ETV Bharat / bharat

ఆలయం 'లాక్​డౌన్'​- రోడ్డుపైనే పెళ్లిళ్లు - తమిళనాడు దేవనాథ స్వామి ఆలయం

కరోనా నేపథ్యంలో తమిళనాడులోని ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ నిర్ణయంతో ఆలయాల్లో వివాహం చేసుకోవాలనుకున్న జంటలు ఒకింత నిరాశకు గురయ్యాయి. అయితే కడలూరు తిరువంతిపురం దేవనాథ స్వామి ఆలయంలో వివాహం చేసుకోవాలని ముందుగానే నిర్ణయించిన కొన్ని జంటలు మాత్రం గుడి ముందు రోడ్డుపైనే వివాహం చేసుకోవడం విశేషం.

Lock down: Marriages held on road in front of temple
లాక్​డౌన్​తో ఆలయం మూత.. రోడ్డు మీదే పెళ్లి
author img

By

Published : Apr 26, 2021, 5:23 PM IST

లాక్​డౌన్​తో ఆలయం మూత.. రోడ్డు మీదే పెళ్లి

తమిళనాడు కడలూర్ జిల్లా తిరువంతిపురం దేవనాథ స్వామి ఆలయం ముందున్న రోడ్డుపైనే కొన్ని జంటలు వివాహం చేసుకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రార్థనా స్థలాలన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడమే ఇందుకు కారణం.

Lock down: Marriages held on road in front of temple
లాక్​డౌన్​తో ఆలయం మూత.. రోడ్డు మీదే పెళ్లి

చిన్న తిరుపతి..!

కడలూరు జిల్లాలోని తిరువంతిపురం దేవనాథ స్వామి ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ వందకు పైగా వివాహాలు జరుగుతుంటాయి. దీనికోసం వధూవరుల కుటుంబం ఆలయ అధికారులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే కరోనా రెండో దశ కారణంగా దేవాలయాల్లో వివాహాలు సహా ఇతర వేడుకలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఏప్రిల్ 24న బలమైన ముహూర్తం ఉన్నందున ఈ ఆలయంలో వివాహం నిర్వహించడానికి చాలా కుటుంబాలు సిద్ధమయ్యాయి. కానీ ఆలయ మూసివేతతో రోడ్డు మీదే(ఆలయం ముందు) వివాహాలు జరిపించాయి. ఈ సందర్భంగా దాదాపు 50 జంటలు ఒక్కటయ్యాయి.

ఇవీ చదవండి:

కరోనా కట్టడిలో స్వీయనియంత్రణే కీలకం

కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు

వరుడికి కరోనా- పీపీఈ కిట్​ ధరించిన వధువు

లాక్​డౌన్​తో ఆలయం మూత.. రోడ్డు మీదే పెళ్లి

తమిళనాడు కడలూర్ జిల్లా తిరువంతిపురం దేవనాథ స్వామి ఆలయం ముందున్న రోడ్డుపైనే కొన్ని జంటలు వివాహం చేసుకున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ప్రార్థనా స్థలాలన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించడమే ఇందుకు కారణం.

Lock down: Marriages held on road in front of temple
లాక్​డౌన్​తో ఆలయం మూత.. రోడ్డు మీదే పెళ్లి

చిన్న తిరుపతి..!

కడలూరు జిల్లాలోని తిరువంతిపురం దేవనాథ స్వామి ఆలయాన్ని చిన్న తిరుపతిగా పిలుస్తారు. ప్రత్యేక రోజుల్లో ఇక్కడ వందకు పైగా వివాహాలు జరుగుతుంటాయి. దీనికోసం వధూవరుల కుటుంబం ఆలయ అధికారులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అయితే కరోనా రెండో దశ కారణంగా దేవాలయాల్లో వివాహాలు సహా ఇతర వేడుకలపై తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

ఏప్రిల్ 24న బలమైన ముహూర్తం ఉన్నందున ఈ ఆలయంలో వివాహం నిర్వహించడానికి చాలా కుటుంబాలు సిద్ధమయ్యాయి. కానీ ఆలయ మూసివేతతో రోడ్డు మీదే(ఆలయం ముందు) వివాహాలు జరిపించాయి. ఈ సందర్భంగా దాదాపు 50 జంటలు ఒక్కటయ్యాయి.

ఇవీ చదవండి:

కరోనా కట్టడిలో స్వీయనియంత్రణే కీలకం

కరోనా ఆంక్షలు బేఖాతరు- యువకులతో కప్పగంతులు

వరుడికి కరోనా- పీపీఈ కిట్​ ధరించిన వధువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.