ETV Bharat / bharat

'కరోనా కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త'

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 83 రోజుల తర్వాత.. శనివారం రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూశాయి. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలి అంటే వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయడమే కాక, ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

author img

By

Published : Mar 13, 2021, 4:19 PM IST

Updated : Mar 13, 2021, 4:37 PM IST

May not be new wave yet, vaccination plus Covid protocol key to quell surge in cases: scientists
'వ్యాక్సినేషన్​ను పెంచితేనే కొత్త కేసులు అదుపులోకి'

భారత్​లో కరోనా కేసుల సంఖ్య శనివారం అమాంతంగా పెరిగింది. 83 రోజుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కొవిడ్​ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో.. దేశంలో కరోనా కొత్త వేవ్​ వచ్చే అవకాశముందని.. అయితే వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయడం సహా కరోనా నిబంధనలను పాటించడం వల్ల దానిని అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

దేశంలో తాజాగా 24వేల 882 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డిసెంబర్​ 20 నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి.

"కరోనా కేసులు గణనీయంగా వెలుగు చూస్తున్నాయి. ఈ ఉద్ధృతిని ఆపాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు టీకాలు వేయడాన్ని కూడా పెంచాలి."

-అనురాగ్​ అగర్వాల్​ , సీఎస్​ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరక్టర్​

"కరోనా కేసుల సంఖ్యను సూచించే రేఖ క్రమక్రమంగా పెరుగుతోంది. ఇది మిగతా దేశాలతో పొల్చితే కొంచెం తక్కువే. కానీ మరోసారి కొవిడ్​ ఉద్ధృతి పెరగకుండా జాగ్రత్తపడాలి."

-మౌనికా గులాటి, మెడికల్​ సైన్సెస్‌ డీన్- లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్శిటీ

ఇదీ చూడండి: వైరస్​ విజృంభణ- ఔరంగాబాద్​లోనూ వారాంతాల్లో లాక్​డౌన్​

భారత్​లో కరోనా కేసుల సంఖ్య శనివారం అమాంతంగా పెరిగింది. 83 రోజుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కొవిడ్​ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో.. దేశంలో కరోనా కొత్త వేవ్​ వచ్చే అవకాశముందని.. అయితే వ్యాక్సినేషన్​ ప్రక్రియను వేగవంతం చేయడం సహా కరోనా నిబంధనలను పాటించడం వల్ల దానిని అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

దేశంలో తాజాగా 24వేల 882 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డిసెంబర్​ 20 నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి.

"కరోనా కేసులు గణనీయంగా వెలుగు చూస్తున్నాయి. ఈ ఉద్ధృతిని ఆపాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు టీకాలు వేయడాన్ని కూడా పెంచాలి."

-అనురాగ్​ అగర్వాల్​ , సీఎస్​ఐఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరక్టర్​

"కరోనా కేసుల సంఖ్యను సూచించే రేఖ క్రమక్రమంగా పెరుగుతోంది. ఇది మిగతా దేశాలతో పొల్చితే కొంచెం తక్కువే. కానీ మరోసారి కొవిడ్​ ఉద్ధృతి పెరగకుండా జాగ్రత్తపడాలి."

-మౌనికా గులాటి, మెడికల్​ సైన్సెస్‌ డీన్- లవ్లీ ప్రొఫెషనల్​ యూనివర్శిటీ

ఇదీ చూడండి: వైరస్​ విజృంభణ- ఔరంగాబాద్​లోనూ వారాంతాల్లో లాక్​డౌన్​

Last Updated : Mar 13, 2021, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.