ETV Bharat / bharat

కేరళలో కరోనా తగ్గుముఖం- కొత్తగా 18 వేల కేసులు

author img

By

Published : Aug 8, 2021, 9:45 PM IST

కేరళలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 18 వేల మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 5వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

corona cases
దేశంలో కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 18,067 కేసులు నమోదయ్యాయి. మరో 20,108 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 93 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35.52 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,747 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

మహారాష్ట్రలో కొత్తగా 5,508 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 1,598 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 20 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 36,793కు పెరిగింది.

మరోవైపు.. దిల్లీలో 66 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా ఎవరూ చనిపోలేదు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,956 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 58 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా కొత్త మరణాలేవీ నమోదు కాలేదు.
  • బంగాల్​లో కొత్తగా 675 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 12 మంది మరణించారు.
  • గుజరాత్​లో 25 కేసులు నమోదు కాగా.. మధ్యప్రదేశ్​లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • రాజస్థాన్​లో మరో 15 మందికి కరోనా సోకినట్లు తేలింది.
  • ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 66 మంది మరణించారు.

ఇదీ చూడండి: డెల్టా గుప్పెట్లో ప్రపంచదేశాలు- అమెరికాలో లక్షకుపైగా కేసులు

ఇదీ చూడండి: టీకా కేంద్రం వద్ద కర్రలతో కొట్టుకున్న జనం

కేరళలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 18,067 కేసులు నమోదయ్యాయి. మరో 20,108 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 93 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35.52 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,747 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

మహారాష్ట్రలో కొత్తగా 5,508 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 1,598 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 20 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 36,793కు పెరిగింది.

మరోవైపు.. దిల్లీలో 66 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా ఎవరూ చనిపోలేదు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,956 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 58 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా కొత్త మరణాలేవీ నమోదు కాలేదు.
  • బంగాల్​లో కొత్తగా 675 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 12 మంది మరణించారు.
  • గుజరాత్​లో 25 కేసులు నమోదు కాగా.. మధ్యప్రదేశ్​లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • రాజస్థాన్​లో మరో 15 మందికి కరోనా సోకినట్లు తేలింది.
  • ఒడిశాలో కొత్తగా 1,315 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 66 మంది మరణించారు.

ఇదీ చూడండి: డెల్టా గుప్పెట్లో ప్రపంచదేశాలు- అమెరికాలో లక్షకుపైగా కేసులు

ఇదీ చూడండి: టీకా కేంద్రం వద్ద కర్రలతో కొట్టుకున్న జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.