ETV Bharat / bharat

ప్రియుడి​తో కలిసి బ్లాక్​లో రెమ్​డెసివిర్​​ విక్రయించిన నర్సు

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఓ నర్సు తన ప్రియుడి​తో కలిసి రెమ్​డెసివిర్​ను విక్రయిస్తూ పట్టుబడింది. రోగులకు సాధారణ ఇంజెక్షన్లు ఇస్తూ, వారి కోసం తెచ్చిన రెమ్​డెసివిర్​ను బ్లాక్​ మార్కెట్​లో అమ్మినట్లు పోలీసుల విచారణలో తేలింది.

author img

By

Published : Apr 24, 2021, 1:58 PM IST

Nurse and her lover held for black marketing Remdesivir
ప్రేమజంట అక్రమ దందా- బ్లాక్​లో రెమ్​డెసివిర్​ విక్రయం

దేశంలో రెమ్​డెసివిర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో.. ఆ ఔషధం బ్లాక్​మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోగులకు ఔషధాలను ఇచ్చే ఓ నర్సే తన ప్రియుడితో కలిసి రెమ్​డెసివిర్​ను అక్రమంగా విక్రయిస్తోంది. మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఈ ఉదంతం బయటపడింది.

నిందితుడు జాల్ఖాన్ తన ప్రేయసి షాలినీ వర్మ(నర్సు)తో కలిసి భోపాల్​లోని ఓ కొవిడ్ కేర్ సెంటర్​లో పనిచేస్తున్నాడు. నర్సుగా సేవలందిస్తున్న షాలినీ.. రోగులకు రెమ్​డెసివిర్ ఇంజెక్షన్ పేరుతో సాధారణ ఇంజెక్షన్​ను ఇచ్చేది. వారి కోసం కేటాయించిన రెమ్​డెసివిర్​ను ఎవరికీ తెలియకుండా.. జాల్ఖన్​కు అందించేది. నిందితుడు జాల్ఖన్.. గుట్టుచప్పుడు కాకుండా వాటిని డిమాండ్​ను బట్టి బ్లాక్​మార్కెట్​లో విక్రయించేవాడు. ఇలా వీరిద్దరు కలిసి రూ.20 వేలు సంపాదించారు. కొవిడ్ రోగుల దగ్గర కుటుంబ సభ్యులు ఎవరూ ఉండరు కాబట్టి.. వీరి అక్రమ దందాకు మార్గం సులభమైంది.

అత్యాశతో..

ఈ తప్పు చేసినట్లు నిందితులిద్దరు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అదే ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లకు కూడా అక్రమంగా ఔషధాలను విక్రయించారని వెల్లడించారు. ఓ వైద్యుడు చేసిన ఆన్​లైన్ పేమెంట్​ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆస్పత్రిలో తక్కువ శాలరీలు, డబ్బులు సంపాదించాలన్న అత్యాశే వీరి బ్లాక్ మార్కెట్ దందాకు కారణమని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి- అవినీతి కేసులో దేశ్​ముఖ్​పై సీబీఐ ఎఫ్ఐఆర్

దేశంలో రెమ్​డెసివిర్ కొరత తీవ్రంగా వేధిస్తున్న తరుణంలో.. ఆ ఔషధం బ్లాక్​మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోగులకు ఔషధాలను ఇచ్చే ఓ నర్సే తన ప్రియుడితో కలిసి రెమ్​డెసివిర్​ను అక్రమంగా విక్రయిస్తోంది. మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో ఈ ఉదంతం బయటపడింది.

నిందితుడు జాల్ఖాన్ తన ప్రేయసి షాలినీ వర్మ(నర్సు)తో కలిసి భోపాల్​లోని ఓ కొవిడ్ కేర్ సెంటర్​లో పనిచేస్తున్నాడు. నర్సుగా సేవలందిస్తున్న షాలినీ.. రోగులకు రెమ్​డెసివిర్ ఇంజెక్షన్ పేరుతో సాధారణ ఇంజెక్షన్​ను ఇచ్చేది. వారి కోసం కేటాయించిన రెమ్​డెసివిర్​ను ఎవరికీ తెలియకుండా.. జాల్ఖన్​కు అందించేది. నిందితుడు జాల్ఖన్.. గుట్టుచప్పుడు కాకుండా వాటిని డిమాండ్​ను బట్టి బ్లాక్​మార్కెట్​లో విక్రయించేవాడు. ఇలా వీరిద్దరు కలిసి రూ.20 వేలు సంపాదించారు. కొవిడ్ రోగుల దగ్గర కుటుంబ సభ్యులు ఎవరూ ఉండరు కాబట్టి.. వీరి అక్రమ దందాకు మార్గం సులభమైంది.

అత్యాశతో..

ఈ తప్పు చేసినట్లు నిందితులిద్దరు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. అదే ఆస్పత్రిలో పనిచేసే డాక్టర్లకు కూడా అక్రమంగా ఔషధాలను విక్రయించారని వెల్లడించారు. ఓ వైద్యుడు చేసిన ఆన్​లైన్ పేమెంట్​ ఆధారంగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆస్పత్రిలో తక్కువ శాలరీలు, డబ్బులు సంపాదించాలన్న అత్యాశే వీరి బ్లాక్ మార్కెట్ దందాకు కారణమని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి- అవినీతి కేసులో దేశ్​ముఖ్​పై సీబీఐ ఎఫ్ఐఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.