కరోనా విజృంభణ వేళ ఆక్సిజన్ సిలిండర్లను అధిక ధరకు విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటుండగా.. కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్లు విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు మరికొందరు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
జిల్లాలోని ఓ వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ల పేరుతో కార్బన్ డైఆక్సైడ్ నిల్వకు ఉద్దేశించిన ఖాళీ సిలిండర్లు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సిలిండర్ల వల్ల పేలుడు సంభవిస్తుందని అందులో పేర్కొన్నారు.
"ముందుగా కార్బన్డై ఆక్సైడ్ నింపిన ఖాళీ సిలిండర్లలో ఆక్సిజన్ నింపినట్లయితే అవి పేలిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి సిలిండర్లు రోగి ఆరోగ్యానికి కూడా హానికరమని రుజువయ్యాయి" అని ఆయన చెప్పారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మంత్రి.. దీనిపై దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: 'అధికారుల్ని జైల్లో వేస్తే ఆక్సిజన్ వస్తుందా?'