భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా టీకా వేయించుకున్నారు. చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో టీకా స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోనున్నట్లు తెలిపారు.
అర్హులైన ప్రజలంతా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వెంకయ్య కోరారు.

బిహార్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం కొవిడ్ టీకాను తీసుకున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ పట్నాలో టీకాను వేయించుకున్నారు.

ఒడిశా విధానసభలో ఉన్న వైద్య కేంద్రంలో టీకా వేయించుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. ఆయనకు కొవాగ్జిన్ టీకానే ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పట్నాయక్ కోరారు.
