ETV Bharat / bharat

కేరళలో కరోనా తగ్గుముఖం- కోటి డోసులకు చేరువలో 'వ్యాక్సినేషన్'​

author img

By

Published : Oct 18, 2021, 9:38 PM IST

కేరళలో కరోనా వ్యాప్తి(Kerala Covid Cases News) తగ్గుముఖం పడుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 6,676 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 60 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 1,485 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. మరోవైపు.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 98.59 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.

kerala corona cases
కేరళలో కరోనా కేసులు

కరోనా విజృంభణతో విలవిల్లాడిన కేరళ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ రాష్ట్రంలో వైరస్​ వ్యాప్తి(Kerala Covid Cases News) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 6,676 మంది.. వైరస్(Kerala Corona Cases) బారిన పడినట్లు తేలింది. వైరస్​ కారణంగా మరో 60 మంది మృతి చెందారు. ఫలితంగా ఇప్పటివరకు కేరళలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,51,791కి చేరింది. మరణాల సంఖ్య 26,925కు పెరిగింది. మరో 11,023 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 83,184గా ఉంది.

మహారాష్ట్రలో కొత్తగా 1,485 మందికి కరోనా(Maharashtra Coronavirus) సోకింది. మరో 27 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 65,93,182కు చేరగా.. మరణాల సంఖ్య 1,39,816కు పెరిగింది. మరో 2,078 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

దేశ రాజధాని దిల్లీ 15 కొవిడ్​(Delhi Covid Cases Today) కొత్త కేసులు బయటపడ్డాయి. వైరస్​ కారణంగా కొత్తగా ఎవరూ చనిపోలేదు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,192 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,423 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. 488 మంది కోలుకోగా.. 12 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 340 మందికి కరోనా సోకగా.. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 508 మంది వైరస్​ను జయించారు.
  • బంగాల్​లో 690 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. 12 మంది మరణించారు.
  • గుజరాత్​లో​ 18, మధ్యప్రదేశ్​లో 6 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 98.59 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి:

కరోనా విజృంభణతో విలవిల్లాడిన కేరళ.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆ రాష్ట్రంలో వైరస్​ వ్యాప్తి(Kerala Covid Cases News) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 6,676 మంది.. వైరస్(Kerala Corona Cases) బారిన పడినట్లు తేలింది. వైరస్​ కారణంగా మరో 60 మంది మృతి చెందారు. ఫలితంగా ఇప్పటివరకు కేరళలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,51,791కి చేరింది. మరణాల సంఖ్య 26,925కు పెరిగింది. మరో 11,023 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 83,184గా ఉంది.

మహారాష్ట్రలో కొత్తగా 1,485 మందికి కరోనా(Maharashtra Coronavirus) సోకింది. మరో 27 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 65,93,182కు చేరగా.. మరణాల సంఖ్య 1,39,816కు పెరిగింది. మరో 2,078 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

దేశ రాజధాని దిల్లీ 15 కొవిడ్​(Delhi Covid Cases Today) కొత్త కేసులు బయటపడ్డాయి. వైరస్​ కారణంగా కొత్తగా ఎవరూ చనిపోలేదు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,192 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,423 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 214 కరోనా కేసులు నమోదయ్యాయి. 488 మంది కోలుకోగా.. 12 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 340 మందికి కరోనా సోకగా.. మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 508 మంది వైరస్​ను జయించారు.
  • బంగాల్​లో 690 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. 12 మంది మరణించారు.
  • గుజరాత్​లో​ 18, మధ్యప్రదేశ్​లో 6 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 98.59 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.