ETV Bharat / bharat

'రెండు నెలల్లో 4 రెట్లు పెరిగిన ఆక్సిజన్​ డిమాండ్​' - నాలుగింతలు పెరిగిన ఆక్సిజన్ సరఫరా

దేశవ్యాప్తంగా మెడికల్​ ఆక్సిజన్​ సరఫరా గత రెండు నెలల్లో నాలుగింతలు పెరిగిందని కేంద్రం పేర్కొంది. మరికొన్ని రోజులు ఆక్సిజన్​ ఎక్స్​ప్రెస్​ రైళ్లను నడిపి రాష్ట్రాలకు ప్రాణవాయువు​ సరఫరా చేయనున్నట్లు తెలిపింది.

medical oxygen
మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ రైళ్లు
author img

By

Published : Apr 21, 2021, 10:09 AM IST

మెడికల్ ఆక్సిజన్ సరఫరా ఫిబ్రవరితో పోల్చుకుంటే ఏప్రిల్ నాటికి నాలుగింతలు పెరిగిందని కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి చివరి వారంలో ఒక్కోరోజు 1,273 మెట్రిక్​ టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా కాగా.. ఏప్రిల్ 17 నాటికి 4,739 మెట్రిక్​ టన్నుల వరకు ఆక్సిజన్ సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్​ ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేసినట్లు పేర్కొంది. రైల్వే శాఖ మరికొన్ని రోజులు 'ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్' రైళ్లను నడిపిస్తుందని తెలిపింది. ఈ రైళ్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్​ సిలిండర్లను దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.

పరిస్థితుల దృష్ట్యా.. దేశవ్యాప్తంగా 162 ఆక్సిజన్‌ తయారీ(ప్రెజర్ స్వింగ్) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న కేంద్రం.. మరో 100 ప్లాంట్లను నెలకొల్పేందుకు ఆసుపత్రులను గుర్తిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్​ వినియోగం పెరిగిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బల్​రామ్​ భార్గవ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ప్రజలకు మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

మెడికల్ ఆక్సిజన్ సరఫరా ఫిబ్రవరితో పోల్చుకుంటే ఏప్రిల్ నాటికి నాలుగింతలు పెరిగిందని కేంద్రం తెలిపింది. ఫిబ్రవరి చివరి వారంలో ఒక్కోరోజు 1,273 మెట్రిక్​ టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా కాగా.. ఏప్రిల్ 17 నాటికి 4,739 మెట్రిక్​ టన్నుల వరకు ఆక్సిజన్ సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్​ ఆక్సిజన్​ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో ఆక్సిజన్​ ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేసినట్లు పేర్కొంది. రైల్వే శాఖ మరికొన్ని రోజులు 'ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్' రైళ్లను నడిపిస్తుందని తెలిపింది. ఈ రైళ్లలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్​ సిలిండర్లను దేశవ్యాప్తంగా సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది.

పరిస్థితుల దృష్ట్యా.. దేశవ్యాప్తంగా 162 ఆక్సిజన్‌ తయారీ(ప్రెజర్ స్వింగ్) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్న కేంద్రం.. మరో 100 ప్లాంట్లను నెలకొల్పేందుకు ఆసుపత్రులను గుర్తిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. కొవిడ్ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్​ వినియోగం పెరిగిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బల్​రామ్​ భార్గవ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ప్రజలకు మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.