ETV Bharat / bharat

జూన్ వరకు కొవిడ్ మార్గదర్శకాలు కొనసాగింపు - హోంశాఖ తాజా మార్గదర్శకాలు

కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా జూన్ 30 వరకు కొనసాగించాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది కేంద్రం. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే నిబంధనలు సడలించాలని పేర్కొంది.

home affairs ministry
హోంశాఖ
author img

By

Published : May 27, 2021, 9:24 PM IST

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ మార్గదర్శకాలు జూన్ చివరి వరకూ కొనసాగించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. జిల్లా అధికార యంత్రాంగాలు వైరస్​ కట్టడి చర్యలపై దృష్టి సారించాలని పేర్కొంది.

'కఠిన నిబంధనల కారణంగా వైరస్​ సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. కొన్ని ప్రాంతాలు మినహా చాలా చోట్ల మెరుగైన ఫలితం కనిపించింది. అయినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కఠిన నిబంధనలు కొనసాగించడం అవసరం' అని హోంశాఖ కార్యదర్శి అజయ భల్లా పేర్కొన్నారు.

స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకునే నిబంధనలు సడలించాలని భల్లా స్పష్టం చేశారు. ఏప్రిల్​ 29 నుంచి ప్రారంభమైన నిబంధనలు జూన్ 30 వరకు కొనసాగించాలన్నారు. అయితే, లాక్​డౌన్​ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వలేదు.

రాష్ట్రాల్లో ఆక్సిజన్​ పడకలు, వెంటిలేటర్లు, అంబులెన్స్​ సేవలపై దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది.

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 2 కోట్ల 73 లక్షలు దాటింది. కొత్తగా 2 లక్షల 11 వేల మందికి వైరస్​ సోకింది. రికవరీ రేటు 90 శాతంగా ఉంది.

ఇదీ చదవండి:20 రోజులుగా స్థిరంగా తగ్గుతున్న కరోనా

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ మార్గదర్శకాలు జూన్ చివరి వరకూ కొనసాగించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. జిల్లా అధికార యంత్రాంగాలు వైరస్​ కట్టడి చర్యలపై దృష్టి సారించాలని పేర్కొంది.

'కఠిన నిబంధనల కారణంగా వైరస్​ సోకే వారి సంఖ్య క్రమంగా తగ్గింది. కొన్ని ప్రాంతాలు మినహా చాలా చోట్ల మెరుగైన ఫలితం కనిపించింది. అయినప్పటికీ యాక్టివ్ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగా కఠిన నిబంధనలు కొనసాగించడం అవసరం' అని హోంశాఖ కార్యదర్శి అజయ భల్లా పేర్కొన్నారు.

స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకునే నిబంధనలు సడలించాలని భల్లా స్పష్టం చేశారు. ఏప్రిల్​ 29 నుంచి ప్రారంభమైన నిబంధనలు జూన్ 30 వరకు కొనసాగించాలన్నారు. అయితే, లాక్​డౌన్​ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వలేదు.

రాష్ట్రాల్లో ఆక్సిజన్​ పడకలు, వెంటిలేటర్లు, అంబులెన్స్​ సేవలపై దృష్టి పెట్టాలని కేంద్రం సూచించింది.

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య 2 కోట్ల 73 లక్షలు దాటింది. కొత్తగా 2 లక్షల 11 వేల మందికి వైరస్​ సోకింది. రికవరీ రేటు 90 శాతంగా ఉంది.

ఇదీ చదవండి:20 రోజులుగా స్థిరంగా తగ్గుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.