ETV Bharat / bharat

మహారాష్ట్ర గవర్నర్​కు చేదు అనుభవం

author img

By

Published : Feb 11, 2021, 5:02 PM IST

మహారాష్ట్ర గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వ విమానాన్ని వాడుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఉత్తరాఖండ్​, ముస్సోరీలోని లాల్​ బహదూర్​ శాస్త్రీ అకాడమీలో జరగనున్న అధికారిక వేడుకకు గవర్నర్​ హాజరు కావాల్సి ఉంది.

Maha Guv barred from boarding state govt aircraft
మహారాష్ట్ర గవర్నర్​కు చేదు అనుభవం

మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కోశ్యారీకి అవమానం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ విమానాన్ని వాడుకోవడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఉత్తరాఖండ్​, ముస్సోరీలోని లాల్​ బహదూర్​ శాస్త్రీ అకాడమీలో జరగనున్న ఐఏఎస్​ అధికారుల శిక్షణా కార్యక్రమానికి గవర్నర్​ హాజరు కావాల్సి ఉంది. గత కొన్ని రోజుల నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి, గవర్నర్​కు మధ్య విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

ఎక్కిన తర్వాత కూడా..

ప్రభుత్వ విమానం కోసం అనుమతి కోరుతూ ఫిబ్రవరి 2నే ప్రభుత్వానికి గవర్నర్​ సెక్రటరీ లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం ఈ విషయంపై సమాచారం ఇచ్చామని గవర్నర్​ కార్యాలయం వెల్లడించింది. ఉదయం పది గంటలకు ముంబయి విమానాశ్రయానికి గవర్నర్​ తన సహాయకులతో కలిసి వెళ్లారు. ప్రభుత్వ విమానాన్ని ఎక్కిన తర్వాత కూడా అనుమతులు లేవని నిరాకరించారు. దీనికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

Maha Guv barred from boarding state govt aircraft
ఉత్తరాఖండ్​ ఎయిర్​పోర్ట్​కు చేరుకున్న మహారాష్ట్ర గవర్నర్​

తప్పని స్థితిలో వేరే కమర్షియల్​ ఫ్లైట్​లో గవర్నర్​ ఉత్తరాఖండ్​లోని దేహ్రాదూన్​కు వెళ్లారు.

ప్రభుత్వ స్పందన..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ను ఈ విషయంపై అడగగా.. తనకు తెలియదని సమాధానమిచ్చారు. సమాచారం తెలుసుకొని చెబుతానని అన్నారు.

చిన్నపిల్లల చేష్టలు..

ఈ విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా మండిపడింది. ప్రభుత్వ అహంకారానికి ఈ చర్య అద్దం పడుతోందని ఆరోపించింది. ప్రభుత్వానివి చిన్నపిల్లల చేష్టలని దుయ్యబట్టింది. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేసింది

ఇదీ చదవండి:'బాంబే హైకోర్టు తీర్పు' సవాల్ పిటిషన్​ విచారణకు సుప్రీం ఓకే

మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కోశ్యారీకి అవమానం ఎదురైంది. రాష్ట్ర ప్రభుత్వ విమానాన్ని వాడుకోవడానికి ప్రభుత్వం నిరాకరించింది. ఉత్తరాఖండ్​, ముస్సోరీలోని లాల్​ బహదూర్​ శాస్త్రీ అకాడమీలో జరగనున్న ఐఏఎస్​ అధికారుల శిక్షణా కార్యక్రమానికి గవర్నర్​ హాజరు కావాల్సి ఉంది. గత కొన్ని రోజుల నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి, గవర్నర్​కు మధ్య విభేదాలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

ఎక్కిన తర్వాత కూడా..

ప్రభుత్వ విమానం కోసం అనుమతి కోరుతూ ఫిబ్రవరి 2నే ప్రభుత్వానికి గవర్నర్​ సెక్రటరీ లేఖ రాశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి సైతం ఈ విషయంపై సమాచారం ఇచ్చామని గవర్నర్​ కార్యాలయం వెల్లడించింది. ఉదయం పది గంటలకు ముంబయి విమానాశ్రయానికి గవర్నర్​ తన సహాయకులతో కలిసి వెళ్లారు. ప్రభుత్వ విమానాన్ని ఎక్కిన తర్వాత కూడా అనుమతులు లేవని నిరాకరించారు. దీనికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

Maha Guv barred from boarding state govt aircraft
ఉత్తరాఖండ్​ ఎయిర్​పోర్ట్​కు చేరుకున్న మహారాష్ట్ర గవర్నర్​

తప్పని స్థితిలో వేరే కమర్షియల్​ ఫ్లైట్​లో గవర్నర్​ ఉత్తరాఖండ్​లోని దేహ్రాదూన్​కు వెళ్లారు.

ప్రభుత్వ స్పందన..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ను ఈ విషయంపై అడగగా.. తనకు తెలియదని సమాధానమిచ్చారు. సమాచారం తెలుసుకొని చెబుతానని అన్నారు.

చిన్నపిల్లల చేష్టలు..

ఈ విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా మండిపడింది. ప్రభుత్వ అహంకారానికి ఈ చర్య అద్దం పడుతోందని ఆరోపించింది. ప్రభుత్వానివి చిన్నపిల్లల చేష్టలని దుయ్యబట్టింది. ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేసింది

ఇదీ చదవండి:'బాంబే హైకోర్టు తీర్పు' సవాల్ పిటిషన్​ విచారణకు సుప్రీం ఓకే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.