కేరళలోని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు లతికా సుభాశ్.. పార్టీ కార్యాలయం ఎదుట శిరోముండనం చేయించుకున్నారు. పార్టీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న లతికా.. ఎట్టుమనూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ పార్టీ అధిష్ఠానం అందుకు అంగీకరించలేదు. దీంతో శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపిన ఆమె.. పార్టీ మహిళా విభాగం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
పార్టీకి ఎంతో చేసినా.. సీటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు లతికా సుభాశ్. లతికా సుభాశ్తో పాటు పలువురు మహిళా నేతలు వారి పదవులకు రాజీనామా చేశారు.