ETV Bharat / bharat

పంద్రాగస్టు రోజు జెండా ఎగరేసి.. స్కూల్​లో ప్రిన్సిపల్ లిక్కర్ పార్టీ.. బాలికలను టాయిలెట్​లోకి తీసుకెళ్లి..

Independence Day Principal Liquor Party in School : స్వాతంత్ర్య దినోత్సవం రోజునే స్కూల్​లో చెత్తపనులు చేశాడు ఓ ప్రిన్సిపల్. పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడితో మందు కొట్టడమే కాకుండా.. విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గుజరాత్​లోని వడోదరలో జరిగింది.

author img

By

Published : Aug 16, 2023, 11:05 AM IST

Independence Day Principal Liquor Party in School
Gujarat Vadodara School Principal Liquor party

Independence Day Principal Liquor Party in School : పంద్రాగస్టు రోజున స్కూల్​లోనే లిక్కర్ పార్టీ చేసుకున్నాడు ఓ ప్రిన్సిపల్. తోటి ఉపాధ్యాయుడితో కలిసి పాఠశాలలో మందుకొట్టాడు. అంతే కాకుండా ముగ్గురు విద్యార్థినులను టాయిలెట్​లోకి తీసుకెళ్లి అసభ్య చిత్రాలు, వీడియోలు చూపించాడు. గుజరాత్​లోని వడోదరలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

Gujarat Vadodara School Principal Liquor party : వడోదరలోని పద్రా తాలుకా అభోర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభోర్ ప్రైమరీ స్కూల్​లో జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించారు. వేడుకలు పూర్తయ్యాక.. అతిథులు, విద్యార్థులు వెళ్లిపోయారు. కొంతమంది బాలురు, బాలికలు మాత్రమే స్కూల్​లో ఉన్నారు. ఈ సమయంలోనే స్కూల్ ప్రిన్సిపల్ మహేంద్రభాయ్ జాదవ్, టీచర్ రమేశ్​భాయ్ పాంచల్.. పాఠశాలలో సిట్టింగ్ వేశారు. తప్పతాగి అసభ్యంగా ప్రవర్తించారు. మహేంద్రభాయ్ జాదవ్.. ముగ్గురు విద్యార్థినులను స్కూల్ టాయిలెట్​లోకి తీసుకెళ్లాడు. తన ఫోన్​లో ఉన్న అసభ్య ఫొటోలు, వీడియోలు వారికి చూపించాడు.

ప్రిన్సిపల్​కు దేహశుద్ధి!
వీడియోలు, ఫొటోలు చూసి షాక్ అయిన బాలికలు.. ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులకు విషయం గురించి చెప్పారు. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు.. స్కూల్​కు వచ్చి ప్రిన్సిపల్​ను నిలదీశారు. తల్లిదండ్రులు స్కూల్​కు రావడం చూసి చుట్టుపక్కల వారు సైతం పాఠశాల వద్ద పెద్ద ఎత్తున పోగయ్యారు. ప్రిన్సిపల్ మహేంద్రభాయ్ జాదవ్​ను స్కూల్​లో నుంచి బయటకు లాక్కొచ్చి అతడికి దేహశుద్ధి చేశారు.

చివరకు ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసింది. నిమిషాల్లోనే వడు పోలీసులు అభోర్ గ్రామానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి ప్రిన్సిపల్ మహేంద్రభాయ్​ను విడిపించారు. అతడిని పోలీస్ స్టేషన్​కు తరలించారు. స్కూల్​లో మద్యం తాగినందుకు మరో టీచర్ రమేశ్​భాయ్ పాంచల్​ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, నిందితులిద్దరినీ సస్పెండ్ చేసినట్లు ప్రాథమిక విద్యా కమిటీ ఛైర్మన్ అశ్విన్​భాయ్ పటేల్ స్పష్టం చేశారు.

"విద్యావ్యవస్థకు అవమానం కలిగించే ఘటన ఇది. మహేంద్రభాయ్ జాదవ్​పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. అవి క్షమార్హం కాదు. మరో టీచర్ రమేశ్​భాయ్ సైతం తాగి పట్టుబడ్డాడు. ఇద్దరిపై వాడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఇద్దరూ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. ఫిర్యాదు నమోదు కాగానే ఇద్దరినీ సస్పెండ్ చేశాం."
-అశ్విన్​భాయ్ పటేల్, ప్రాథమిక విద్యా కమిటీ ఛైర్మన్

ఎమ్మెల్యే ఫైర్..
స్థానిక ఎమ్మెల్యే చైతన్య సింగ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు చేసిన పని అవమానకరమని వ్యాఖ్యానించారు. టీచర్లు ఇలా ప్రవర్తిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను తాను కోరినట్లు వివరించారు.

గ్యాస్​ లీక్​.. స్కూల్​లో స్పృహతప్పి పడిపోయిన 24 మంది పిల్లలు

ఐఫోన్​ కోసం దారుణం.. లేడీ టీచర్​ను రోడ్డు మీద లాక్కెళ్లిన దొంగలు

Independence Day Principal Liquor Party in School : పంద్రాగస్టు రోజున స్కూల్​లోనే లిక్కర్ పార్టీ చేసుకున్నాడు ఓ ప్రిన్సిపల్. తోటి ఉపాధ్యాయుడితో కలిసి పాఠశాలలో మందుకొట్టాడు. అంతే కాకుండా ముగ్గురు విద్యార్థినులను టాయిలెట్​లోకి తీసుకెళ్లి అసభ్య చిత్రాలు, వీడియోలు చూపించాడు. గుజరాత్​లోని వడోదరలో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.

Gujarat Vadodara School Principal Liquor party : వడోదరలోని పద్రా తాలుకా అభోర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అభోర్ ప్రైమరీ స్కూల్​లో జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించారు. వేడుకలు పూర్తయ్యాక.. అతిథులు, విద్యార్థులు వెళ్లిపోయారు. కొంతమంది బాలురు, బాలికలు మాత్రమే స్కూల్​లో ఉన్నారు. ఈ సమయంలోనే స్కూల్ ప్రిన్సిపల్ మహేంద్రభాయ్ జాదవ్, టీచర్ రమేశ్​భాయ్ పాంచల్.. పాఠశాలలో సిట్టింగ్ వేశారు. తప్పతాగి అసభ్యంగా ప్రవర్తించారు. మహేంద్రభాయ్ జాదవ్.. ముగ్గురు విద్యార్థినులను స్కూల్ టాయిలెట్​లోకి తీసుకెళ్లాడు. తన ఫోన్​లో ఉన్న అసభ్య ఫొటోలు, వీడియోలు వారికి చూపించాడు.

ప్రిన్సిపల్​కు దేహశుద్ధి!
వీడియోలు, ఫొటోలు చూసి షాక్ అయిన బాలికలు.. ఇంటికి వెళ్లి తమ తల్లిదండ్రులకు విషయం గురించి చెప్పారు. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు.. స్కూల్​కు వచ్చి ప్రిన్సిపల్​ను నిలదీశారు. తల్లిదండ్రులు స్కూల్​కు రావడం చూసి చుట్టుపక్కల వారు సైతం పాఠశాల వద్ద పెద్ద ఎత్తున పోగయ్యారు. ప్రిన్సిపల్ మహేంద్రభాయ్ జాదవ్​ను స్కూల్​లో నుంచి బయటకు లాక్కొచ్చి అతడికి దేహశుద్ధి చేశారు.

చివరకు ఈ విషయం స్థానిక పోలీసులకు తెలిసింది. నిమిషాల్లోనే వడు పోలీసులు అభోర్ గ్రామానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి ప్రిన్సిపల్ మహేంద్రభాయ్​ను విడిపించారు. అతడిని పోలీస్ స్టేషన్​కు తరలించారు. స్కూల్​లో మద్యం తాగినందుకు మరో టీచర్ రమేశ్​భాయ్ పాంచల్​ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. మరోవైపు, నిందితులిద్దరినీ సస్పెండ్ చేసినట్లు ప్రాథమిక విద్యా కమిటీ ఛైర్మన్ అశ్విన్​భాయ్ పటేల్ స్పష్టం చేశారు.

"విద్యావ్యవస్థకు అవమానం కలిగించే ఘటన ఇది. మహేంద్రభాయ్ జాదవ్​పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. అవి క్షమార్హం కాదు. మరో టీచర్ రమేశ్​భాయ్ సైతం తాగి పట్టుబడ్డాడు. ఇద్దరిపై వాడు పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. ఇద్దరూ ఇప్పుడు కస్టడీలో ఉన్నారు. ఫిర్యాదు నమోదు కాగానే ఇద్దరినీ సస్పెండ్ చేశాం."
-అశ్విన్​భాయ్ పటేల్, ప్రాథమిక విద్యా కమిటీ ఛైర్మన్

ఎమ్మెల్యే ఫైర్..
స్థానిక ఎమ్మెల్యే చైతన్య సింగ్ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు చేసిన పని అవమానకరమని వ్యాఖ్యానించారు. టీచర్లు ఇలా ప్రవర్తిస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను తాను కోరినట్లు వివరించారు.

గ్యాస్​ లీక్​.. స్కూల్​లో స్పృహతప్పి పడిపోయిన 24 మంది పిల్లలు

ఐఫోన్​ కోసం దారుణం.. లేడీ టీచర్​ను రోడ్డు మీద లాక్కెళ్లిన దొంగలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.