ETV Bharat / bharat

చెలరేగిన నక్సల్స్​.. పోలీసులపై బాంబు దాడి, వాహనాలకు నిప్పు!

author img

By

Published : Feb 9, 2022, 7:05 AM IST

రహదారి నిర్మాణంలో ఉన్న ఓ ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు మావోయిస్టులు. ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు.. ఛత్తీస్​గఢ్​లో నక్సల్స్ అమర్చిన బాంబు పేలి ఇద్దరు పోలీసు అధికారులతో సహా నలుగురు సీఆర్​పీఎఫ్ సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు.

Maoists set fire on JCB
నక్సల్స్ నిప్పంటించిన జీసీబీ

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

సమీప గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఘటనా స్థలంలో పోస్టర్​ను అతికించి వెళ్లారు. సీఆర్​పీఎఫ్ క్యాంపుల నిర్వహణ, నక్సల్స్ పేరుతో ప్రజలను నిర్బంధించి డబ్బులు వసూలు చేస్తూరని ఆరోపించారు.

బాంబు పేలి..

మవోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా నలుగురు సీఆర్​పీఎఫ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని మోదక్​పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్కినార్ రోడ్డులో బెటాలియన్ బృందం ఆపరేషన్​లో ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఐఈడీ బాంబు పేలింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: యూపీలో ఉగ్రకుట్ర భగ్నం.. ఆల్​ఖైదా తీవ్రవాది అరెస్ట్​

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

సమీప గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఘటనా స్థలంలో పోస్టర్​ను అతికించి వెళ్లారు. సీఆర్​పీఎఫ్ క్యాంపుల నిర్వహణ, నక్సల్స్ పేరుతో ప్రజలను నిర్బంధించి డబ్బులు వసూలు చేస్తూరని ఆరోపించారు.

బాంబు పేలి..

మవోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా నలుగురు సీఆర్​పీఎఫ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లోని బీజాపుర్ జిల్లాలో జరిగింది.

జిల్లాలోని మోదక్​పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్కినార్ రోడ్డులో బెటాలియన్ బృందం ఆపరేషన్​లో ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఐఈడీ బాంబు పేలింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: యూపీలో ఉగ్రకుట్ర భగ్నం.. ఆల్​ఖైదా తీవ్రవాది అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.