ETV Bharat / bharat

శస్త్రచికిత్సకు ఒకరోజు ముందే ఆస్పత్రికి శరద్​ పవార్​

author img

By

Published : Mar 30, 2021, 7:46 PM IST

Updated : Mar 30, 2021, 9:43 PM IST

అస్వస్థత కారణంగా ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ ఆస్పత్రిలో చేరారు. గాల్​బ్లాడర్​ సమస్యతో బాధపడుతున్న పవార్​కు బుధవారం ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరగాల్సి ఉంది.

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్ ఆరోగ్యం​, ncp leader sharad pawar hospital
శరద్​ పవార్

ఇటీవల అస్వస్థతకు గురైన ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ మంగళవారం.. ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. పొత్తికడుపులో నొప్పి రావడం వల్ల ఆస్పత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గాల్​బ్లాడర్​ సమస్యతో బాధపడుతున్న పవార్​కు బుధవారం శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. అయితే మంగళవారం అస్వస్థతకు గురవడం వల్ల ఒకరోజు ముందే ఆస్పత్రిలో చేరారు.

పవార్​కు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు శస్త్రచికిత్స నిర్వహిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్​ తోపే వెల్లడించారు. సర్జరీ తర్వాత ఆరోగ్య స్థితి గమనించి డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇటీవల అస్వస్థతకు గురైన ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​ మంగళవారం.. ముంబయిలోని బ్రీచ్​ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. పొత్తికడుపులో నొప్పి రావడం వల్ల ఆస్పత్రిలో చేర్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గాల్​బ్లాడర్​ సమస్యతో బాధపడుతున్న పవార్​కు బుధవారం శస్త్రచికిత్స జరగాల్సి ఉంది. అయితే మంగళవారం అస్వస్థతకు గురవడం వల్ల ఒకరోజు ముందే ఆస్పత్రిలో చేరారు.

పవార్​కు బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు శస్త్రచికిత్స నిర్వహిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్​ తోపే వెల్లడించారు. సర్జరీ తర్వాత ఆరోగ్య స్థితి గమనించి డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : శరద్ పవార్​కు స్వల్ప అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక

Last Updated : Mar 30, 2021, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.