ETV Bharat / bharat

యాంటీలియా వద్ద బాంబుల కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు

author img

By

Published : Mar 10, 2021, 3:59 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) దర్యాప్తు ప్రారంభించింది. అయితే.. ఈ కేసులో కీలక వ్యక్తిగా భావిస్తున్న వాహన యజమాని మన్​సుఖ్​ హిరేన్​ అనుమానాస్పద మరణం కేసును మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్​)​ విచారిస్తోంది.

NIA starts probe in Antilia bomb scare case
యాంటీలియా పేలుడు పదార్థాల కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ ఇంటి(యాంటిలియా) సమీపంలో పేలుడు పదార్థాల కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) విచారణ ప్రారంభించింది. కారు లభ్యమైన ప్రదేశాన్ని ఎన్​ఐఏ బృందం బుధవారం సందర్శించింది.

ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గామ్​దేవి పోలీస్​ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​(నం: 35/2020) నమోదైంది. దర్యాప్తు బాధ్యతలు ఎన్​ఐఏకు అప్పగిస్తూ ఆ రాష్ట్ర హోం శాఖ సోమవారం ఆదేశాలిచ్చింది. అయితే.. ఈ పేలుడు పదార్థాల రికవరీ కేసును ఎన్​ఐఏ పరిశీలిస్తుందని.. మన్​సుఖ్​ హిరేన్​(వాహన యజమాని) మరణ కేసును యాంటీ టెర్రరిజమ్​ స్వాడ్​(ఏటీఎస్​) దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం​ పేర్కొంది.

ఇదీ చదవండి: 'హిరేన్'​ కేసు: క్రైం బ్రాంచ్​ నుంచి సచిన్​​ తొలగింపు

ఇదీ కేసు..

దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటి వద్ద.. ఫిబ్రవరి 25న జిలెటిన్‌ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత కారును పార్క్​ చేసిన నిందితుడి దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సేకరించారు పోలీసులు. అయితే.. ఆ సమయంలో ముఖానికి మాస్క్​ సహా తలభాగం మొత్తం హుడీతో కప్పి ఉండటం వల్ల.. అతణ్ని గుర్తించలేకపోయారని పోలీసులు తెలిపారు.

అనంతరం.. ఆ వాహనం తనదేనని, వారం రోజుల క్రితం అది చోరీకి గురైందని ఠాణేకు చెందిన మన్‌సుఖ్‌ హిరేన్​ తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన అదృశ్యమై.. సముద్రపు పాయలో శవమై తేలారు. అయితే.. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. ఈ కేసుపై మహారాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏతో విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ సహా.. ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి.

ఇదీ చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం- లేఖలో తీవ్ర హెచ్చరికలు

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్​ గ్రూప్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ ఇంటి(యాంటిలియా) సమీపంలో పేలుడు పదార్థాల కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) విచారణ ప్రారంభించింది. కారు లభ్యమైన ప్రదేశాన్ని ఎన్​ఐఏ బృందం బుధవారం సందర్శించింది.

ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గామ్​దేవి పోలీస్​ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​(నం: 35/2020) నమోదైంది. దర్యాప్తు బాధ్యతలు ఎన్​ఐఏకు అప్పగిస్తూ ఆ రాష్ట్ర హోం శాఖ సోమవారం ఆదేశాలిచ్చింది. అయితే.. ఈ పేలుడు పదార్థాల రికవరీ కేసును ఎన్​ఐఏ పరిశీలిస్తుందని.. మన్​సుఖ్​ హిరేన్​(వాహన యజమాని) మరణ కేసును యాంటీ టెర్రరిజమ్​ స్వాడ్​(ఏటీఎస్​) దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం​ పేర్కొంది.

ఇదీ చదవండి: 'హిరేన్'​ కేసు: క్రైం బ్రాంచ్​ నుంచి సచిన్​​ తొలగింపు

ఇదీ కేసు..

దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటి వద్ద.. ఫిబ్రవరి 25న జిలెటిన్‌ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత కారును పార్క్​ చేసిన నిందితుడి దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సేకరించారు పోలీసులు. అయితే.. ఆ సమయంలో ముఖానికి మాస్క్​ సహా తలభాగం మొత్తం హుడీతో కప్పి ఉండటం వల్ల.. అతణ్ని గుర్తించలేకపోయారని పోలీసులు తెలిపారు.

అనంతరం.. ఆ వాహనం తనదేనని, వారం రోజుల క్రితం అది చోరీకి గురైందని ఠాణేకు చెందిన మన్‌సుఖ్‌ హిరేన్​ తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన అదృశ్యమై.. సముద్రపు పాయలో శవమై తేలారు. అయితే.. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. ఈ కేసుపై మహారాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏతో విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్​ సహా.. ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి.

ఇదీ చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం- లేఖలో తీవ్ర హెచ్చరికలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.