ETV Bharat / bharat

కరోనాతో కాంగ్రెస్​ ఎమ్మెల్యే మృతి - మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బ్రిజేంద్ర సింగ్ రాథోడ్​ కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడ్డ ఆయనకు గుండెపోటు రాగా.. ఆదివారం తుదిశ్వాస విడిచారు.

mla died
కరోనా బారిన పడి కాంగ్రెస్​ ఎమ్మెల్యే కన్నమూత
author img

By

Published : May 2, 2021, 10:25 PM IST

మధ్యప్రదేశ్​లో కరోనా బారిన పడి కాంగ్రెస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బ్రిజేంద్ర సింగ్​ రాథోడ్​ కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రాగా.. ఆదివారం తుది శ్వాస విడిచారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.

తికంగఢ్​ జిల్లా పృథ్వీపుర్​ అసెంబ్లీ స్థానానికి బ్రిజేంద్ర సింగ్​ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతవారం ఆయనకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. భోపాల్​లోని ఓ ఆస్పత్రికి తరలించారు. దామోహ్​ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున బ్రిజేంద్ర సింగ్​ ఇన్​ఛార్జ్​గానూ వ్యవహరించారు.

బ్రిజేంద్ర సింగ్​ మృతి పట్ల మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ , ఆ రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు​ కమల్​నాథ్​ సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్​ చేపట్టండి'

మధ్యప్రదేశ్​లో కరోనా బారిన పడి కాంగ్రెస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బ్రిజేంద్ర సింగ్​ రాథోడ్​ కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రాగా.. ఆదివారం తుది శ్వాస విడిచారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.

తికంగఢ్​ జిల్లా పృథ్వీపుర్​ అసెంబ్లీ స్థానానికి బ్రిజేంద్ర సింగ్​ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతవారం ఆయనకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కాగా.. భోపాల్​లోని ఓ ఆస్పత్రికి తరలించారు. దామోహ్​ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున బ్రిజేంద్ర సింగ్​ ఇన్​ఛార్జ్​గానూ వ్యవహరించారు.

బ్రిజేంద్ర సింగ్​ మృతి పట్ల మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్ చౌహాన్ , ఆ రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు​ కమల్​నాథ్​ సంతాపం తెలిపారు.

ఇదీ చూడండి: 'దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్​ చేపట్టండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.