ETV Bharat / bharat

వెంటిలేటర్​ రోగుల చికిత్సకు 'కొవిడ్ సివియారిటీ స్కోర్'

author img

By

Published : Jun 19, 2021, 3:01 PM IST

కొవిడ్ కారణంగా.. వెంటిలేటర్ చికిత్స అవసరమయ్యే వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్​ను అభివృద్ధి చేసింది కేంద్రం. శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ రూపొందించిన 'కొవిడ్ సివియారిటీ స్కోర్' అనే ఈ సాఫ్ట్‌వేర్​తో కొవిడ్ సంక్షోభ సమయంలో పడకల కొరత తీరుతుందని వెల్లడించింది కేంద్రం.

covid severity score
'కొవిడ్ సివియారిటీ స్కోర్'

కొవిడ్‌తో బాధపడుతూ వెంటిలేటర్‌ చికిత్స అవసరమయ్యే వారిని గుర్తించేందుకు కేంద్రం నూతన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. 'కొవిడ్ సివియారిటీ స్కోర్' పేరుతో అభివృద్ది చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రోగుల్లో వెంటిలేటర్, ఐసీయూ చికిత్సలు అవసరమయ్యే వారిని గుర్తించవచ్చని వెల్లడించింది.

ఈ సాఫ్ట్‌వేర్‌లోని అల్గారిథమ్​.. కొవిడ్ రోగుల లక్షణాలు, పరీక్షల వివరాలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ కొలమానాలు, కొవిడ్ సంబంధిత సమస్యలను లెక్కించి.. 'కొవిడ్ సివియారిటీ స్కోర్‌'ను కేటాయిస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రకటనలో వెల్లడించింది. దీని ఆధారంగా ఐసీయూలో వెంటిలేటర్ చికిత్స అవసరమయ్యే వారిని గుర్తించడం సహా సరైన సమయంలో వైద్యులకు తెలియజేస్తుందని తెలిపింది. ఇదే సమయంలో వెంటిలేటర్ చికిత్స అవసరం లేని వారిని గుర్తించడం ద్వారా పడకల కొరత తీరుతుందని పేర్కొంది.

ఈ ఆల్గారిథమ్‌ను కోల్‌కతాలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ హెల్త్, సైన్స్‌ ఫర్ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.

కొవిడ్‌తో బాధపడుతూ వెంటిలేటర్‌ చికిత్స అవసరమయ్యే వారిని గుర్తించేందుకు కేంద్రం నూతన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. 'కొవిడ్ సివియారిటీ స్కోర్' పేరుతో అభివృద్ది చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రోగుల్లో వెంటిలేటర్, ఐసీయూ చికిత్సలు అవసరమయ్యే వారిని గుర్తించవచ్చని వెల్లడించింది.

ఈ సాఫ్ట్‌వేర్‌లోని అల్గారిథమ్​.. కొవిడ్ రోగుల లక్షణాలు, పరీక్షల వివరాలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ కొలమానాలు, కొవిడ్ సంబంధిత సమస్యలను లెక్కించి.. 'కొవిడ్ సివియారిటీ స్కోర్‌'ను కేటాయిస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రకటనలో వెల్లడించింది. దీని ఆధారంగా ఐసీయూలో వెంటిలేటర్ చికిత్స అవసరమయ్యే వారిని గుర్తించడం సహా సరైన సమయంలో వైద్యులకు తెలియజేస్తుందని తెలిపింది. ఇదే సమయంలో వెంటిలేటర్ చికిత్స అవసరం లేని వారిని గుర్తించడం ద్వారా పడకల కొరత తీరుతుందని పేర్కొంది.

ఈ ఆల్గారిథమ్‌ను కోల్‌కతాలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ హెల్త్, సైన్స్‌ ఫర్ ఈక్విటీ, ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది.

ఇవీ చదవండి: కరోనా పరీక్షల గ్రాఫ్‌ పెంచే గ్రాఫీన్‌!

క్యాన్సర్ బాధితులకు కరోనాతో కొత్త చిక్కులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.