ETV Bharat / bharat

పీకే-ఐప్యాక్​ అస్త్రంతో భాజపాపై మళ్లీ దీదీ గురి!

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి.. మోదీకి ఎదురు నిలిచేది తానేననే సంకేతాలను ఇచ్చారు మమతా బెనర్జీ. ఈ ఉత్సాహంతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఇంతకీ భాజపాను దెబ్బ తీసేందుకు టీఎంసీ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? వాటి అమలులో ప్రశాంత్​ కిశోర్​​ పాత్ర ఎంత? టీఎంసీ- ఐప్యాక్​ జోడీ జాతీయ స్థాయిలో హిట్ అవుతుందా?

author img

By

Published : Jun 16, 2021, 4:20 PM IST

west bengal
బంగాల్​
  • దేశంలోని భాజపా వ్యతిరేక శక్తుల ఏకీకరణ
  • సార్వత్రిక ఎన్నికల లోపు ఇతర రాష్ట్రాల్లో టీఎంసీ విస్తరణ

ఈ రెండు వ్యూహాలతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తృణమూల్​ కాంగ్రెస్(All India Trinamool Congress)​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) భావిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో మమతను తిరుగులేని నేతగా నిలబెట్టేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​తో కలిసి టీఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇటీవల జరిగిన బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో హిట్​ కొట్టిన పీకే-ఐప్యాక్, టీఎంసీ జోడీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను దెబ్బతీసేందుకు ​వ్యూహ రచన చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం

2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బంగాల్​లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుని టీఎంసీకి భాజపా గట్టి పోటీ ఇచ్చింది. అయితే 2021లో ఆ హవాను కమలదళం కొనసాగించలేకపోయింది. కారణం.. ప్రశాంత్​ కిశోర్​​​ వ్యూహాలు, మమత ప్రజాకర్షణ శక్తి. ముందు చెప్పినట్లుగానే భాజపాను రెండంకెలకు పరిమితం చేసి.. సత్తా చాటింది ఈ ద్వయం. ప్రధాని మోదీ- అమిత్​ షా ద్వయానికి ఎదురొడ్డి.. 200కు పైగా సీట్లను గెలుచుకొని మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.

మమతా బెనర్జీ ప్రజాకర్షణ శక్తి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సమన్వయం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​​తో పాటు ఆయనకు చెందిన ఐప్యాక్​ సంస్థ వల్లే టీఎంసీకి ఈ విజయం సాధ్యమైంది.

ఈ ఎన్నికల్లో ఘన విజయం ద్వారా మోదీకి ఎదురు నిలిచేది తానేననే సంకేతాలను ఇచ్చారు మమత. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్​ కిశోర్​​​తో పాటు ఐప్యాక్​తో కలిసి సుదీర్ఘ కాలం పని చేయాలని మమత భావించినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇది నిజమైతే.. కేంద్ర రాజకీయాల్లో మమత సత్తా చాటేందుకు ప్రశాంత్​ కిశోర్​​​ వ్యూహాలు.. ఉపయోగపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

క్రియాశీలక రాజకీయల్లోకి పీకే?

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని పీకే ప్రకటించారు. క్రియాశీల రాజకీయల్లో ప్రవేశించేందుకే ఆయన​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఎంసీ-ఐప్యాక్​ పరస్పర అంగీకారంతోనే పీకే ఈ ప్రకటన చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంలో టీఎంసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. పార్టీ నాయకులు మాత్రం టీఎంసీ-ఐప్యాక్ మరో ఐదేళ్లు కలిసి పనిచేస్తాయని చెబుతున్నారు.

వ్యూహాలు ఇవే..

'తృణమూల్​ కాంగ్రెస్​ను జాతీయ పార్టీగా మలిచేందుకు చేసే ప్రయత్నాలు ఈసారి భిన్నంగా ఉంటాయి. కేవలం ఒకటి, రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికో, ఓట్ల వాటా పెంచుకోవడానికో పరిమితం కాబోము. భాజపాపై యుద్ధం చేసి, ఎన్నికల్లో గెలవడమే మా లక్ష్యం' అంటూ మమత బెనర్జీ అంతరంగాన్ని ఇటీవల ఆవిష్కరించారు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ.

అయితే అది సాధ్యం కావాలంటే.. రెండు వ్యూహాలను అనుసరించాలని టీఎంసీ నిర్ణయించింది.

1. దేశంలోని భాజపా వ్యతిరేక శక్తులను ఏకం చేయడం.

2. సార్వత్రిక ఎన్నికల లోపు టీఎంసీని ఇతర రాష్ట్రాల్లో గణనీయంగా విస్తరించడం

గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన 61,36,56,298 ఓట్లలో భాజపాకు పోలైన 22,90,76,879 ఓట్లు మినహాయిస్తే మిగతా 38,45,79,419 ఓట్లు ప్రతిపక్షాలకే దక్కాయి. వీటిని సంఘటితం చేసుకోగలిగితే, అధికార పక్షాన్ని నిలువరించే శక్తి ప్రతిపక్షాలకు దక్కుతుంది. వరుస ఓటములు, నేతల ఫిరాయింపులతో స్థైర్యం కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రతిపక్షాలను ఏకం చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని టీఎంసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్​ కిశోర్​​​- రాజకీయ కురవృద్ధుడు, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం టీఎంసీ మొదటి వ్యూహంలో భాగంగా భావిస్తోంది.

రెండో వ్యూహంలో భాగంగా జాతీయ స్థాయిలో విస్తృత పరిచయాలు ఉన్న టీఎంసీ కీలక నేత ముకుల్​ రాయ్​ను, ప్రశాంత్​ కిశోర్​​​ను మమత రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే ఇటీవల టీఎంసీలో చేరిన బిహార్​ చెందిన యశ్వంత్ సిన్హాను ఎగువ సభకు ఎంపిక చేసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో అభిషేక్​ బెనర్జీ?

మమతతో పాటు కీలక నేతలంతా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో పాలన, టీఎంసీ వ్యవహారాలపై ప్రభావం పడుతుంది. మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్​ బెనర్జీ ఆ బాధ్యతలను చక్కబెట్టే అవకాశం ఉంది. ఐప్యాక్​ కూడా పార్టీకి, ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండనున్నట్లు సమాచారం.

వ్యూహాలు ఫలిస్తాయా?

ఈ వ్యూహాలతో టీఎంసీ జాతీయ స్థాయిలో సత్తా చాటగలదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ప్రశాంత్​ కిశోర్​​ వ్యూహాలు టీఎంసీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రాజగోపాల్ ధార్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

"ఐప్యాక్​ అనేది ఒక ప్రొఫెషనల్ సంస్థ. అది సమకాలీన రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు పనిచేయగలదు. ఈ నేపథ్యంలో ఐప్యాక్​తో జతకట్టడం వల్ల రాబోయే రోజుల్లో తృణమూల్‌ కాంగ్రెస్​కు ప్రయోజనం కలుగుతుంది. అలాగే రాజకీయాల్లో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో పీకే దిట్ట. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఐప్యాక్​ లాంటి సంస్థలతో కలిసి పని చేయాలి."

-రాజగోపాల్ ధార్ చక్రవర్తి, రాజకీయ విశ్లేషకుడు, కోల్​కతా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్

అయితే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఐప్యాక్​తో ప్రశాంత్​ కిశోర్​ భాగస్వామ్యం కొనసాగిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

ఇదీ చదడవండి: విపక్షాల సమతాకేంద్రం.. మమత!

  • దేశంలోని భాజపా వ్యతిరేక శక్తుల ఏకీకరణ
  • సార్వత్రిక ఎన్నికల లోపు ఇతర రాష్ట్రాల్లో టీఎంసీ విస్తరణ

ఈ రెండు వ్యూహాలతో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తృణమూల్​ కాంగ్రెస్(All India Trinamool Congress)​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) భావిస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో మమతను తిరుగులేని నేతగా నిలబెట్టేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​తో కలిసి టీఎంసీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇటీవల జరిగిన బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల్లో హిట్​ కొట్టిన పీకే-ఐప్యాక్, టీఎంసీ జోడీ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను దెబ్బతీసేందుకు ​వ్యూహ రచన చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం

2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో బంగాల్​లో 42 స్థానాలకు గానూ 18 సీట్లను గెలుచుకుని టీఎంసీకి భాజపా గట్టి పోటీ ఇచ్చింది. అయితే 2021లో ఆ హవాను కమలదళం కొనసాగించలేకపోయింది. కారణం.. ప్రశాంత్​ కిశోర్​​​ వ్యూహాలు, మమత ప్రజాకర్షణ శక్తి. ముందు చెప్పినట్లుగానే భాజపాను రెండంకెలకు పరిమితం చేసి.. సత్తా చాటింది ఈ ద్వయం. ప్రధాని మోదీ- అమిత్​ షా ద్వయానికి ఎదురొడ్డి.. 200కు పైగా సీట్లను గెలుచుకొని మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.

మమతా బెనర్జీ ప్రజాకర్షణ శక్తి, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సమన్వయం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​​తో పాటు ఆయనకు చెందిన ఐప్యాక్​ సంస్థ వల్లే టీఎంసీకి ఈ విజయం సాధ్యమైంది.

ఈ ఎన్నికల్లో ఘన విజయం ద్వారా మోదీకి ఎదురు నిలిచేది తానేననే సంకేతాలను ఇచ్చారు మమత. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్​ కిశోర్​​​తో పాటు ఐప్యాక్​తో కలిసి సుదీర్ఘ కాలం పని చేయాలని మమత భావించినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇది నిజమైతే.. కేంద్ర రాజకీయాల్లో మమత సత్తా చాటేందుకు ప్రశాంత్​ కిశోర్​​​ వ్యూహాలు.. ఉపయోగపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

క్రియాశీలక రాజకీయల్లోకి పీకే?

బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఇకపై తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని పీకే ప్రకటించారు. క్రియాశీల రాజకీయల్లో ప్రవేశించేందుకే ఆయన​ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఎంసీ-ఐప్యాక్​ పరస్పర అంగీకారంతోనే పీకే ఈ ప్రకటన చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంలో టీఎంసీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. పార్టీ నాయకులు మాత్రం టీఎంసీ-ఐప్యాక్ మరో ఐదేళ్లు కలిసి పనిచేస్తాయని చెబుతున్నారు.

వ్యూహాలు ఇవే..

'తృణమూల్​ కాంగ్రెస్​ను జాతీయ పార్టీగా మలిచేందుకు చేసే ప్రయత్నాలు ఈసారి భిన్నంగా ఉంటాయి. కేవలం ఒకటి, రెండు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికో, ఓట్ల వాటా పెంచుకోవడానికో పరిమితం కాబోము. భాజపాపై యుద్ధం చేసి, ఎన్నికల్లో గెలవడమే మా లక్ష్యం' అంటూ మమత బెనర్జీ అంతరంగాన్ని ఇటీవల ఆవిష్కరించారు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ.

అయితే అది సాధ్యం కావాలంటే.. రెండు వ్యూహాలను అనుసరించాలని టీఎంసీ నిర్ణయించింది.

1. దేశంలోని భాజపా వ్యతిరేక శక్తులను ఏకం చేయడం.

2. సార్వత్రిక ఎన్నికల లోపు టీఎంసీని ఇతర రాష్ట్రాల్లో గణనీయంగా విస్తరించడం

గత సార్వత్రిక ఎన్నికల్లో పోలైన 61,36,56,298 ఓట్లలో భాజపాకు పోలైన 22,90,76,879 ఓట్లు మినహాయిస్తే మిగతా 38,45,79,419 ఓట్లు ప్రతిపక్షాలకే దక్కాయి. వీటిని సంఘటితం చేసుకోగలిగితే, అధికార పక్షాన్ని నిలువరించే శక్తి ప్రతిపక్షాలకు దక్కుతుంది. వరుస ఓటములు, నేతల ఫిరాయింపులతో స్థైర్యం కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రతిపక్షాలను ఏకం చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని టీఎంసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్​ కిశోర్​​​- రాజకీయ కురవృద్ధుడు, ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం టీఎంసీ మొదటి వ్యూహంలో భాగంగా భావిస్తోంది.

రెండో వ్యూహంలో భాగంగా జాతీయ స్థాయిలో విస్తృత పరిచయాలు ఉన్న టీఎంసీ కీలక నేత ముకుల్​ రాయ్​ను, ప్రశాంత్​ కిశోర్​​​ను మమత రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే ఇటీవల టీఎంసీలో చేరిన బిహార్​ చెందిన యశ్వంత్ సిన్హాను ఎగువ సభకు ఎంపిక చేసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో అభిషేక్​ బెనర్జీ?

మమతతో పాటు కీలక నేతలంతా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించడం వల్ల రాష్ట్రంలో పాలన, టీఎంసీ వ్యవహారాలపై ప్రభావం పడుతుంది. మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్​ బెనర్జీ ఆ బాధ్యతలను చక్కబెట్టే అవకాశం ఉంది. ఐప్యాక్​ కూడా పార్టీకి, ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉండనున్నట్లు సమాచారం.

వ్యూహాలు ఫలిస్తాయా?

ఈ వ్యూహాలతో టీఎంసీ జాతీయ స్థాయిలో సత్తా చాటగలదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ప్రశాంత్​ కిశోర్​​ వ్యూహాలు టీఎంసీకి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు రాజగోపాల్ ధార్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

"ఐప్యాక్​ అనేది ఒక ప్రొఫెషనల్ సంస్థ. అది సమకాలీన రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు పనిచేయగలదు. ఈ నేపథ్యంలో ఐప్యాక్​తో జతకట్టడం వల్ల రాబోయే రోజుల్లో తృణమూల్‌ కాంగ్రెస్​కు ప్రయోజనం కలుగుతుంది. అలాగే రాజకీయాల్లో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలో పీకే దిట్ట. మిగతా రాజకీయ పార్టీలు కూడా ఐప్యాక్​ లాంటి సంస్థలతో కలిసి పని చేయాలి."

-రాజగోపాల్ ధార్ చక్రవర్తి, రాజకీయ విశ్లేషకుడు, కోల్​కతా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్

అయితే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఐప్యాక్​తో ప్రశాంత్​ కిశోర్​ భాగస్వామ్యం కొనసాగిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.

ఇదీ చదడవండి: విపక్షాల సమతాకేంద్రం.. మమత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.