ETV Bharat / bharat

'మోదీ జీ! ముందు.. నరేంద్రమోదీ స్టేడియం పేరు మార్చండి'

author img

By

Published : Aug 6, 2021, 6:26 PM IST

రాజీవ్​ ఖేల్​రత్న పేరును మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్నగా మారుస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే సామాజిక మాధ్యమాల్లో మరో ఆలోచనను పంచుకున్నారు నెటిజన్లు. కేవలం అవార్డుల పేర్లే కాదు.. స్టేడియాల పేర్లు కూడా మార్చాలని విజ్ఞప్తి చేశారు.

narendra-modi-stadium
నరేంద్రమోదీ స్టేడియం

క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మారుస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్దిసేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్వాగతం పలికారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన నెటిజన్లు మరో ఆలోచనను పంచుకున్నారు. అదేంటంటే.. ఇకపై క్రీడా పురస్కారాలన్నింటికి.. రాజకీయనేతల పేర్లు కాకుండా క్రీడాకారుల పేర్లే పెట్టాలన్నారు.

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్‌ చేశారు. " ఈ మార్పుని కచ్చితంగా స్వాగతిస్తున్నాం. క్రీడాకారుల పేర్లమీద పురస్కారాలు అందిస్తే వారికి గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తులో స్టేడియం పేర్లకు క్రీడాకారుల పేర్లే పెడతారని భావిస్తున్నా" అన్నారు.

గుజరాత్‌ ప్రతిపక్షనేత శంకర్‌ సిన్హ్‌ వాఘేలా సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారు." ఈ మార్పు చేసిన మీరే.. నరేంద్రమోదీ స్టేడియంకి తిరిగి సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా మార్చాల్సిందిగా కోరుతున్నా" అంటూ ట్వీట్‌ చేశారు.

Shankar Sinha waghela
శంకర్‌ సిన్హ్‌ వాఘేలా

ఈ చర్చ కేవలం ప్రముఖులతో ఆగిపోలేదు. రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మార్చి మోదీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో నరేంద్రమోదీ స్టేడియం, జైట్లీ స్టేడియం పేర్ల వాటిస్థానంలో క్రీడాకారుల పేర్లు పెట్టాలి. రాజకీయ నేతల పేర్లు తీసేయాలని సామాన్య ప్రజలు డిమాండ్‌ చేశారు

అదే స్ఫూర్తితో.. ఈ స్టేడియం పేర్లూ మార్చండి..

నరేంద్ర మోదీ స్టేడియం..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా పేరొందిన మోతెరా స్టేడియం.. సర్దార్‌ పటేల్‌ స్టేడియం అని కూడా పిలుస్తారు. 2020 ఫ్రిబవరిలో సర్దార్‌ పటేల్‌ స్టేడియం పేరుని కాస్త 'నరేంద్ర మోదీ స్టేడియం' గా మార్చారు. గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి అధ్యక్షత వహించినందుకు గానూ మోదీకి ఈ గుర్తింపు ఇచ్చినట్లు అప్పట్లో పేర్కొన్నారు.

narendra-modi-stadium
నరేంద్ర మోదీ స్టేడియం

అరుణ్‌ జెట్లీ స్టేడియం..

దివంగత భాజపా సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ 2019లో మరణించారు. దిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి అధ్యక్షత వహించినందకు గానూ ఆయన మరణాంతరం దిల్లీని ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియానికి జెట్లీ స్టేడియంగా నామకరణం చేశారు.

ఇదీ చూడండి: ఖేల్​రత్న పేరు మార్పు.. ఇకపై ధ్యాన్​చంద్ ఖేల్​రత్నగా!

క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మారుస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన కొద్దిసేపట్లోనే సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్వాగతం పలికారు. ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన నెటిజన్లు మరో ఆలోచనను పంచుకున్నారు. అదేంటంటే.. ఇకపై క్రీడా పురస్కారాలన్నింటికి.. రాజకీయనేతల పేర్లు కాకుండా క్రీడాకారుల పేర్లే పెట్టాలన్నారు.

టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ట్వీట్‌ చేశారు. " ఈ మార్పుని కచ్చితంగా స్వాగతిస్తున్నాం. క్రీడాకారుల పేర్లమీద పురస్కారాలు అందిస్తే వారికి గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తులో స్టేడియం పేర్లకు క్రీడాకారుల పేర్లే పెడతారని భావిస్తున్నా" అన్నారు.

గుజరాత్‌ ప్రతిపక్షనేత శంకర్‌ సిన్హ్‌ వాఘేలా సైతం ఇదే అంశాన్ని లేవనెత్తారు." ఈ మార్పు చేసిన మీరే.. నరేంద్రమోదీ స్టేడియంకి తిరిగి సర్దార్‌ పటేల్‌ స్టేడియంగా మార్చాల్సిందిగా కోరుతున్నా" అంటూ ట్వీట్‌ చేశారు.

Shankar Sinha waghela
శంకర్‌ సిన్హ్‌ వాఘేలా

ఈ చర్చ కేవలం ప్రముఖులతో ఆగిపోలేదు. రాజీవ్‌ ఖేల్‌రత్న పేరును మేజర్ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నగా మార్చి మోదీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. అదే స్ఫూర్తితో నరేంద్రమోదీ స్టేడియం, జైట్లీ స్టేడియం పేర్ల వాటిస్థానంలో క్రీడాకారుల పేర్లు పెట్టాలి. రాజకీయ నేతల పేర్లు తీసేయాలని సామాన్య ప్రజలు డిమాండ్‌ చేశారు

అదే స్ఫూర్తితో.. ఈ స్టేడియం పేర్లూ మార్చండి..

నరేంద్ర మోదీ స్టేడియం..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా పేరొందిన మోతెరా స్టేడియం.. సర్దార్‌ పటేల్‌ స్టేడియం అని కూడా పిలుస్తారు. 2020 ఫ్రిబవరిలో సర్దార్‌ పటేల్‌ స్టేడియం పేరుని కాస్త 'నరేంద్ర మోదీ స్టేడియం' గా మార్చారు. గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి అధ్యక్షత వహించినందుకు గానూ మోదీకి ఈ గుర్తింపు ఇచ్చినట్లు అప్పట్లో పేర్కొన్నారు.

narendra-modi-stadium
నరేంద్ర మోదీ స్టేడియం

అరుణ్‌ జెట్లీ స్టేడియం..

దివంగత భాజపా సీనియర్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి అరుణ్ జైట్లీ 2019లో మరణించారు. దిల్లీ డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కి అధ్యక్షత వహించినందకు గానూ ఆయన మరణాంతరం దిల్లీని ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియానికి జెట్లీ స్టేడియంగా నామకరణం చేశారు.

ఇదీ చూడండి: ఖేల్​రత్న పేరు మార్పు.. ఇకపై ధ్యాన్​చంద్ ఖేల్​రత్నగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.