ETV Bharat / bharat

కార్తిక మాసంలో "క్షీరాబ్ది ద్వాదశి" - ఈ రోజున ఏం చేయాలో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2023, 10:52 AM IST

Ksheerabdi Dwadasi 2023 Date and Time in Telugu: కార్తికమాసంలో నెలంతా పవిత్రమైనదే. మరీ ముఖ్యంగా.. కార్తిక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ ఈ ఐదు రోజులు మరింత విశేషమైనవి అని చెబుతారు. ద్వాదశి అనేది.. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. మరి.. ఈ రోజున ఏం చేయాలి? పూజా విధానమేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat

Ksheerabdi Dwadasi 2023 Date and Time in Telugu: మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు.. కార్తిక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని 'బృందావని ద్వాదశి'గా పిలుస్తారు. అసలు క్షీరాబ్ది ద్వాదశి కథ ఏంటి..? ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది..? పూజా విధానం వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

కార్తికమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? - పండితులు ఏం చెబుతున్నారు?

క్షీరాబ్ది ద్వాదశి కథ: వాసుకిని తాడుగానూ, మందర పర్వతాన్ని కవ్వంగానూ చేసుకుని ఈరోజునే దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తుంటారు. పాలకడలి నుంచి వచ్చిన శ్రీమహాలక్ష్మి ఈ రోజు శ్రీ మహా విష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అంటారు. యోగులు, మునులు.. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించి.. కార్తిక శుద్ధ ద్వాదశి రోజు వరకు చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఈరోజున దీక్ష విరమిస్తారు కాబట్టి ఈ పవిత్ర తిథిని.. యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత గురించి భాగవతంలో అంబరీషుడి కథతో పాటూ కార్తికపురాణంలోనూ ప్రస్తావన ఉంది. అది ఏంటంటే..

కార్తిక మాసం: మహేశ్వరుని ఆలయ మహిమలు

అంబరీషుడి కథ: భక్త ప్రహ్లాదుడిలాగానే అంబరీషుడు కూడా శ్రీమహావిష్ణువుకి ప్రియమైన భక్తుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన నభగ మహారాజు కుమారుడు. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు దాటిపోయే లోగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము తినాలి. ఇలా ఓ సారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడు భోజనం చేసే సమయానికి దూర్వాస మహర్షి అక్కడకు వస్తాడు.

భోజన సమయానికి వచ్చిన మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం సరికాదని తెలిసి ఆయన్ని భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే తాను వచ్చేవరకూ వేచి ఉండమని చెప్పి నదికి స్నానమాచరించేందుకు వెళ్లిపోతాడు దూర్వాసుడు. ద్వాదశ ఘడియలు ముగిసిపోతున్నా దూర్వాసుడు తిరిగి రాడు..ఆయన్ని విడిచిపెట్టి భోజనం చేస్తే ఆగ్రహానికి గురికాక తప్పదు..ద్వాదశి ముగిసిపోయాక భోజనం చేస్తే ఉపవాస ఫలితం దక్కదు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో అంబరీషుడు తన కులగురువైన వశిష్టుడి సలహామేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ నీళ్లు తాగి దీక్ష విరిమిస్తాడు.

అప్పుడే స్నానమాచరించి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. పదిరకాల జన్మలనెత్తమని అంబరీషుడిని శపిస్తాడు. అప్పటికప్పుడే ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు. అంబరీషుడిని కరుణించిన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. రాక్షసుడిని సంహరించిన అనంతరం ఆ సుదర్శన చక్రం దూర్వాసుడిని వెంబడిస్తుంది.

ఆ చక్రం బారి నుంచి కాపాడుకునేందుకు అన్ని లోకాలకు వెళ్లిన దూర్వాసుడు మహా విష్ణువుని కూడా శరణువేడతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి ఏమీ చేయలేనని అంబరీషుడినే శరణు వేడుకోమంటాడు. చివరికి దుర్వాసుడు వెళ్లి అంబరీషుడిని శరణు వేడతాడు. దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని, ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దుర్వాసుడిని రక్షిస్తాడు అంబరీషుడు. అలాగే దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని, అవసరం వచ్చినప్పుడు పది అవతారాలుగా లోకరక్షణ కోసం తాను అనుభవిస్తానంటాడు శ్రీమహావిష్ణువు. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా, లేక చదివినా అనేక పాపాలు నశించి, పుణ్యఫలం కలుగుతుందని కార్తిక పురాణంలో ఉంది.

కార్తిక పౌర్ణమి ఎప్పుడు - 26నా? 27వ తేదీనా?

క్షీరాబ్ది ద్వాదశి పూజా సమయం: ధృక్​ పంచాంగం ప్రకారం.. 24 నవంబర్‌, 2023 శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం కార్తిక మాసం శుక్రవారం శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం శుక్రవారం సాయంత్రం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

క్షీరాబ్ది ద్వాదశి రోజున ఏం చేయాలి..? ఈ రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేసి, తులసికోటలో ఉసిరిమొక్కను పెట్టి రెండింటినీ జత చేయాలి. అనంతరం దీపం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ఇంట్లో పూజ చేసుకుని, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, తులసి కోటను లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావించి అలంకరించాలి. తులసి కోట ముందు ఐదు పద్మాల ముగ్గు వేసి.. ఐదు దీపాలు వెలిగించుకోవాలి. శక్తిమేరకు నైవేద్యాలు వండుకోవాలి. తర్వాత ఐదురకాల పండ్లు, తాంబూలం సిద్ధం చేసుకోవాలి.

సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి. తర్వాత ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఈరోజు 365 వత్తులను తులసి కోట వద్ద వెలిగిస్తే.. ఏడాది పాపాలు పోతాయని నమ్ముతారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారమౌతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా.. తులసికోట చుట్టూ దీపాలను వెలిగించి, లక్ష్మీనారాయణులను పూజించి, నివేదన చేసి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి..

కార్తిక పౌర్ణమి.. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం

Ksheerabdi Dwadasi 2023 Date and Time in Telugu: మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు.. కార్తిక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని 'బృందావని ద్వాదశి'గా పిలుస్తారు. అసలు క్షీరాబ్ది ద్వాదశి కథ ఏంటి..? ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది..? పూజా విధానం వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

కార్తికమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? - పండితులు ఏం చెబుతున్నారు?

క్షీరాబ్ది ద్వాదశి కథ: వాసుకిని తాడుగానూ, మందర పర్వతాన్ని కవ్వంగానూ చేసుకుని ఈరోజునే దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని చిలికారు. కాబట్టి చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తుంటారు. పాలకడలి నుంచి వచ్చిన శ్రీమహాలక్ష్మి ఈ రోజు శ్రీ మహా విష్ణువును వివాహం చేసుకుంటుంది. అందుకే లక్ష్మీదేవిని క్షీరాబ్ది కన్యక అంటారు. యోగులు, మునులు.. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రారంభించి.. కార్తిక శుద్ధ ద్వాదశి రోజు వరకు చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఈరోజున దీక్ష విరమిస్తారు కాబట్టి ఈ పవిత్ర తిథిని.. యోగీశ్వర ద్వాదశి అని కూడా అంటారు. క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత గురించి భాగవతంలో అంబరీషుడి కథతో పాటూ కార్తికపురాణంలోనూ ప్రస్తావన ఉంది. అది ఏంటంటే..

కార్తిక మాసం: మహేశ్వరుని ఆలయ మహిమలు

అంబరీషుడి కథ: భక్త ప్రహ్లాదుడిలాగానే అంబరీషుడు కూడా శ్రీమహావిష్ణువుకి ప్రియమైన భక్తుడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన నభగ మహారాజు కుమారుడు. నిత్యం హరినామస్మరణలో మునిగితేలే అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ద్వాదశి వ్రతం అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి ఘడియలు దాటిపోయే లోగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము తినాలి. ఇలా ఓ సారి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తున్న అంబరీషుడు భోజనం చేసే సమయానికి దూర్వాస మహర్షి అక్కడకు వస్తాడు.

భోజన సమయానికి వచ్చిన మహర్షులను విడిచిపెట్టి తాను భుజించడం సరికాదని తెలిసి ఆయన్ని భోజనానికి ఆహ్వానిస్తాడు. అయితే తాను వచ్చేవరకూ వేచి ఉండమని చెప్పి నదికి స్నానమాచరించేందుకు వెళ్లిపోతాడు దూర్వాసుడు. ద్వాదశ ఘడియలు ముగిసిపోతున్నా దూర్వాసుడు తిరిగి రాడు..ఆయన్ని విడిచిపెట్టి భోజనం చేస్తే ఆగ్రహానికి గురికాక తప్పదు..ద్వాదశి ముగిసిపోయాక భోజనం చేస్తే ఉపవాస ఫలితం దక్కదు. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో అంబరీషుడు తన కులగురువైన వశిష్టుడి సలహామేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసీ నీళ్లు తాగి దీక్ష విరిమిస్తాడు.

అప్పుడే స్నానమాచరించి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహిస్తాడు. పదిరకాల జన్మలనెత్తమని అంబరీషుడిని శపిస్తాడు. అప్పటికప్పుడే ఒక రాక్షసుడిని సృష్టించి అంబరీషుడిని సంహరించమంటాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా మారి అంబరీషుడి ఎదుట నిలవగానే భయంతో శ్రీహరిని ప్రార్థిస్తాడు. అంబరీషుడిని కరుణించిన శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తాడు. రాక్షసుడిని సంహరించిన అనంతరం ఆ సుదర్శన చక్రం దూర్వాసుడిని వెంబడిస్తుంది.

ఆ చక్రం బారి నుంచి కాపాడుకునేందుకు అన్ని లోకాలకు వెళ్లిన దూర్వాసుడు మహా విష్ణువుని కూడా శరణువేడతాడు. కానీ ఆయన కూడా తాను అంబరీషుని భక్తికి బందీ కాబట్టి ఏమీ చేయలేనని అంబరీషుడినే శరణు వేడుకోమంటాడు. చివరికి దుర్వాసుడు వెళ్లి అంబరీషుడిని శరణు వేడతాడు. దాంతో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని, ఆ దివ్య చక్రాన్ని స్తుతిస్తూ వేడుకుంటాడు. ఇలా దుర్వాసుడిని రక్షిస్తాడు అంబరీషుడు. అలాగే దుర్వాసుడు ఇచ్చిన శాపాన్ని, అవసరం వచ్చినప్పుడు పది అవతారాలుగా లోకరక్షణ కోసం తాను అనుభవిస్తానంటాడు శ్రీమహావిష్ణువు. ఇలా ఎవరైతే ఈ ద్వాదశి రోజున ఈ కథను విన్నా, లేక చదివినా అనేక పాపాలు నశించి, పుణ్యఫలం కలుగుతుందని కార్తిక పురాణంలో ఉంది.

కార్తిక పౌర్ణమి ఎప్పుడు - 26నా? 27వ తేదీనా?

క్షీరాబ్ది ద్వాదశి పూజా సమయం: ధృక్​ పంచాంగం ప్రకారం.. 24 నవంబర్‌, 2023 శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం కార్తిక మాసం శుక్రవారం శుక్లపక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని, క్షీరాబ్ది ద్వాదశి వ్రతం శుక్రవారం సాయంత్రం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

క్షీరాబ్ది ద్వాదశి రోజున ఏం చేయాలి..? ఈ రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేసి, తులసికోటలో ఉసిరిమొక్కను పెట్టి రెండింటినీ జత చేయాలి. అనంతరం దీపం పెట్టి ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత ఇంట్లో పూజ చేసుకుని, సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, తులసి కోటను లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావించి అలంకరించాలి. తులసి కోట ముందు ఐదు పద్మాల ముగ్గు వేసి.. ఐదు దీపాలు వెలిగించుకోవాలి. శక్తిమేరకు నైవేద్యాలు వండుకోవాలి. తర్వాత ఐదురకాల పండ్లు, తాంబూలం సిద్ధం చేసుకోవాలి.

సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి వాయనం ఇవ్వాలి. తర్వాత ఉపవాస దీక్షను విరమించుకోవాలి. ఈరోజు 365 వత్తులను తులసి కోట వద్ద వెలిగిస్తే.. ఏడాది పాపాలు పోతాయని నమ్ముతారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడం వల్ల పరిహారమౌతుందని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా.. తులసికోట చుట్టూ దీపాలను వెలిగించి, లక్ష్మీనారాయణులను పూజించి, నివేదన చేసి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి..

కార్తిక పౌర్ణమి.. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత పవిత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.