ETV Bharat / bharat

ముస్లిం పర్సనల్​ లా బోర్డు ఉపాధ్యక్షుడు కన్నుమూత - అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డ్​

అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డ్​ ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్ చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Maulana Kalbe Sadiq
మౌలానా కాల్బే సాదిక్
author img

By

Published : Nov 25, 2020, 5:01 AM IST

ప్రముఖ షియా మతాధికారి, అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్​ ​(83) మంగళవారం తుదిశ్వాస విడిచారు. లఖ్​నవూలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 10 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు కాల్బే సబ్టేయిన్​ తెలిపారు.

అనారోగ్య కారణాలతో నవంబర్​ 17న ఐసీయూలో చేరారు మౌలానా. మంగళవారం హెల్త్​బులిటెన్​ విడుదల చేసిన క్రమంలో మౌలానా.. పెద్ద పేగు క్యాన్సర్​తో పాటు తీవ్రమైన న్యుమోనియా, యూటీఐ, సెప్టిక్​ షాక్​, మెటాస్టాసిస్తో వంటి వాటితో బాధపడుతున్నట్లు వెల్లడించారు వైద్యులు.

మౌలానా సాదిక్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించినట్లు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:'లవ్​ జిహాద్​'పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్​

ప్రముఖ షియా మతాధికారి, అఖిల భారత ముస్లిం పర్సనల్​ లా బోర్డు ఉపాధ్యక్షులు మౌలానా కాల్బే సాదిక్​ ​(83) మంగళవారం తుదిశ్వాస విడిచారు. లఖ్​నవూలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి 10 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు కాల్బే సబ్టేయిన్​ తెలిపారు.

అనారోగ్య కారణాలతో నవంబర్​ 17న ఐసీయూలో చేరారు మౌలానా. మంగళవారం హెల్త్​బులిటెన్​ విడుదల చేసిన క్రమంలో మౌలానా.. పెద్ద పేగు క్యాన్సర్​తో పాటు తీవ్రమైన న్యుమోనియా, యూటీఐ, సెప్టిక్​ షాక్​, మెటాస్టాసిస్తో వంటి వాటితో బాధపడుతున్నట్లు వెల్లడించారు వైద్యులు.

మౌలానా సాదిక్​ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. వారి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించినట్లు ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చూడండి:'లవ్​ జిహాద్​'పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.