ETV Bharat / bharat

కేరళలో తగ్గిన కొవిడ్ వ్యాప్తి- కొత్తగా 17 వేల కేసులు

కేరళ, మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేరళలో కొత్తగా 17 వేలకు పైగా కేసులు (Kerala Covid Cases) బయటపడగా.. మహారాష్ట్రలో 3,286 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది.

author img

By

Published : Sep 24, 2021, 8:25 PM IST

Updated : Sep 24, 2021, 9:47 PM IST

covid
కొవిడ్

దేశవ్యాప్తంగా కొవిడ్​ వ్యాప్తి స్వల్పంగా తగ్గింది. కేరళలో (Kerala Covid Cases) కొత్తగా 17,983 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 127 మంది మరణించినట్లు తెలిపింది.

అదే సమయంలో 15,054 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని కేరళ వైద్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,62,846గా ఉందని వివరించింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో కొత్తగా 3,286 కేసులు (Covid cases in Maharashtra) వెలుగులోకి వచ్చాయి. 51 మంది కొవిడ్​కు బలయ్యారు. మరో 3,933 మంది కొవిడ్​ను జయించారు.
  • కర్ణాటకలో 789 కేసులు (Covid cases in Karnataka) బయటపడ్డాయి. 23 మంది కరోనాతో చనిపోయారు. 1,050 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.
  • దేశరాజధాని దిల్లీలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా సంభవించలేదు.
  • మిజోరాంలో కొత్తగా 1,257 కేసులు నమోదవ్వగా, గోవాలో 84 మంది కొవిడ్ బారిన పడ్డారు.

వ్యాక్సినేషన్..

దేశవ్యాప్తంగా 84.42 కోట్ల కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. శుక్రవారం ఒక్కరోజే 64 లక్షలకు పైగా మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

వారందరికీ ఇంటి వద్దే టీకా: కేంద్రం

దేశవ్యాప్తంగా కొవిడ్​ వ్యాప్తి స్వల్పంగా తగ్గింది. కేరళలో (Kerala Covid Cases) కొత్తగా 17,983 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 127 మంది మరణించినట్లు తెలిపింది.

అదే సమయంలో 15,054 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని కేరళ వైద్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,62,846గా ఉందని వివరించింది.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో కొత్తగా 3,286 కేసులు (Covid cases in Maharashtra) వెలుగులోకి వచ్చాయి. 51 మంది కొవిడ్​కు బలయ్యారు. మరో 3,933 మంది కొవిడ్​ను జయించారు.
  • కర్ణాటకలో 789 కేసులు (Covid cases in Karnataka) బయటపడ్డాయి. 23 మంది కరోనాతో చనిపోయారు. 1,050 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.
  • దేశరాజధాని దిల్లీలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా సంభవించలేదు.
  • మిజోరాంలో కొత్తగా 1,257 కేసులు నమోదవ్వగా, గోవాలో 84 మంది కొవిడ్ బారిన పడ్డారు.

వ్యాక్సినేషన్..

దేశవ్యాప్తంగా 84.42 కోట్ల కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. శుక్రవారం ఒక్కరోజే 64 లక్షలకు పైగా మందికి వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

వారందరికీ ఇంటి వద్దే టీకా: కేంద్రం

Last Updated : Sep 24, 2021, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.