ETV Bharat / bharat

ఐదు రాష్ట్రాలకు ఈసీ 'ఎన్నికల షెడ్యూల్​'

author img

By

Published : Feb 26, 2021, 4:23 PM IST

Updated : Feb 26, 2021, 6:07 PM IST

Live Updates: Election Commission announces polls for 4 states and Union Territory
ఎన్నికల నగారా

17:38 February 26

ఎన్నికల శంఖారావం..

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. 

బంగాల్​లో 8 విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. అసోంలో 3 దశల్లో నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్​ జరగనుంది. ఎన్నికలు మార్చి 27న మొదలై.. 29న ముగియనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.

కరోనా నేపథ్యంలో.. ఈసీ పలు మార్గదర్శకాలను ప్రకటించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్​ సునీల్​ అరోడా ఎన్నికల తేదీలను ప్రకటించారు.

బంగాల్​: 

294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్​లో 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6, ఏప్రిల్​ 10, ఏప్రిల్​ 17, ఏప్రిల్​ 22, ఏప్రిల్​ 26, ఏప్రిల్​ 29 తేదీల్లో వరుసగా పోలింగ్​ జరగనుంది. 

అసోం:

ఈశాన్య రాష్ట్రం అసోంలో 126 స్థానాలకు 3 దశల్లో పోలింగ్​ జరగనుంది. 

మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 

తమిళనాడు:

రాష్ట్రంలోని 234 స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్​ 6న పోలింగ్​ జరగనుంది. 

కేరళ:

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్​ 6న ఒకే దశలో పోలింగ్​ నిర్వహించనున్నారు.

పుదుచ్చేరి:

ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్​ 6న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 

17:23 February 26

బంగాల్​లో 8 విడతల్లో పోలింగ్​

  • తొలి దశ:- 30 సీట్లకు 27 మార్చిన పోలింగ్​
  • రెండో దశ:- 30 సీట్లకు ఏప్రిల్​ 1న పోలింగ్​
  • మూడో దశ:- 31 సీట్లకు ఏప్రిల్​ 6న పోలింగ్​
  • నాలుగో దశ:- 44 సీట్లకు ఏప్రిల్​ 10న పోలింగ్​
  • ఐదో దశ:-45  సీట్లకు ఏప్రిల్​ 17న పోలింగ్​
  • ఆరో దశ:- 43 సీట్లకు ఏప్రిల్​ 22న పోలింగ్​
  • 7వ దశ:- 36 సీట్లకు ఏప్రిల్​ 26న పోలింగ్​
  • 8వ దశ:- 35 సీట్లకు ఏప్రిల్​ 29న పోలింగ్​

17:20 February 26

తమిళనాడు.. పుదుచ్చేరి

  • ఏప్రిల్​ 6న తమిళనాడుకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్​ నిర్వహించనున్నారు.
  • పుదుచ్చేరిలోను ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 33 సీట్లకు గానూ ఏప్రిల్​ 6న పోలింగ్​.
  • మే 2న ఫలితాలు విడుదల

17:19 February 26

కేరళలో ఏప్రిల్​ 6న పోలింగ్​..

  • 140 స్థానాలున్న కేరళకు ఏప్రిల్​ 6న పోలింగ్​ జరగనుంది.
  • మల్లాపురం ఉపఎన్నికలకు కూడా అదే రోజున పోలింగ్​ జరగనుంది.
  • మే 2న ఫలితాలు

17:17 February 26

అసోంలో మూడు దశల్లో..

  • 126 అసెంబ్లీ సీట్లున్న అసోంకు.. మూడు దశల్లో ఎన్నికలు.
  • మార్చి 27న తొలి విడత​,  ఏప్రిల్​ 2న రెండో దశ, ఏప్రిల్​ 6న మూడో విదత పోలింగ్​
  • మే 2న ఎన్నికల ఫలితాలు.

17:15 February 26

చివరిగా..

ప్రధాన ఎన్నికల అధికారిగా.. 13 ఏప్రిల్​తో సునీల్​ అరోడా పదవీకాలం ముగియనుంది. దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం..​ తనకు ఇదే చివరి మీడియా సమావేశమన్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు ధన్యవాదాలు తెలిపారు అరోడా.

17:09 February 26

ఆన్​లైన్​లో..

అభ్యర్థులు.. ఆన్​లైన్​లో నామపత్రాలు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు సునీల్​ అరోడా. ఓటింగ్​ సమయాన్ని మరో గంటకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. 

17:05 February 26

వ్యాక్సిన్​ రాకతో...

వ్యాక్సిన్​ రాకతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొంత సులభమైనట్టు పేర్కొన్నారు సునీల్​ అరోడా. తాజా పోలింగ్​కు​ ముందే ఎన్నికల అధికారులందరికీ వ్యాక్సిన్లు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.

16:58 February 26

రోడ్​ షోలకు ఓకే.. కానీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. డోర్​-టు-డోర్​ ప్రచారాలను నియంత్రిస్తున్నట్టు సనీల్​ అరోడా వెల్లడించారు. అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతినిస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్​ షోలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

16:45 February 26

826 సీట్లు..

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. 826 సీట్లకు పోలింగ్​ జరగనున్నట్టు సునీల్​ అరోడా వెల్లడించారు. ఇందుకోసం 2.7లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్టు స్పష్టం చేశారు.

  • బంగాల్‌లో లక్షకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
  • తమిళనాడులో 89 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
  • కేరళలో 40 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
  • అసోంలో 33 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
  • పుదుచ్చేరిలో 1,500 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు

16:44 February 26

మీడియా సమావేశం..

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​పై ఈసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్​లో బిహార్​ ఎన్నికలను నిర్వహించిన తీరును ప్రస్తావించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా. కరోనా సంక్షోభంలోనూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధులకు నివాళులర్పించారు.

16:13 February 26

లైవ్​: ఈసీ మీడియా సమావేశం

బంగాల్​, కేరళ‌ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మరికొద్ది సేపట్లో ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేరళ, బంగాల్‌, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి.. పరిస్థితులను పర్యవేక్షించింది.

17:38 February 26

ఎన్నికల శంఖారావం..

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. 

బంగాల్​లో 8 విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. అసోంలో 3 దశల్లో నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో పోలింగ్​ జరగనుంది. ఎన్నికలు మార్చి 27న మొదలై.. 29న ముగియనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.

కరోనా నేపథ్యంలో.. ఈసీ పలు మార్గదర్శకాలను ప్రకటించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్​ సునీల్​ అరోడా ఎన్నికల తేదీలను ప్రకటించారు.

బంగాల్​: 

294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్​లో 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6, ఏప్రిల్​ 10, ఏప్రిల్​ 17, ఏప్రిల్​ 22, ఏప్రిల్​ 26, ఏప్రిల్​ 29 తేదీల్లో వరుసగా పోలింగ్​ జరగనుంది. 

అసోం:

ఈశాన్య రాష్ట్రం అసోంలో 126 స్థానాలకు 3 దశల్లో పోలింగ్​ జరగనుంది. 

మార్చి 27, ఏప్రిల్​ 1, ఏప్రిల్​ 6 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 

తమిళనాడు:

రాష్ట్రంలోని 234 స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్​ 6న పోలింగ్​ జరగనుంది. 

కేరళ:

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్​ 6న ఒకే దశలో పోలింగ్​ నిర్వహించనున్నారు.

పుదుచ్చేరి:

ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్​ 6న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 

17:23 February 26

బంగాల్​లో 8 విడతల్లో పోలింగ్​

  • తొలి దశ:- 30 సీట్లకు 27 మార్చిన పోలింగ్​
  • రెండో దశ:- 30 సీట్లకు ఏప్రిల్​ 1న పోలింగ్​
  • మూడో దశ:- 31 సీట్లకు ఏప్రిల్​ 6న పోలింగ్​
  • నాలుగో దశ:- 44 సీట్లకు ఏప్రిల్​ 10న పోలింగ్​
  • ఐదో దశ:-45  సీట్లకు ఏప్రిల్​ 17న పోలింగ్​
  • ఆరో దశ:- 43 సీట్లకు ఏప్రిల్​ 22న పోలింగ్​
  • 7వ దశ:- 36 సీట్లకు ఏప్రిల్​ 26న పోలింగ్​
  • 8వ దశ:- 35 సీట్లకు ఏప్రిల్​ 29న పోలింగ్​

17:20 February 26

తమిళనాడు.. పుదుచ్చేరి

  • ఏప్రిల్​ 6న తమిళనాడుకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 సీట్లకు ఒకే విడతలో పోలింగ్​ నిర్వహించనున్నారు.
  • పుదుచ్చేరిలోను ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 33 సీట్లకు గానూ ఏప్రిల్​ 6న పోలింగ్​.
  • మే 2న ఫలితాలు విడుదల

17:19 February 26

కేరళలో ఏప్రిల్​ 6న పోలింగ్​..

  • 140 స్థానాలున్న కేరళకు ఏప్రిల్​ 6న పోలింగ్​ జరగనుంది.
  • మల్లాపురం ఉపఎన్నికలకు కూడా అదే రోజున పోలింగ్​ జరగనుంది.
  • మే 2న ఫలితాలు

17:17 February 26

అసోంలో మూడు దశల్లో..

  • 126 అసెంబ్లీ సీట్లున్న అసోంకు.. మూడు దశల్లో ఎన్నికలు.
  • మార్చి 27న తొలి విడత​,  ఏప్రిల్​ 2న రెండో దశ, ఏప్రిల్​ 6న మూడో విదత పోలింగ్​
  • మే 2న ఎన్నికల ఫలితాలు.

17:15 February 26

చివరిగా..

ప్రధాన ఎన్నికల అధికారిగా.. 13 ఏప్రిల్​తో సునీల్​ అరోడా పదవీకాలం ముగియనుంది. దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం..​ తనకు ఇదే చివరి మీడియా సమావేశమన్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు ధన్యవాదాలు తెలిపారు అరోడా.

17:09 February 26

ఆన్​లైన్​లో..

అభ్యర్థులు.. ఆన్​లైన్​లో నామపత్రాలు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రకటించారు సునీల్​ అరోడా. ఓటింగ్​ సమయాన్ని మరో గంటకు పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. 

17:05 February 26

వ్యాక్సిన్​ రాకతో...

వ్యాక్సిన్​ రాకతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొంత సులభమైనట్టు పేర్కొన్నారు సునీల్​ అరోడా. తాజా పోలింగ్​కు​ ముందే ఎన్నికల అధికారులందరికీ వ్యాక్సిన్లు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు.

16:58 February 26

రోడ్​ షోలకు ఓకే.. కానీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. డోర్​-టు-డోర్​ ప్రచారాలను నియంత్రిస్తున్నట్టు సనీల్​ అరోడా వెల్లడించారు. అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతినిస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్​ షోలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

16:45 February 26

826 సీట్లు..

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. 826 సీట్లకు పోలింగ్​ జరగనున్నట్టు సునీల్​ అరోడా వెల్లడించారు. ఇందుకోసం 2.7లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్టు స్పష్టం చేశారు.

  • బంగాల్‌లో లక్షకు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
  • తమిళనాడులో 89 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
  • కేరళలో 40 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
  • అసోంలో 33 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు
  • పుదుచ్చేరిలో 1,500 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు

16:44 February 26

మీడియా సమావేశం..

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​పై ఈసీ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ నేపథ్యంలో గతేడాది అక్టోబర్​లో బిహార్​ ఎన్నికలను నిర్వహించిన తీరును ప్రస్తావించారు ప్రధాన ఎన్నికల అధికారి సునీల్​ అరోడా. కరోనా సంక్షోభంలోనూ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధులకు నివాళులర్పించారు.

16:13 February 26

లైవ్​: ఈసీ మీడియా సమావేశం

బంగాల్​, కేరళ‌ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి మరికొద్ది సేపట్లో ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేరళ, బంగాల్‌, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి.. పరిస్థితులను పర్యవేక్షించింది.

Last Updated : Feb 26, 2021, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.