ETV Bharat / bharat

మమతా బెనర్జీకి చుక్కెదురు- జరిమానా విధించిన హైకోర్టు

author img

By

Published : Jul 7, 2021, 12:18 PM IST

Updated : Jul 7, 2021, 1:17 PM IST

బంగాల్​ సీఎం మమతా బెనర్జీకి కోల్​కతా హైకోర్టు రూ. 5లక్షల జరిమానా విధించింది. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారని ఈ మేరకు తీర్పునిచ్చింది. నందిగ్రామ్​లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్​ కౌషిక్ చందా తెలిపారు.

12381413_thumbnail_3x2_img.jpg
బంగాల్​ సీఎం మమతా బెనర్జీ

నందిగ్రామ్​లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ బంగాల్​ సీఎం మమతా బెనర్జీ నమోదు చేసిన కేసు విచారణ నుంచి జస్టిస్​ కౌషిక్​ చందా తప్పుకున్నారు. న్యాయ వ్యవస్థపై దురుద్దేశాన్ని ఆపాదించినందుకు మమతకు రూ.5లక్షల జరిమానాను విధించారు.

ఇదీ జరిగింది..

నందిగ్రామ్​లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్​ కౌషిక్​ చందా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్​ చందాకు భాజపాతో సంబంధాలు ఉన్నాయని మమత ఆరోపించారు. నందిగ్రామ్ పిటిషన్​ను ఇతర బెంచ్​కు బదిలీ చేయాలని కోరారు. విచారణ నుంచి జస్టిస్​ కౌషిక్ చందాను తప్పించాలని జూన్ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మమత తరపు న్యాయవాది లేఖ రాశారు.

జస్టిస్​ కౌషిక్ చందాను కేసు విచారణ నుంచి తప్పించాలని కోరుతూ జూన్ 24న పిటిషన్​ దాఖలు చేశారు మమత. నందిగ్రామ్​ ఫలితాలను సవాల్​ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్​తో సహా న్యాయమూర్తి తప్పుకోవాలని కోరుతూ చేసిన దరఖాస్తులపై విచారణ చేపట్టింది జస్టిస్​ కౌషిక్​ చందా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం. న్యాయ వ్యవస్థపై దురుద్దేశాన్ని ఆపాదించినందుకు ఈ మేరకు రూ.5లక్షల జరిమానా విధిస్తూ.. విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నగదును కొవిడ్​-19తో ప్రభావితమైన న్యాయవాదుల కుటుంబాలకు అందించాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:'అలాంటి వారికి ఈ సమాజంలో స్థానం లేదు'

'మోదీ ప్రభుత్వం పన్ను దోపిడితో నడుస్తోంది'

నందిగ్రామ్​లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ బంగాల్​ సీఎం మమతా బెనర్జీ నమోదు చేసిన కేసు విచారణ నుంచి జస్టిస్​ కౌషిక్​ చందా తప్పుకున్నారు. న్యాయ వ్యవస్థపై దురుద్దేశాన్ని ఆపాదించినందుకు మమతకు రూ.5లక్షల జరిమానాను విధించారు.

ఇదీ జరిగింది..

నందిగ్రామ్​లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్​ కౌషిక్​ చందా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్​ చందాకు భాజపాతో సంబంధాలు ఉన్నాయని మమత ఆరోపించారు. నందిగ్రామ్ పిటిషన్​ను ఇతర బెంచ్​కు బదిలీ చేయాలని కోరారు. విచారణ నుంచి జస్టిస్​ కౌషిక్ చందాను తప్పించాలని జూన్ 18న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి మమత తరపు న్యాయవాది లేఖ రాశారు.

జస్టిస్​ కౌషిక్ చందాను కేసు విచారణ నుంచి తప్పించాలని కోరుతూ జూన్ 24న పిటిషన్​ దాఖలు చేశారు మమత. నందిగ్రామ్​ ఫలితాలను సవాల్​ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్​తో సహా న్యాయమూర్తి తప్పుకోవాలని కోరుతూ చేసిన దరఖాస్తులపై విచారణ చేపట్టింది జస్టిస్​ కౌషిక్​ చందా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం. న్యాయ వ్యవస్థపై దురుద్దేశాన్ని ఆపాదించినందుకు ఈ మేరకు రూ.5లక్షల జరిమానా విధిస్తూ.. విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నగదును కొవిడ్​-19తో ప్రభావితమైన న్యాయవాదుల కుటుంబాలకు అందించాలని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:'అలాంటి వారికి ఈ సమాజంలో స్థానం లేదు'

'మోదీ ప్రభుత్వం పన్ను దోపిడితో నడుస్తోంది'

Last Updated : Jul 7, 2021, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.