్త్​ సెస్​ను మినహాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. దిగుమతి చేసుకునే వ్యాక్సిన్లపైనా కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం వివిధ పరికరాల ధర తగ్గేందుకు దోహదం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతికి వెంటనే అనుమతులు ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాను పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఆస్పత్రులతో పాటు ఇంట్లో చికిత్స పొందుతున్న రోగులకు కావాల్సిన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

కేంద్రం నిర్ణయంతో.. ఆక్సిజన్ నిల్వ ట్యాంకులు, సిలిండర్లు, ఫిల్లింగ్ వ్యవస్థలు సహా సంబంధిత పరికరాల దిగుమతి మరింత సులభతరం కానుంది.

వాయుసేన సహకారంతో

ఆక్సిజన్​ సరఫరా పెంపు కోసం అనేక చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా.. కేంద్రం వివరించింది. సింగపూర్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను భారత వాయుసేన తీసుకొస్తోందని తెలిపింది. సమయాన్ని తగ్గించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకులను రవాణా చేస్తోందని వెల్లడించింది.

మరోవైపు, దిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల దిల్లీ ఎయిమ్స్‌లో ఎమర్జెన్సీ విభాగం మూసివేశారు.

ఇదీ చదవండి- 'టీకాలు ఉచితంగానే అందిస్తాం'

దేశంలో మెడికల్ ఆక్సిజన్​కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరా పెంపుపై అధికారులతో సమావేశమయ్యారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచేందుకు అన్ని మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మోదీ సూచించారు.

సరఫరా పెంచేందుకు.. ఆక్సిజన్‌, సంబంధిత పరికరాలపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయిస్తూ ఈ సమావేశంలో ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరికరాల దిగుమతిపై మూడు నెలల పాటు కస్టమ్స్ డ్యూటీ, హెల్త్​ సెస్​ను మినహాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని పేర్కొంది. దిగుమతి చేసుకునే వ్యాక్సిన్లపైనా కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ నిర్ణయం వివిధ పరికరాల ధర తగ్గేందుకు దోహదం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతికి వెంటనే అనుమతులు ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాను పెంచాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. ఆస్పత్రులతో పాటు ఇంట్లో చికిత్స పొందుతున్న రోగులకు కావాల్సిన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

కేంద్రం నిర్ణయంతో.. ఆక్సిజన్ నిల్వ ట్యాంకులు, సిలిండర్లు, ఫిల్లింగ్ వ్యవస్థలు సహా సంబంధిత పరికరాల దిగుమతి మరింత సులభతరం కానుంది.

వాయుసేన సహకారంతో

ఆక్సిజన్​ సరఫరా పెంపు కోసం అనేక చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా.. కేంద్రం వివరించింది. సింగపూర్ నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను భారత వాయుసేన తీసుకొస్తోందని తెలిపింది. సమయాన్ని తగ్గించేందుకు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకులను రవాణా చేస్తోందని వెల్లడించింది.

మరోవైపు, దిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆక్సిజన్ కొరత వల్ల దిల్లీ ఎయిమ్స్‌లో ఎమర్జెన్సీ విభాగం మూసివేశారు.

ఇదీ చదవండి- 'టీకాలు ఉచితంగానే అందిస్తాం'

Last Updated : Apr 24, 2021, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.