ETV Bharat / bharat

భాజపా నేత గెలుపుపై హైకోర్టుకు సీఎం- నేడే విచారణ

author img

By

Published : Jun 18, 2021, 5:51 AM IST

Updated : Jun 18, 2021, 6:39 AM IST

నందిగ్రామ్​లో భాజపా నేత సువేందు అధికారి గెలుపును హైకోర్టులో సవాల్​ చేశారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగి ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఈరోజే విచారించనుంది ధర్మాసనం.

Mamata Banerjee
సువేందు అధికారి

నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి గెలుపును బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు ఆమె కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు అపూర్వమైన 'హ్యాట్రిక్‌' విజయం అందించిన దీదీ.. తొలిసారి నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగి ఒకప్పటి తన కుడి భుజంలా ఉన్న నాయకుడు సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు.

మే 3న జరిగిన ఓట్ల లెక్కింపులో నందిగ్రామ్‌ ఫలితం క్షణం క్షణం ఉత్కంఠ రేపింది. మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య రౌండ్‌ రౌండుకూ ఆధిక్యం చేతులు మారడం వల్ల విజయం చివరి వరకూ దోబూచులాడింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ అనంతరం చివరకు దాదాపు 1700 ఓట్ల తేడాతో సువేందు అధికారి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.

నేడే విచారణ..

ఓట్ల లెక్కింపు మరుసటి రోజు దీదీ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు సందర్భంలో దాదాపు నాలుగు గంటల పాటు సర్వర్లు డౌన్‌ కావడం అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. గవర్నర్‌ కూడా తాను గెలిచినట్టుగా అభినందనలు తెలిపారని, కానీ అకస్మాత్తుగా అంతా మారిపోయిందంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎన్నికల అధికారికి బెదిరింపులు కూడా వచ్చాయంటూ విలేకర్ల సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సువేందు అధికారి గెలుపును సవాల్‌ చేస్తూ తాజాగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను జస్టిస్‌ కౌశిక్‌ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారించనుంది.

ఇదీ చూడండి: బంగాల్​లో అసలు ఆట ఇప్పుడే మొదలైందా?

నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి గెలుపును బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు ఆమె కోల్‌కతా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు అపూర్వమైన 'హ్యాట్రిక్‌' విజయం అందించిన దీదీ.. తొలిసారి నందిగ్రామ్‌ నుంచి బరిలో దిగి ఒకప్పటి తన కుడి భుజంలా ఉన్న నాయకుడు సువేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు.

మే 3న జరిగిన ఓట్ల లెక్కింపులో నందిగ్రామ్‌ ఫలితం క్షణం క్షణం ఉత్కంఠ రేపింది. మమతా బెనర్జీ, సువేందు అధికారి మధ్య రౌండ్‌ రౌండుకూ ఆధిక్యం చేతులు మారడం వల్ల విజయం చివరి వరకూ దోబూచులాడింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఉత్కంఠ అనంతరం చివరకు దాదాపు 1700 ఓట్ల తేడాతో సువేందు అధికారి గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.

నేడే విచారణ..

ఓట్ల లెక్కింపు మరుసటి రోజు దీదీ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు సందర్భంలో దాదాపు నాలుగు గంటల పాటు సర్వర్లు డౌన్‌ కావడం అవకతవకలు జరిగేందుకు అవకాశం ఉన్నట్టు అనుమానం వ్యక్తంచేశారు. గవర్నర్‌ కూడా తాను గెలిచినట్టుగా అభినందనలు తెలిపారని, కానీ అకస్మాత్తుగా అంతా మారిపోయిందంటూ ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఎన్నికల అధికారికి బెదిరింపులు కూడా వచ్చాయంటూ విలేకర్ల సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సువేందు అధికారి గెలుపును సవాల్‌ చేస్తూ తాజాగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను జస్టిస్‌ కౌశిక్‌ చంద్ర నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారించనుంది.

ఇదీ చూడండి: బంగాల్​లో అసలు ఆట ఇప్పుడే మొదలైందా?

Last Updated : Jun 18, 2021, 6:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.