వీల్ఛైర్లోనే ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా పురులియా జిల్లాలో పర్యటించనున్న దీదీ.. ఝల్దా సహా బలరాంపుర్ రత్తాలా ప్రాంతాల్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
అంతకుముందు ప్రచార షెడ్యూల్ ప్రకారం.. బంకురా, ఝర్గాం జిల్లాల్లో ప్రచారం చేయాల్సి ఉంది. అయితే హెలికాఫ్టర్ ద్వారా అన్ని జిల్లాలకు మమత వెళతారని.. కాలి గాయం కారణంగా వీల్ఛైర్లోనే కూర్చొని దీదీ ప్రచారం చేస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.
ఈ నెల 10న నందిగ్రామ్ ప్రచారంలో మమత కాలికి గాయమైంది. దీంతో ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రికి చేరిన దీదీకి.. రెండు రోజులు చికిత్స అందించారు వైద్యులు. శుక్రవారం సాయంత్రం డిశ్చార్జి చేశారు.
ఇదీ చూడండి: 'భాజపాకు ఓటేయకండి'- నందిగ్రామ్లో టికాయత్