Officer Punished Complaint In Uttar Pradesh : తన వద్దకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన కొందరు అమాయక వ్యక్తులపై ఓ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్- ఎస్డీఎమ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఓ బాధితుడిని మోకాళ్లపై కోర్చోమని శిక్ష విధించాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బరేలీ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్గంజ్ మండలంలోని మందన్పుర్ గ్రామస్థుల మధ్య ఓ శ్మశాన వాటికి స్థలం విషయంలో వివాదం తలెత్తింది. దీనిపై ఓ వర్గం ఫిర్యాదు చేయడానికి మీర్గంజ్ పట్టణంలోని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్- ఎస్డీఎమ్ ఉదిత్ పవార్కు వద్దకు వెళ్లారు. తమ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికను వేరొక వర్గం వారు ఆక్రమించుకున్నారని.. అందుకుగాను వేరొక చోట స్థలం ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని తమ సమస్యను విన్నవించుకున్నారు. ఆ అధికారికి తమ అభ్యర్థన పత్రాన్ని అందించారు.
అయితే, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపట్ల ఉదిత్ పవార్ దురుసుగా ప్రవర్తించాడు. గ్రామస్థుల్లో ఒకరిని మోకాళ్లపై వంగి కూర్చోవాలంటూ అకారణంగా శిక్షించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఈ విషయం జిల్లా మేజిస్ట్రేట్ శివకాంత్ ద్వివేది దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. అమాయకుల పట్ల కఠినంగా వ్యవహించినందుకు ఎస్డీఎమ్ను విధుల నుంచి తొలగించారు.
"మా గ్రామంలో ఒక వర్గం వారు శ్మశాన వాటికను ఆక్రమించుకొన్నారు. ఇది మాకు ఇబ్బందిగా మారింది. ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని ఎస్డీఎమ్ను కోరాం. కానీ ఆయన మాత్రం అకారణంగా నన్ను శిక్షించారు. ఆయన చెప్పినట్లు చేయనందుకు నాపై దుర్భాషలాడారు. ఇప్పటికీ మూడు సార్లు ఆయన దగ్గరకు వెళ్లాను. నాకు న్యాయం జరిగేంత వరకు ఇలాగే కూర్చూనే ఉంటానని ఆయనకు చెప్పాను'' అని బాధితుడు తెలిపాడు.
గ్రామస్థుల ఆరోపణలను కొట్టి పారేసిన ఎస్డీఎమ్..
అయితే గ్రామస్థులు చేసిన ఆరోపణలను ఎస్డీఎమ్ ఉదిత్ కుమార్ కొట్టి పారేశారు. తాను గ్రామస్థుల ఫిర్యాదును వింటుండగా.. చాలా మంది కార్యాలయంలో వచ్చారన్నారు. అందుకే వారిని మందలించానని పేర్కొన్నారు. తాను అతడిని శిక్షించలేదని.. తాను ఆఫీస్కు వచ్చే వరకు అతడు ఆ విధంగా కూర్చోని ఉన్నాడని ఉదిత్ వివరించారు.
Roof Collapse Today : ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి.. చిన్నారులు కూడా..