ETV Bharat / bharat

'కాంగ్రెస్​ ఒకటే పార్టీ.. రెండు గ్రూపులు లేవు' - కాంగ్రెస్​లో గ్రూపిజం

కాంగ్రెస్​లో రెండు గ్రూపులు లేవని స్పష్టం చేశారు ఆ పార్టీ సీనియర్​ నేత ఆనంద్ శర్మ. రానున్న ఎన్నికల్లో కలిసికట్టుగా నిలిచి, ప్రత్యర్థులను ఎదుర్కొంటామని తెలిపారు. అంతర్గత ప్రజాస్వామ్యానికి తమ​ పార్టీ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

anand sharma
'కాంగ్రెస్​ ఒకటే పార్టీ.. 2 గ్రూపులు లేవు'
author img

By

Published : Mar 11, 2021, 7:12 AM IST

కాంగ్రెస్​లో గ్రూపులు లేవని పార్టీ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ బుధవారం పేర్కొన్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 4 రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ కలిసికట్టుగా నిలిచి భాజపా, ఇతర ప్రత్యర్థులపై పోరాడుతుందన్నారు. పార్టీని వ్యవస్థాగతంగా పునరుద్ధరించాలంటూ గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన '23 మంది గ్రూపు'లో కీలక సభ్యుడైన ఆనంద్​ శర్మ దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ

"కాంగ్రెస్​లో 2 గ్రూపులు లేవు. ఒకటే పార్టీ. అద్యక్షురాలు సోనియాగాంధీ. ఎన్నికల్లో కాంగ్రెస్​ కలిసికట్టుగా పోరాడదనే తప్పుడు అభిప్రాయం కల్పించొద్దు" అని అన్నారు. కేరళలో సీనియర్​ నేత పీసీ చాకో 'గ్రూపిజం' కారణంగానే పార్టీకీ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించగా దీనిపై ఆనంద్​ శర్మ స్పందించారు. కాంగ్రెస్​ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని.. అనేక అంశాలపై పార్టీలో చర్చిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:'పంజరంలో బందీగా మారిన 'కాగ్''

కాంగ్రెస్​లో గ్రూపులు లేవని పార్టీ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ బుధవారం పేర్కొన్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 4 రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ కలిసికట్టుగా నిలిచి భాజపా, ఇతర ప్రత్యర్థులపై పోరాడుతుందన్నారు. పార్టీని వ్యవస్థాగతంగా పునరుద్ధరించాలంటూ గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన '23 మంది గ్రూపు'లో కీలక సభ్యుడైన ఆనంద్​ శర్మ దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్​ సీనియర్​ నేత ఆనంద్​ శర్మ

"కాంగ్రెస్​లో 2 గ్రూపులు లేవు. ఒకటే పార్టీ. అద్యక్షురాలు సోనియాగాంధీ. ఎన్నికల్లో కాంగ్రెస్​ కలిసికట్టుగా పోరాడదనే తప్పుడు అభిప్రాయం కల్పించొద్దు" అని అన్నారు. కేరళలో సీనియర్​ నేత పీసీ చాకో 'గ్రూపిజం' కారణంగానే పార్టీకీ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించగా దీనిపై ఆనంద్​ శర్మ స్పందించారు. కాంగ్రెస్​ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని.. అనేక అంశాలపై పార్టీలో చర్చిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:'పంజరంలో బందీగా మారిన 'కాగ్''

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.