ETV Bharat / bharat

ముస్లిం పర్సనల్​ లా బోర్డు ఉపాధ్యక్షుడు కన్నుమూత

author img

By

Published : Nov 25, 2020, 5:01 AM IST

అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డ్​ ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్ చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Maulana Kalbe Sadiq
మౌలానా కాల్బే సాదిక్

ప్రముఖ షియా మతాధికారి, అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్​ ​(83) మంగళవారం తుదిశ్వాస విడిచారు. లఖ్​నవూలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 10 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు కాల్బే సబ్టేయిన్​ తెలిపారు.

అనారోగ్య కారణాలతో నవంబర్​ 17న ఐసీయూలో చేరారు మౌలానా. మంగళవారం హెల్త్​బులిటెన్​ విడుదల చేసిన క్రమంలో మౌలానా.. పెద్ద పేగు క్యాన్సర్​తో పాటు తీవ్రమైన న్యుమోనియా, యూటీఐ, సెప్టిక్​ షాక్​, మెటాస్టాసిస్తో వంటి వాటితో బాధపడుతున్నట్లు వెల్లడించారు వైద్యులు.

మౌలానా సాదిక్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించినట్లు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:'లవ్​ జిహాద్​'పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్​

ప్రముఖ షియా మతాధికారి, అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్​ ​(83) మంగళవారం తుదిశ్వాస విడిచారు. లఖ్​నవూలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 10 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు కాల్బే సబ్టేయిన్​ తెలిపారు.

అనారోగ్య కారణాలతో నవంబర్​ 17న ఐసీయూలో చేరారు మౌలానా. మంగళవారం హెల్త్​బులిటెన్​ విడుదల చేసిన క్రమంలో మౌలానా.. పెద్ద పేగు క్యాన్సర్​తో పాటు తీవ్రమైన న్యుమోనియా, యూటీఐ, సెప్టిక్​ షాక్​, మెటాస్టాసిస్తో వంటి వాటితో బాధపడుతున్నట్లు వెల్లడించారు వైద్యులు.

మౌలానా సాదిక్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించినట్లు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:'లవ్​ జిహాద్​'పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.