NEET Suicides In Tamil Nadu: తమిళనాడులోని సేలం జిల్లాలో విషాద ఘటన జరిగింది. నీట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

ఇదీ జరిగింది:
వెళ్లైచామి(46), నాగోర్ మాలా(40) కుమార్తె తులసి(18) ఇంటర్లో మంచి మార్కులతో పాస్ అయ్యింది. గత ఏడాది నీట్ పరీక్ష కూడా రాసింది. కానీ మంచి మార్కులు సాధించలేకపోయింది. ఇక ఈ ఏడాది ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుని పరీక్షకు సన్నద్ధమైంది. కానీ ఈ సారి కూడా నీట్ పరీక్షలో పాస్ కాలేకపోయింది. దీనికితోడు బకాయి ఫీజు చెల్లించాలని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ఫీజు చెల్లించనందున తులసి ఒరిజినల్ మెమోలను ఇవ్వలేదు ఇన్స్టిట్యూట్ యాజమాన్యం. దీంతో తులసి మరో కాలేజీలో చేరలేకపోయింది. మనస్తాపంతో తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:
వేలాది విద్యార్థులకు ఫ్రీగా ట్యాబ్లు, మొబైల్స్ పంపిణీ
ఒకే స్కూల్లో 19 మంది విద్యార్థులకు కరోనా- అక్కడ ఒమిక్రాన్ కలవరం