ETV Bharat / bharat

'మరాఠాలను వెనకబడిన తరగతిగా గుర్తించాలి'

author img

By

Published : May 12, 2021, 1:09 PM IST

మరాఠాలను ఎస్​ఈబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈ అంశంపై చర్చించేందుకు త్వరలోనే ప్రధానిని కలవనున్నట్లు పేర్కొన్నారు.

Thackeray
ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

మరాఠాలను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ) జాబితాలో చేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈ మేరకు మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 12, 13 శాతం రిజర్వేషన్ కల్పించే అవకాశం ఇవ్వాలని ఠాక్రే కోరారు.

మే 5న మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ.. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఠాక్రే లేఖకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మరోసారి తెలుపనున్నట్లు ఠాక్రే లేఖలో పేర్కొన్నారు.

Maharashtra leaders
గవర్నర్​ను కలిసిన నేతలు

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్​ఈబీసీ) జాబితాను ప్రకటించకుండా రాష్ట్రాల అధికారాలను రాజ్యాంగంలోని 102వ సవరణ ఏ మాత్రం అడ్డుకోలేదని ఠాక్రే అన్నారు.

మరాఠా రిజర్వేషన్లపై.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు నేతలు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. ఈ సమావేశం అనంతరం మాట్లాడిన ఠాక్రే.. రిజర్వేషన్ల అంశంపై త్వరలోనే ప్రధాని మోదీని కలవనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'మరాఠా కోటా' తీర్పు.. రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ

మరాఠాలను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ) జాబితాలో చేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈ మేరకు మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 12, 13 శాతం రిజర్వేషన్ కల్పించే అవకాశం ఇవ్వాలని ఠాక్రే కోరారు.

మే 5న మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ.. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఠాక్రే లేఖకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మరోసారి తెలుపనున్నట్లు ఠాక్రే లేఖలో పేర్కొన్నారు.

Maharashtra leaders
గవర్నర్​ను కలిసిన నేతలు

సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల (ఎస్​ఈబీసీ) జాబితాను ప్రకటించకుండా రాష్ట్రాల అధికారాలను రాజ్యాంగంలోని 102వ సవరణ ఏ మాత్రం అడ్డుకోలేదని ఠాక్రే అన్నారు.

మరాఠా రిజర్వేషన్లపై.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే సహా పలువురు నేతలు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. ఈ సమావేశం అనంతరం మాట్లాడిన ఠాక్రే.. రిజర్వేషన్ల అంశంపై త్వరలోనే ప్రధాని మోదీని కలవనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:'మరాఠా కోటా' తీర్పు.. రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.