ETV Bharat / bharat

నెత్తురోడిన రహదారులు.. ఐదుగురు చిన్నారులు మృతి

వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో (road accident in india) దేశంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. చిన్నారులతో సహా పలువురు మృతి చెందారు. మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలికలతో సహా ఓ యువకుడు మృతి చెందాడు. జమ్ముకశ్మీర్​లో పిల్లలతో ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడిపోయింది.

author img

By

Published : Nov 9, 2021, 7:29 AM IST

accident news in maharastra
రోడ్డు ప్రమాదాలు

దేశంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో రోడ్లు నెత్తురోడాయి. చిన్నారులతో సహా (road accident in india) పలువురు మృతి చెందారు.

మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి- ఆగ్రా రహదారిలో బైక్​ను ట్రక్కు ఢీకొన్న ఘటనలో (accident news in maharastra) ముగ్గురు బాలికలతో సహా ఓ యువకుడు మృతి చెందాడు. బాధితులు పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే వారు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.

ఓ శిశువుతో సహా.. ఇద్దరు మహిళలు

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఎస్​యూవీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఓ శిశువు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. జైపుర్​-బికనేర్ జాతీయ రహదారిలో ఈ ఘటన జరిగింది.

బాలుడు మృతి.. 8 మందికి గాయాలు..

జమ్ముకశ్మీర్​ రాం​బన్​ జిల్లాలో పిల్లలతో ప్రయాణిస్తున్న ఓ ఆటో (accident news in jammu kashmir) అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఓ బాలుడు(6) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి: చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు- నలుగురు చిన్నారులు మృతి

పన్ను నొప్పి అని వెళ్లిన మహిళపై డెంటిస్ట్​ అత్యాచారం

దేశంలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో రోడ్లు నెత్తురోడాయి. చిన్నారులతో సహా (road accident in india) పలువురు మృతి చెందారు.

మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబయి- ఆగ్రా రహదారిలో బైక్​ను ట్రక్కు ఢీకొన్న ఘటనలో (accident news in maharastra) ముగ్గురు బాలికలతో సహా ఓ యువకుడు మృతి చెందాడు. బాధితులు పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే వారు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు.

ఓ శిశువుతో సహా.. ఇద్దరు మహిళలు

రాజస్థాన్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఎస్​యూవీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ఓ శిశువు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. జైపుర్​-బికనేర్ జాతీయ రహదారిలో ఈ ఘటన జరిగింది.

బాలుడు మృతి.. 8 మందికి గాయాలు..

జమ్ముకశ్మీర్​ రాం​బన్​ జిల్లాలో పిల్లలతో ప్రయాణిస్తున్న ఓ ఆటో (accident news in jammu kashmir) అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఓ బాలుడు(6) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి: చిన్నారుల వార్డులో చెలరేగిన మంటలు- నలుగురు చిన్నారులు మృతి

పన్ను నొప్పి అని వెళ్లిన మహిళపై డెంటిస్ట్​ అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.