ETV Bharat / bharat

'మోదీ, షా తోడుగా ఉన్నంత కాలం నేనే సీఎం' - మోదీ , షా తోడుగా కర్ణాటక సీఎంగా తానే కొనసాగుతానన్న యడియూరప్ప

కొందరు నాయకులు తాను రాజీనామా చేస్తానని పగటి కలలు కంటున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​ షా మద్దతున్నంత వరకు సీఎం పదవిలో తానే కొనసాగుతానని స్పష్టం చేశారు.

'No one can replace me as long as I have Modi, Shah's backing'
'మోదీ, షా తోడుగా.. నిండుకాలం నేనే ఉంటా సీఎంగా'
author img

By

Published : Feb 6, 2021, 4:14 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా మద్దతున్నంతవరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని బి.ఎస్​.యడియూరప్ప అన్నారు. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఈ మేరకు స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా తన స్థానంలో మరొకరు నియమితులవుతారని కొందరు నాయకులు పగటి కలలు కంటున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి దుయ్యబట్టారు.

ప్రజలు నాకు తోడుండగా, మోదీ, షా మద్దతుండగా నా స్థానాన్ని ఎవరూ మార్చలేరు. నాపై వస్తున్న వదంతులను తొలగించుకోగలను. నాపై మోపిన కేసుల నుంచి న్యాయపరంగా బయటపడగలను. మోదీ, షాలు నాపై నమ్మకం ఉంచినంత కాలం కేసుల గురించి ఆందోళన చెందను. వందల కేసులతో పోరాడగలను. రాజకీయ నాయకులపై తప్పుడు కేసులు ఎలా నమోదవుతాయో ప్రతిపక్షనాయకుడు సిద్ధారామయ్యకు బాగా తెలుసు.

_యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

తనపై కక్షపూరితంగానే కేసులు నమోదు చేస్తున్నారని యడియూరప్ప చెప్పారు. కేసుల కారణంగా తన రాజీనామాను కోరుకునే కాంగ్రెస్​ నాయకులు.. జాతీయ స్థాయి నాయకులపైనే ఎన్నో కేసులు నమోదయ్యాయన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

ఇదీ చదవండి:'రాజ్యాంగ బలోపేతంలో న్యాయ వ్యవస్థ పనితీరు భేష్'

ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​ షా మద్దతున్నంతవరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని బి.ఎస్​.యడియూరప్ప అన్నారు. గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఈ మేరకు స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా తన స్థానంలో మరొకరు నియమితులవుతారని కొందరు నాయకులు పగటి కలలు కంటున్నారని ప్రతిపక్షాలనుద్దేశించి దుయ్యబట్టారు.

ప్రజలు నాకు తోడుండగా, మోదీ, షా మద్దతుండగా నా స్థానాన్ని ఎవరూ మార్చలేరు. నాపై వస్తున్న వదంతులను తొలగించుకోగలను. నాపై మోపిన కేసుల నుంచి న్యాయపరంగా బయటపడగలను. మోదీ, షాలు నాపై నమ్మకం ఉంచినంత కాలం కేసుల గురించి ఆందోళన చెందను. వందల కేసులతో పోరాడగలను. రాజకీయ నాయకులపై తప్పుడు కేసులు ఎలా నమోదవుతాయో ప్రతిపక్షనాయకుడు సిద్ధారామయ్యకు బాగా తెలుసు.

_యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

తనపై కక్షపూరితంగానే కేసులు నమోదు చేస్తున్నారని యడియూరప్ప చెప్పారు. కేసుల కారణంగా తన రాజీనామాను కోరుకునే కాంగ్రెస్​ నాయకులు.. జాతీయ స్థాయి నాయకులపైనే ఎన్నో కేసులు నమోదయ్యాయన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

ఇదీ చదవండి:'రాజ్యాంగ బలోపేతంలో న్యాయ వ్యవస్థ పనితీరు భేష్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.