ETV Bharat / bharat

ఆవు పేడతో పర్యావరణహిత 'పెయింట్స్​'

author img

By

Published : Dec 17, 2020, 6:28 PM IST

ఇప్పటివరకు ఉన్న పెయింట్లకు భిన్నంగా పర్యావరణహితమైనవి మార్కెట్​లోకి రానున్నాయి. ఆవు పేడతో తయారైన ఆ పెయింట్లు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

Vedic paints
ఆవు పేడతో పర్యావరణహిత 'పెయింట్స్​'

పర్యావరణానికి మేలు చేసే పెయింట్లు త్వర​లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆవుపేడతో తయారై త్వరలో మార్కెట్​లోకి రానున్న 'వేదిక్​ పెయింట్స్​'ను ట్విట్టర్ ద్వారా పరిచయం​ చేశారు. దీనిని ఖాదీ, గ్రామీణ పరిశ్రమ కమిషన్​ ఆధ్వర్యంలో తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో పాడి రైతులకు పరోక్షంగా 55వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.

  • ग्रामीण इकोनॉमी को बल मिले और किसानों को अतिरिक्त आमदनी हो इसलिए Khadi and Village Industries Commission के माध्यम से हम जल्द ही गाय के गोबर से बना ‘वैदिक पेन्ट' लॅान्च करने वाले हैं। @ChairmanKvic pic.twitter.com/zhQpa3Es5i

    — Nitin Gadkari (@nitin_gadkari) December 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆవుపేడతో రైతుల ఆదాయాన్ని పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ​గోవు ఉత్పత్తులను రైతులు సొమ్ముచేసుకునేలా భిన్నమైన ఆలోచనలను ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఆవుపేడతో వివిధ ఉత్పత్తులు తయారుచేస్తుండగా వేదిక్​ పెయింట్స్ ఆలోచన మరింత మంది రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

- నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి

పర్యావరణహితంగా ఉండే ఈ పెయింట్స్​ గోడలకు వేసిన నాలుగు గంటల్లోనే ఆరిపోతాయని గడ్కరీ వివరించారు. బ్యాక్టీరియా, ఫంగస్​లతో సహా వర్షాన్ని సైతం తట్టుకునేలా తయారు చేశారని తెలిపారు.

ఇదీ చూడండి: నన్ను మాట్లాడనివ్వలేదు: స్పీకర్​కు​ రాహుల్​ లేఖ

పర్యావరణానికి మేలు చేసే పెయింట్లు త్వర​లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆవుపేడతో తయారై త్వరలో మార్కెట్​లోకి రానున్న 'వేదిక్​ పెయింట్స్​'ను ట్విట్టర్ ద్వారా పరిచయం​ చేశారు. దీనిని ఖాదీ, గ్రామీణ పరిశ్రమ కమిషన్​ ఆధ్వర్యంలో తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో పాడి రైతులకు పరోక్షంగా 55వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.

  • ग्रामीण इकोनॉमी को बल मिले और किसानों को अतिरिक्त आमदनी हो इसलिए Khadi and Village Industries Commission के माध्यम से हम जल्द ही गाय के गोबर से बना ‘वैदिक पेन्ट' लॅान्च करने वाले हैं। @ChairmanKvic pic.twitter.com/zhQpa3Es5i

    — Nitin Gadkari (@nitin_gadkari) December 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆవుపేడతో రైతుల ఆదాయాన్ని పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. ​గోవు ఉత్పత్తులను రైతులు సొమ్ముచేసుకునేలా భిన్నమైన ఆలోచనలను ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఆవుపేడతో వివిధ ఉత్పత్తులు తయారుచేస్తుండగా వేదిక్​ పెయింట్స్ ఆలోచన మరింత మంది రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

- నితిన్​ గడ్కరీ, కేంద్ర మంత్రి

పర్యావరణహితంగా ఉండే ఈ పెయింట్స్​ గోడలకు వేసిన నాలుగు గంటల్లోనే ఆరిపోతాయని గడ్కరీ వివరించారు. బ్యాక్టీరియా, ఫంగస్​లతో సహా వర్షాన్ని సైతం తట్టుకునేలా తయారు చేశారని తెలిపారు.

ఇదీ చూడండి: నన్ను మాట్లాడనివ్వలేదు: స్పీకర్​కు​ రాహుల్​ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.