ETV Bharat / bharat

3.5 సెంటిమీటర్ల బుద్ధుని ప్రతిమ- ప్రపంచ రికార్డు దాసోహం - అతిచిన్న బుద్ధుడి ప్రతిమ

మినియేచర్ ఆర్ట్స్(Miniature Artwork)​.. వీటిని చూడాలంటే భూతద్దం కావాల్సిందే. అలాంటిది.. మరి వాటిని తయారు చేయాలంటే..? ఎంత ఓపిక ఉండాలో కదా! అయితే.. ఓ కుర్రాడు మాత్రం ఈ సూక్ష్మకళలో(Miniature Artwork) అద్భుతాలు చేస్తూ, ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కళానైపుణ్యంతో కట్టిపడేస్తున్నాడు. అతడెవరంటే..?

miniature artist
మినియేచర్ ఆర్ట్స్
author img

By

Published : Sep 18, 2021, 9:22 PM IST

మినియేచర్ ఆర్ట్స్​తో రికార్డులు సృష్టిస్తున్న రాకేశ్​ కుమార్​ పాత్ర

ఒడిశా జాజ్​పుర్(Odisha Jajpur News) జిల్లాకు చెందిన ఓ యువకుడు తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సూక్ష్మ కళాకృతులు(మినియేచర్ ఆర్ట్స్​)(Miniature Artwork) తయారు చేస్తూ.. అరుదైన ఘనతలు సాధిస్తున్నాడు.

నతాసాహీ గ్రామానికి చెందిన రాకేశ్ కుమార్ పాత్ర.. ఈ మినియేచర్ ఆర్ట్స్(Miniature Artwork) రూపకర్త. పేద కుటుంబంలో పుట్టిన రాకేశ్​కు.. చిన్నప్పటి నుంచి పెయింటింగ్​ అంటే ఎంతో ఆసక్తి. ఇప్పటివరకు అతను ఎన్నో శిల్పాలకు రంగులద్ది, అద్భుతమైన కళాకృతులుగా మలిచాడు. వాటితో ఎన్నో చోట్ల ప్రదర్శనలిచ్చాడు.

miniature artists
రాకేశ్​ కుమార్ రూపొందించిన బుద్ధుడి మైనపు ప్రతిమ

ప్రపంచ రికార్డు దాసోహం..

ఇటీవలే రాకేశ్​... మైనంతో 3.5 సెంటిమీటర్ల పొడవున్న బుద్ధుడి ప్రతిమను అతడు రూపొందించాడు. దీంతో అతని పేరు 'ఎక్స్​క్లూజివ్​ వరల్డ్ రికార్డ్స్'​లో నమోదైంది. అంతేగాకుండా అతడు 0.5 సెంటిమీటర్ల పొడవుతో వేప కర్రలపై పూరీ జగన్నాథుడు సహా బలభద్ర, సుభద్రల ప్రతిమలను తయారు చేశాడు. భూతద్దంతో మాత్రమే చూడగల ఈ ప్రతిమలను చెక్కడం.. ఎంతో సవాలుతో కూడిన పనే అయినా.. రాకేశ్​ వాటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నాడు.

smallest statues
పూరీ జగన్నాథుడి ప్రతిమ
odisha artist
పెయింటింగ్స్​ వేస్తున్న రాకేశ్​ కుమార్​ పాత్ర
miniature artist
సైకత శిల్పాన్ని రూపొందిస్తున్న రాకేశ్​

ఎప్పటికైనా.. గిన్నిస్​ బుక్​లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు రాకేశ్​. అతని అద్భుత ప్రతిభను చూసిన వారు ఎవరైనా.. తన కల అతి త్వరలోనే నెరవేరుతుందని కచ్చితంగా చెప్పగలరు! రాకేశ్​ సాధించిన విజయాల పట్ల అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుని, తమ కుమారుడికి అండగా నిలబడితే.. అతడు మరిన్ని ఘనతలు సాధించగలడని వారు చెబుతున్నారు.

ఇదీ చూడండి: 'బుల్లెట్'​ విడిభాగాలతో 'ఈ-బైక్'- తొమ్మిదో తరగతి విద్యార్థి ఘనత

మినియేచర్ ఆర్ట్స్​తో రికార్డులు సృష్టిస్తున్న రాకేశ్​ కుమార్​ పాత్ర

ఒడిశా జాజ్​పుర్(Odisha Jajpur News) జిల్లాకు చెందిన ఓ యువకుడు తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. సూక్ష్మ కళాకృతులు(మినియేచర్ ఆర్ట్స్​)(Miniature Artwork) తయారు చేస్తూ.. అరుదైన ఘనతలు సాధిస్తున్నాడు.

నతాసాహీ గ్రామానికి చెందిన రాకేశ్ కుమార్ పాత్ర.. ఈ మినియేచర్ ఆర్ట్స్(Miniature Artwork) రూపకర్త. పేద కుటుంబంలో పుట్టిన రాకేశ్​కు.. చిన్నప్పటి నుంచి పెయింటింగ్​ అంటే ఎంతో ఆసక్తి. ఇప్పటివరకు అతను ఎన్నో శిల్పాలకు రంగులద్ది, అద్భుతమైన కళాకృతులుగా మలిచాడు. వాటితో ఎన్నో చోట్ల ప్రదర్శనలిచ్చాడు.

miniature artists
రాకేశ్​ కుమార్ రూపొందించిన బుద్ధుడి మైనపు ప్రతిమ

ప్రపంచ రికార్డు దాసోహం..

ఇటీవలే రాకేశ్​... మైనంతో 3.5 సెంటిమీటర్ల పొడవున్న బుద్ధుడి ప్రతిమను అతడు రూపొందించాడు. దీంతో అతని పేరు 'ఎక్స్​క్లూజివ్​ వరల్డ్ రికార్డ్స్'​లో నమోదైంది. అంతేగాకుండా అతడు 0.5 సెంటిమీటర్ల పొడవుతో వేప కర్రలపై పూరీ జగన్నాథుడు సహా బలభద్ర, సుభద్రల ప్రతిమలను తయారు చేశాడు. భూతద్దంతో మాత్రమే చూడగల ఈ ప్రతిమలను చెక్కడం.. ఎంతో సవాలుతో కూడిన పనే అయినా.. రాకేశ్​ వాటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నాడు.

smallest statues
పూరీ జగన్నాథుడి ప్రతిమ
odisha artist
పెయింటింగ్స్​ వేస్తున్న రాకేశ్​ కుమార్​ పాత్ర
miniature artist
సైకత శిల్పాన్ని రూపొందిస్తున్న రాకేశ్​

ఎప్పటికైనా.. గిన్నిస్​ బుక్​లో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు రాకేశ్​. అతని అద్భుత ప్రతిభను చూసిన వారు ఎవరైనా.. తన కల అతి త్వరలోనే నెరవేరుతుందని కచ్చితంగా చెప్పగలరు! రాకేశ్​ సాధించిన విజయాల పట్ల అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకుని, తమ కుమారుడికి అండగా నిలబడితే.. అతడు మరిన్ని ఘనతలు సాధించగలడని వారు చెబుతున్నారు.

ఇదీ చూడండి: 'బుల్లెట్'​ విడిభాగాలతో 'ఈ-బైక్'- తొమ్మిదో తరగతి విద్యార్థి ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.