ETV Bharat / bharat

వారాంతపు లాక్​డౌన్​తో కళ తప్పిన ముంబయి

మహారాష్ట్రలో వారాంతపు లాక్​డౌన్ కొనసాగుతోంది. లాక్​డౌన్​ కారణంగా ముంబయి నగరం పూర్తిగా బోసిపోయింది. ఎప్పుడూ జనంతో కిటకిటలాడే ప్రాంతాల్లో నిర్మానుష్య వాతావరణం ఆవరించింది. నిత్యావసరాలు సరఫరా చేసే వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్​డౌన్​ కొనసాగనుంది.

author img

By

Published : Apr 10, 2021, 11:41 AM IST

Mumbai under weekend lockdown
వారాంతపు లాక్​డౌన్​తో కళ తప్పిన ముంబయి

కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన వారాంతపు లాక్‌డౌన్‌తో ముంబయి నగరం బోసిపోయి కనిపిస్తోంది. అనేక వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ముంబయిలోని గేట్​ వే ఆఫ్ ఇండియా, తాజ్​ హోటల్​ ప్రాంతాలు.. జనసంచారం లేకుండా మారాయి.

శుక్రవారం సాయంత్రం 8 గంటలకు మొదలైన ఈ లాక్​డౌన్​.. సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.

Mumbai under weekend lockdown
నిర్మానుష్యంగా కనిపిస్తున్న ముంబయిలోని 'గేట్​ వే ఆఫ్​ ఇండియా' పరిసరాలు
Mumbai under weekend lockdown
వారాంతపు లాక్​డౌన్​ కారణంగా తాజ్​ హోటల్​ వద్ద జనసంచారం లేని దృశ్యం

లాక్​డౌన్​ ప్రభావంతో ఛత్రపతి శివాజీ మహరాజ్​ టెర్మినస్ సమీపంలోని వీధులు​, బృహన్​ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ)​ ప్రధాన కార్యాలయం సమీపంలోని ప్రాంతాలు కళ తప్పాయి.

Mumbai under weekend lockdown
బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​(బీఎంసీ) పరిధిలో నిర్మానుష్యంగా పరిసరాలు
Mumbai under weekend lockdown
బీఎంసీ వద్ద జనసంచారం లేని దృశ్యం
Mumbai under weekend lockdown
నిర్మానుష్యంగా ముంబయి నగర వీధులు

వారాంతపు లాక్​డౌన్ కారణంగా ముంబయిలోని మెరెన్​ డ్రైవ్​ వెంబడి దారులన్నీ వెలవెలబోయాయి. మళ్లీ గతేడాది లాక్​డౌన్​ నాటి దృశ్యాలను గుర్తుకు తెస్తున్నాయి. అధికారులు ఈ ప్రాంతంలో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. నిత్యావసరాలను సరఫరా చేసే వాహనాలకు మాత్రమే రోడ్లపైకి అనుమతినిస్తున్నారు.

Mumbai under weekend lockdown
బోసిపోయిన మెరెన్ డ్రైవ్​ ప్రాంతం
Mumbai under weekend lockdown
కళ తప్పిన మెరెన్​ డ్రైవ్ రహదారులు
Mumbai under weekend lockdown
మెరైన్​ డ్రైవ్​ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

శుక్రవారం ముంబయిలో 9,200 కరోనా కేసులు వెలుగు చూశాయి. కొవిడ్​ ధాటికి మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:నిండుకుంటున్న టీకా నిల్వలు- పంపిణీకి బ్రేకులు!

కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న వేళ మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన వారాంతపు లాక్‌డౌన్‌తో ముంబయి నగరం బోసిపోయి కనిపిస్తోంది. అనేక వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ముంబయిలోని గేట్​ వే ఆఫ్ ఇండియా, తాజ్​ హోటల్​ ప్రాంతాలు.. జనసంచారం లేకుండా మారాయి.

శుక్రవారం సాయంత్రం 8 గంటలకు మొదలైన ఈ లాక్​డౌన్​.. సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.

Mumbai under weekend lockdown
నిర్మానుష్యంగా కనిపిస్తున్న ముంబయిలోని 'గేట్​ వే ఆఫ్​ ఇండియా' పరిసరాలు
Mumbai under weekend lockdown
వారాంతపు లాక్​డౌన్​ కారణంగా తాజ్​ హోటల్​ వద్ద జనసంచారం లేని దృశ్యం

లాక్​డౌన్​ ప్రభావంతో ఛత్రపతి శివాజీ మహరాజ్​ టెర్మినస్ సమీపంలోని వీధులు​, బృహన్​ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ)​ ప్రధాన కార్యాలయం సమీపంలోని ప్రాంతాలు కళ తప్పాయి.

Mumbai under weekend lockdown
బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​(బీఎంసీ) పరిధిలో నిర్మానుష్యంగా పరిసరాలు
Mumbai under weekend lockdown
బీఎంసీ వద్ద జనసంచారం లేని దృశ్యం
Mumbai under weekend lockdown
నిర్మానుష్యంగా ముంబయి నగర వీధులు

వారాంతపు లాక్​డౌన్ కారణంగా ముంబయిలోని మెరెన్​ డ్రైవ్​ వెంబడి దారులన్నీ వెలవెలబోయాయి. మళ్లీ గతేడాది లాక్​డౌన్​ నాటి దృశ్యాలను గుర్తుకు తెస్తున్నాయి. అధికారులు ఈ ప్రాంతంలో వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. నిత్యావసరాలను సరఫరా చేసే వాహనాలకు మాత్రమే రోడ్లపైకి అనుమతినిస్తున్నారు.

Mumbai under weekend lockdown
బోసిపోయిన మెరెన్ డ్రైవ్​ ప్రాంతం
Mumbai under weekend lockdown
కళ తప్పిన మెరెన్​ డ్రైవ్ రహదారులు
Mumbai under weekend lockdown
మెరైన్​ డ్రైవ్​ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

శుక్రవారం ముంబయిలో 9,200 కరోనా కేసులు వెలుగు చూశాయి. కొవిడ్​ ధాటికి మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:నిండుకుంటున్న టీకా నిల్వలు- పంపిణీకి బ్రేకులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.