ETV Bharat / bharat

ఆటోలో ప్రయాణిస్తున్న నర్సింగ్​ విద్యార్థినిపై గ్యాంగ్​రేప్​.. అతికష్టం మీద తప్పించుకుని..

author img

By

Published : Dec 15, 2022, 5:17 PM IST

ఆటోలో ప్రయాణిస్తున్న ఓ నర్సింగ్​ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలో జరిగింది. మరోవైపు బెంగళూరులోని ఓ కాలేజ్​ బాత్​రూమ్​లో విద్యార్థి అత్మహత్య చేసుకున్నాడు.

rape
బాలికపై అత్యాచారం

పంజాబ్​లో దారుణం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ నర్సింగ్​ విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
మొహాలీ జిల్లాకు చెందిన మన్మోహన్ సింగ్ మణి(29), మల్కీత్ సింగ్ బంటీ(24) అనే ఇద్దరు యువకులు ఒకరు ఆటో డ్రైవర్​గా, మరొకరు క్లీనర్​గా పనిచేస్తున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో బాధితురాలు మణి ఆటో ఎక్కింది. అదే సమయంలో బంటీ కూడా ఆటోలోనే ఉన్నాడు. విద్యార్థినిపై ఇద్దరు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

రైత్ బహ్రా యూనివర్శిటీ సమీపంలో వారి నుంచి బాధితురాలు అతికష్టం మీద తప్పించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను పలు సెక్షన్​ల కింద అరెస్ట్​ చేసి కోర్టులో హాజరుపరిచారు.

బాత్​రూమ్​లో స్టూడెంట్​ సూసైడ్​..
కర్ణాటకలోని బెంగళూరులో విషాదం నెలకొంది. నగరంలో ఏఎంసీ ఇంజినీరింగ్​ కాలేజ్​లో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిని నితిన్​(19) అనే ఓ విద్యార్థి ఏఎంసీ కాలేజ్​లోని సీఎస్​సీ గ్రూప్​లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి హాస్టల్​ గదిలోకి వెళ్లిన నితిన్​ చాలా సేపైన బయటకు రాలేదు. దీంతో మిగతా విద్యార్థులు తలుపు కొట్టినా స్పందన లేదు. వెంటనే వార్డెన్​కు సమాచారం అందించారు. హాస్టల్ సిబ్బంది వెనుక నుంచి బాత్​రూమ్​ తలుపులు పగలగొట్టి చూడగా విద్యార్థి రక్తపు మడుగులతో విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

పంజాబ్​లో దారుణం జరిగింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఓ నర్సింగ్​ విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
మొహాలీ జిల్లాకు చెందిన మన్మోహన్ సింగ్ మణి(29), మల్కీత్ సింగ్ బంటీ(24) అనే ఇద్దరు యువకులు ఒకరు ఆటో డ్రైవర్​గా, మరొకరు క్లీనర్​గా పనిచేస్తున్నారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో బాధితురాలు మణి ఆటో ఎక్కింది. అదే సమయంలో బంటీ కూడా ఆటోలోనే ఉన్నాడు. విద్యార్థినిపై ఇద్దరు కలిపి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

రైత్ బహ్రా యూనివర్శిటీ సమీపంలో వారి నుంచి బాధితురాలు అతికష్టం మీద తప్పించుకుంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన కొన్ని గంటల వ్యవధిలోనే నిందితులను పలు సెక్షన్​ల కింద అరెస్ట్​ చేసి కోర్టులో హాజరుపరిచారు.

బాత్​రూమ్​లో స్టూడెంట్​ సూసైడ్​..
కర్ణాటకలోని బెంగళూరులో విషాదం నెలకొంది. నగరంలో ఏఎంసీ ఇంజినీరింగ్​ కాలేజ్​లో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిని నితిన్​(19) అనే ఓ విద్యార్థి ఏఎంసీ కాలేజ్​లోని సీఎస్​సీ గ్రూప్​లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి హాస్టల్​ గదిలోకి వెళ్లిన నితిన్​ చాలా సేపైన బయటకు రాలేదు. దీంతో మిగతా విద్యార్థులు తలుపు కొట్టినా స్పందన లేదు. వెంటనే వార్డెన్​కు సమాచారం అందించారు. హాస్టల్ సిబ్బంది వెనుక నుంచి బాత్​రూమ్​ తలుపులు పగలగొట్టి చూడగా విద్యార్థి రక్తపు మడుగులతో విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.