ETV Bharat / bharat

త్వరలో మోదీ కేబినెట్ విస్తరణ- కీలక నేతలకు చోటు!

author img

By

Published : Jun 19, 2021, 6:49 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న వేళ త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. గత వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమై కేబినెట్‌ విస్తరణపైనే చర్చించినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా త్వరలో కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు జరగవచ్చని కాషాయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తవారిని మంత్రివర్గంలో చేర్చుకోవాలని.... భాజపా అధిష్ఠానం యోచిస్తోంది.

modi cabinet reshuffle
త్వరలో మోదీ కేబినెట్ విస్తరణ- కీలక నేతలకు చోటు!

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు విస్తృత స్థాయిలో కసరత్తు జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలతో రెండు సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో...... త్వరలోనే విస్తరణ ఉంటుందనే
ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రులు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాసవాన్‌, కర్ణాటక భాజపా నాయకుడు సురేష్ అంగడి మరణంతో కేబినెట్ విస్తరణకు అవకాశం ఏర్పడింది. NDA భాగస్వామ్య పక్షాలు శిరోమణి అకాలీదళ్, శివసేన నాయకులు ఖాళీ చేసిన రెండు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది.

కేంద్రమంత్రి వర్గంలోని పలు శాఖలు...అదనపు బాధ్యతలను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో... వీటిని కొత్త వారికి అప్పగించి కేబినెట్‌ హోదా కల్పించాలని భాజపా అగ్రనాయకత్వం యోచిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్యాశాఖ, పౌర విమానయానం, ఆహార శుద్ధి వంటి శాఖల్లో మార్పులు ఉండొచ్చని సమాచారం. అలాగే అంతగా ప్రభావం చూపని కొందరు మంత్రులను తొలగించి కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

26 మంది పేర్లు..

కొత్తగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలో మొత్తం 26 మంది పేర్లను భాజపా అగ్రనాయకత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిలో జ్యోతిరాదిత్య సింధియా, వరుణ్ గాంధీ, కైలాష్ విజయ్‌ వర్గీయ, దినేష్ త్రివేది, సర్బానంద సోనోవాల్, పశుపతి పరాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి మంత్రి వర్గవిస్తరణలో కేబినెట్ హోదా ఖాయంగా కనిపిస్తోంది. 2020లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భాజపా అధిష్ఠానం యోచిస్తోంది. నెహ్రూ-గాంధీల కుటుంబానికి చెందిన వరుణ్‌ గాంధీ కూడా మంత్రి వర్గ రేసులో ముందున్నారు. వరుణ్‌ గాంధీ దివంగత సంజయ్‌ గాంధీ కుమారుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన....2014లో భాజపాలో చేరారు.

బంగాల్​ నుంచి ఎవరంటే..

పశ్చిమ బంగాల్‌ భాజపా కార్యదర్శిగా పనిచేస్తున్న కైలాష్ విజయ్‌వర్గీయను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా పేరు గడించిన ఆయన 12 ఏళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. బంగాల్‌ నుంచే మరో కీలక నేత దినేష్‌ త్రివేది పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మార్చిలో అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్‌ను వీడి భాజపా తీర్థం పుచుకున్న త్రివేదీకి... కేంద్ర నాయకత్వం దృష్టిలో మంచి పేరు ఉంది. 2016-17ఏడాదికి గాను ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.

అసోం మాజీ సీఎంకు అవకాశం!

అసోం ముఖ్యమంత్రి పదవీని త్యాగం చేసిన ఆ రాష్ట్ర మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ పేరు కూడా భాజపా అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ తొలి మంత్రి వర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రిగా ఆయన రెండేళ్లు పనిచేశారు. అనంతరం 2016లో అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుతో ఆయన సీఎం పదవీని హిమంత బిస్వాకు త్యాగం చేయాల్సి వచ్చింది. లోక్‌ జనశక్తి నాయకుడు దివంగత నేత రామ్‌ విలాస్‌ పాసవాన్ సోదరుడు పశుపతి పరాస్‌ను కూడా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొనున్నట్లు సమాచారం. రామ్‌ విలాస్‌ పాస్‌వాన్‌ కుమారుడు చిరాగ్ పాస్‌వాన్‌ స్థానంలో లోక్ జన శక్తి జాతీయ అధ్యక్షుడిగా పరాస్‌ ఇటీవల ఎన్నికయ్యారు.

రాజ్యాంగం ప్రకారం కేంద్ర కేబినెట్‌లో 79 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 57 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: 2024 ఎన్నికలే లక్ష్యం- రంగంలోకి మోదీ

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు విస్తృత స్థాయిలో కసరత్తు జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్య నేతలతో రెండు సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో...... త్వరలోనే విస్తరణ ఉంటుందనే
ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రులు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాసవాన్‌, కర్ణాటక భాజపా నాయకుడు సురేష్ అంగడి మరణంతో కేబినెట్ విస్తరణకు అవకాశం ఏర్పడింది. NDA భాగస్వామ్య పక్షాలు శిరోమణి అకాలీదళ్, శివసేన నాయకులు ఖాళీ చేసిన రెండు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది.

కేంద్రమంత్రి వర్గంలోని పలు శాఖలు...అదనపు బాధ్యతలను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో... వీటిని కొత్త వారికి అప్పగించి కేబినెట్‌ హోదా కల్పించాలని భాజపా అగ్రనాయకత్వం యోచిస్తోంది. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్యాశాఖ, పౌర విమానయానం, ఆహార శుద్ధి వంటి శాఖల్లో మార్పులు ఉండొచ్చని సమాచారం. అలాగే అంతగా ప్రభావం చూపని కొందరు మంత్రులను తొలగించి కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

26 మంది పేర్లు..

కొత్తగా చేపట్టే మంత్రివర్గ విస్తరణలో మొత్తం 26 మంది పేర్లను భాజపా అగ్రనాయకత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరిలో జ్యోతిరాదిత్య సింధియా, వరుణ్ గాంధీ, కైలాష్ విజయ్‌ వర్గీయ, దినేష్ త్రివేది, సర్బానంద సోనోవాల్, పశుపతి పరాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి మంత్రి వర్గవిస్తరణలో కేబినెట్ హోదా ఖాయంగా కనిపిస్తోంది. 2020లో కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భాజపా అధిష్ఠానం యోచిస్తోంది. నెహ్రూ-గాంధీల కుటుంబానికి చెందిన వరుణ్‌ గాంధీ కూడా మంత్రి వర్గ రేసులో ముందున్నారు. వరుణ్‌ గాంధీ దివంగత సంజయ్‌ గాంధీ కుమారుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన....2014లో భాజపాలో చేరారు.

బంగాల్​ నుంచి ఎవరంటే..

పశ్చిమ బంగాల్‌ భాజపా కార్యదర్శిగా పనిచేస్తున్న కైలాష్ విజయ్‌వర్గీయను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా పేరు గడించిన ఆయన 12 ఏళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. బంగాల్‌ నుంచే మరో కీలక నేత దినేష్‌ త్రివేది పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మార్చిలో అసెంబ్లీ ఎన్నికల ముందు తృణమూల్‌ను వీడి భాజపా తీర్థం పుచుకున్న త్రివేదీకి... కేంద్ర నాయకత్వం దృష్టిలో మంచి పేరు ఉంది. 2016-17ఏడాదికి గాను ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు.

అసోం మాజీ సీఎంకు అవకాశం!

అసోం ముఖ్యమంత్రి పదవీని త్యాగం చేసిన ఆ రాష్ట్ర మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ పేరు కూడా భాజపా అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ తొలి మంత్రి వర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రిగా ఆయన రెండేళ్లు పనిచేశారు. అనంతరం 2016లో అసోం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుతో ఆయన సీఎం పదవీని హిమంత బిస్వాకు త్యాగం చేయాల్సి వచ్చింది. లోక్‌ జనశక్తి నాయకుడు దివంగత నేత రామ్‌ విలాస్‌ పాసవాన్ సోదరుడు పశుపతి పరాస్‌ను కూడా కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకొనున్నట్లు సమాచారం. రామ్‌ విలాస్‌ పాస్‌వాన్‌ కుమారుడు చిరాగ్ పాస్‌వాన్‌ స్థానంలో లోక్ జన శక్తి జాతీయ అధ్యక్షుడిగా పరాస్‌ ఇటీవల ఎన్నికయ్యారు.

రాజ్యాంగం ప్రకారం కేంద్ర కేబినెట్‌లో 79 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. 2019లో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 57 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: 2024 ఎన్నికలే లక్ష్యం- రంగంలోకి మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.