ETV Bharat / bharat

భర్త వ్యక్తిగత వివరాలు భార్యకు చెప్పాల్సిన అవసరం లేదు : హైకోర్టు

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 6:47 PM IST

Marital Status Karnataka High Court : వైవాహిక జీవితంలో ఉన్నంత మాత్రాన భర్తకు చెందిన​ వ్యక్తిగత వివరాలను భార్యకు తెలియజేయాల్సిన అవసరం లేదని కర్ణాటక హై కోర్టు వ్యాఖ్యానించింది. భర్త వ్యక్తిగత వివరాలు కోరిన భార్య కేసులో సింగిల్​ బెంచ్​ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​పై ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది.

Wife cant unilaterally access spouses UID details
Marital Status Karnataka High Court

Marital Status Karnataka High Court : వివాహం చేసుకున్నంత మాత్రాన భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి జరిగినందు వల్ల భాగస్వామికి సంబంధించిన వివరాలను తెలుసుకోలేరని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్​ బెంచ్​ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం సమర్థించింది. 2016, ఆధార్​ చట్టం ప్రకారం వైవాహిక జీవితంలో ఉన్నా సరే.. ఓ వ్యక్తికి పరిమితమైన వ్యక్తిగత వివరాలను ఇతరులకు (భార్యకు కూడా) తెలియాజేయాల్సిన అవసరం లేదని జస్టిస్​ ఎస్​​ సునీల్​ దత్​ యాదవ్​, జస్టిస్​ విజయకుమార్​ ఏ పాటిల్​తో కూడిన డివిజన్​ బెంచ్​ పేర్కొంది.

అయితే అంతకుముందు ఇదే కేసులో హై కోర్డులోని సింగిల్​​ బెంచ్​ న్యాయమూర్తి.. బాధిత మహిళకు సానుకూలంగా తీర్పునిచ్చారు. దీనిని సవాల్​ చేస్తూ యూఐడీఏఐ డైరెక్టర్​ ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్​కు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మరోసారి విచారించాలని తీర్పునిచ్చిన సింగిల్​ మెంబర్​ బెంచ్​ను ఆదేశించింది డివిజన్​ బెంచ్. అంతేకాకుండా ఈ కేసులో భర్తను ప్రతివాదిగా చేర్చాలని పేర్కొంది.

ఇదీ కేసు..
కర్ణాటక హుబ్బళ్లికి చెందిన ఓ మహిళకు 2005లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో కొంతకాలం క్రితం వీరిద్దరు విడిపోయారు. భర్తపై కేసు పెట్టడం వల్ల.. బాధిత భార్యకు, ఆమె కుమార్తెకు ప్రతినెల భరణం కింద రూ.10,000, రూ.5,000లను చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం భర్త భరణం చెల్లించకపోగా.. తప్పించుకొని తిరుగుతున్నాడని భార్య ఆరోపించింది. దీంతో అతడి ఆచూకీ కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI)ని ఆశ్రయించింది బాధితురాలు. తన భర్తకు చెందిన ఆధార్​ వివరాలను తెలపాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంది. కాగా, ఈ అప్పీల్​ను 2021, ఫిబ్రవరి 25న ఆధార్​ సంస్థ తిరస్కరించింది. అంతేకాకుండా 2016, ఆధార్ చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయలేమని.. వాటి గోప్యతకు భంగం కలిగించలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ ఆ మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై స్పందించిన సింగిల్​ బెంచ్​.. అప్పట్లో భర్తకు నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే మహిళ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని 2023, ఫిబ్రవరి 8న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థని ఆదేశించింది.

'ఈ కేసులో ఆ నియమం వర్తించదు..'
అయితే, సింగిల్​ బెంచ్​ తీర్పుపై హై కోర్టు డివిజనల్ బెంచ్​కు అప్పీల్​కు వెళ్లిన UIDAI.. ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(1)కి కట్టుబడి ఉండటం తప్పనిసరి అని పేర్కొంది. దీని ప్రకారం వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఇతరులకు చెప్పలేమని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తే తప్ప సమాచారం ఇవ్వలేమని వివరించింది. మరోవైపు 'పెళ్లయ్యాక భార్యాభర్తల గుర్తింపు అనేది ఇద్దరికి సంబంధించిన అంశం. దంపతుల్లో ఒకరి గురించిన వివరాలను మరొకరు తెలుసుకోవడంలో అభ్యంతరం లేదు. వీరు కాకుండా బయటి (థర్డ్​ పార్టీ) వ్యక్తి సమాచారం కోరినప్పుడు పరిమితులు విధించడం సమంజసమే. ఈ కేసులో ఆ షరత్తు వర్తించదు' అని భార్య తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించారు.

ప్రముఖ గోల్డ్​ షాప్​లో 25 కిలోల బంగారు నగలు లూటీ

అట్టహాసంగా కార్తీక దీపం వేడుక- 80 అడుగుల ఎత్తులో జ్యోతి ప్రజ్వలన!

Marital Status Karnataka High Court : వివాహం చేసుకున్నంత మాత్రాన భాగస్వామి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి జరిగినందు వల్ల భాగస్వామికి సంబంధించిన వివరాలను తెలుసుకోలేరని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్​ బెంచ్​ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్​ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం సమర్థించింది. 2016, ఆధార్​ చట్టం ప్రకారం వైవాహిక జీవితంలో ఉన్నా సరే.. ఓ వ్యక్తికి పరిమితమైన వ్యక్తిగత వివరాలను ఇతరులకు (భార్యకు కూడా) తెలియాజేయాల్సిన అవసరం లేదని జస్టిస్​ ఎస్​​ సునీల్​ దత్​ యాదవ్​, జస్టిస్​ విజయకుమార్​ ఏ పాటిల్​తో కూడిన డివిజన్​ బెంచ్​ పేర్కొంది.

అయితే అంతకుముందు ఇదే కేసులో హై కోర్డులోని సింగిల్​​ బెంచ్​ న్యాయమూర్తి.. బాధిత మహిళకు సానుకూలంగా తీర్పునిచ్చారు. దీనిని సవాల్​ చేస్తూ యూఐడీఏఐ డైరెక్టర్​ ద్విసభ్య ధర్మాసనానికి అప్పీల్​కు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ కేసును మరోసారి విచారించాలని తీర్పునిచ్చిన సింగిల్​ మెంబర్​ బెంచ్​ను ఆదేశించింది డివిజన్​ బెంచ్. అంతేకాకుండా ఈ కేసులో భర్తను ప్రతివాదిగా చేర్చాలని పేర్కొంది.

ఇదీ కేసు..
కర్ణాటక హుబ్బళ్లికి చెందిన ఓ మహిళకు 2005లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. అయితే పలు వ్యక్తిగత కారణాలతో కొంతకాలం క్రితం వీరిద్దరు విడిపోయారు. భర్తపై కేసు పెట్టడం వల్ల.. బాధిత భార్యకు, ఆమె కుమార్తెకు ప్రతినెల భరణం కింద రూ.10,000, రూ.5,000లను చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఆదేశాల ప్రకారం భర్త భరణం చెల్లించకపోగా.. తప్పించుకొని తిరుగుతున్నాడని భార్య ఆరోపించింది. దీంతో అతడి ఆచూకీ కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI)ని ఆశ్రయించింది బాధితురాలు. తన భర్తకు చెందిన ఆధార్​ వివరాలను తెలపాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంది. కాగా, ఈ అప్పీల్​ను 2021, ఫిబ్రవరి 25న ఆధార్​ సంస్థ తిరస్కరించింది. అంతేకాకుండా 2016, ఆధార్ చట్టంలోని సెక్షన్ 33 ప్రకారం ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయలేమని.. వాటి గోప్యతకు భంగం కలిగించలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ ఆ మహిళ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై స్పందించిన సింగిల్​ బెంచ్​.. అప్పట్లో భర్తకు నోటీసులు కూడా జారీ చేసింది. అలాగే మహిళ చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని 2023, ఫిబ్రవరి 8న భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థని ఆదేశించింది.

'ఈ కేసులో ఆ నియమం వర్తించదు..'
అయితే, సింగిల్​ బెంచ్​ తీర్పుపై హై కోర్టు డివిజనల్ బెంచ్​కు అప్పీల్​కు వెళ్లిన UIDAI.. ఆధార్ చట్టంలోని సెక్షన్ 33(1)కి కట్టుబడి ఉండటం తప్పనిసరి అని పేర్కొంది. దీని ప్రకారం వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఇతరులకు చెప్పలేమని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. హైకోర్టు న్యాయమూర్తి ఆదేశిస్తే తప్ప సమాచారం ఇవ్వలేమని వివరించింది. మరోవైపు 'పెళ్లయ్యాక భార్యాభర్తల గుర్తింపు అనేది ఇద్దరికి సంబంధించిన అంశం. దంపతుల్లో ఒకరి గురించిన వివరాలను మరొకరు తెలుసుకోవడంలో అభ్యంతరం లేదు. వీరు కాకుండా బయటి (థర్డ్​ పార్టీ) వ్యక్తి సమాచారం కోరినప్పుడు పరిమితులు విధించడం సమంజసమే. ఈ కేసులో ఆ షరత్తు వర్తించదు' అని భార్య తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదించారు.

ప్రముఖ గోల్డ్​ షాప్​లో 25 కిలోల బంగారు నగలు లూటీ

అట్టహాసంగా కార్తీక దీపం వేడుక- 80 అడుగుల ఎత్తులో జ్యోతి ప్రజ్వలన!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.